Wednesday, December 26, 2012

సూరీడు ఇంట్లో ఏసీబీ సోదాలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడు ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. జూబ్లిహిల్స్‌ గాయత్రినగర్‌లోని సూరీడు నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయ్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రిపుంజయ్‌రెడ్డి, సూరీడులు కలిసి ఆస్తులు కూడబెట్టారని చెప్పారు.

ఏపీపీఎస్సీ సభ్యుడి ఇంటిపై ఏసీబీ దాడి

ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయరెడ్డి ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. యూసఫ్‌గూడలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాలో కొన్ని బ్యాంక్‌ పత్రాలతో పాటు మరికొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని, ఇంటర్‌ బోర్డు, ఏపీపీఎస్సీ సభ్యుడిగా అవినీతి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో రిపుంజయ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.




No comments:

Post a Comment