గ్రూప్-2లో 9 మంది అభ్యర్థులకు అడ్డదారిలో సహకారం
పరీక్ష ప్రారంభమైన 50 నిమిషాలకు లోపలికి అనుమతి
నేరుగా పరీక్ష గదుల్లోకి..
ఏపిపిఎస్సి సభ్యుడు పద్దయ్య నిర్వాకం
అదేరోజు నివేదిక పంపిన గుంటూరు కలెక్టర్
లక్షలమంది అభ్యర్థులు ఎన్నో ఆశలతో జులైలో గ్రూప్-2 పరిక్షలు రాశారు. కాని, వీరిలో 9 మంది అసాధారణ రీతిలో పరీక్ష రాయడం చర్చనీయంశామైంది. దాదాపు 50 నిముషాలు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చిన వీరిని ఏపిపిఎస్సి సభ్యుడు జి.పద్దయ్య హాలులోకి అనుమతించడం పలు సందేహాలకు తావిస్తుంది. అధికారుల అభ్యంతరాలను భేఖాతరు చేస్తూ అభ్యర్థులు పరీక్షరాయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం పై గుంటూరు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ అదే రోజు ఏపిపీస్సికి నివేదికను పంపించారు. పద్దయ్య తీరు పై కమిషన్ లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలియవచ్చింది. ఈ తొమ్మిది మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
వివిధ ఉద్యోగాల భర్తీకి ఏపిపిఎస్సి నిర్వహించే గ్రూప్ పరిక్షల నిర్వహణను కమిషన్ లోని సభ్యులందరూ పర్యవేక్షిస్తుంటారు. దీనికోసం వారు ఆయా జిల్లాలకు వెళుతుంటారు. ఈ ఏడాది జూలై 21న నిర్వహించిన గ్రూప్-2 (837 పోస్టులు) పరీక్షకు 4.5 లక్షలమంది కి పైగా పోటిపడ్డారు. ఈ పరీక్ష జరిగిన కేంద్రాల్లో గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంట లోని ప్రియదర్శిని ఇన్స్టిట్యుట్ అండ్ మేనేజ్ మెంట్ (సెంటర్ కోడ్ – 07049) ఒకటి. ఈ కేంద్రాన్ని పద్దయ్య సందర్శించారు. ఈ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు ( పరీక్ష ప్రారంభ సమయం) ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. ఆ తరువాత ఆయా గదుల్లోకి వెళ్ళిన అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలను ఇన్విజిలేటర్లు అందచేశారు. పరీక్ష రాయడంలో అభ్యర్థులు మునిగిపోయారు. దాదాపు 50 నిమిషాల సమయం గడిచాక మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో పరీక్ష కేంద్రం తలుపులు తెరుచుకోన్నాయి. తొమ్మిది మంది అభ్యర్దులు టివీగా పరీక్ష కేంద్రంలోనికి ప్రవేశించారు. ఈ పరిణామంతో విడుల్లో ఉన్న అధికారులు ఆశ్చర్యపోయారు. ఆలస్యంగా వచ్చిన ఆ అభ్యర్థులను అక్కడి చీఫ్ సూపరిండేంట్ డాక్టర్ పీ డీ రత్నకుమార్ నిలదీయగా వారు పద్దయ్య పేరు చెప్పారు. ఆ తర్వాత ఆ 9 మంది, మిగిలిన అభ్యర్థులతో పాటు పరీక్ష రాశారు. “ తన ముందస్తు అనుమతి లేకుండానే 9 మంది లోపలికి వచ్చారని, తాను దీనిపై ప్రశ్నిస్తే పద్దయ్య తానే పూర్తి భాద్యత వహిస్తానని చెప్పారని, మానవీయ కోణంలో పరీక్షను రాయనివ్వాలని కోరారని” రాత్నరాజు తన నివేదికలో కలెక్టర్ కో తెలిపారు. ఇదే విషయాన్నీ అక్కడ అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్ గా వ్యవహరించిన వ్యక్తి కూడా తన నివేదికలో పేర్కొన్నారు.
పరీక్ష ప్రారంభమైన 50 నిమిషాలకు లోపలికి అనుమతి
నేరుగా పరీక్ష గదుల్లోకి..
ఏపిపిఎస్సి సభ్యుడు పద్దయ్య నిర్వాకం
అదేరోజు నివేదిక పంపిన గుంటూరు కలెక్టర్
![]() |
| పద్దయ్య |
వివిధ ఉద్యోగాల భర్తీకి ఏపిపిఎస్సి నిర్వహించే గ్రూప్ పరిక్షల నిర్వహణను కమిషన్ లోని సభ్యులందరూ పర్యవేక్షిస్తుంటారు. దీనికోసం వారు ఆయా జిల్లాలకు వెళుతుంటారు. ఈ ఏడాది జూలై 21న నిర్వహించిన గ్రూప్-2 (837 పోస్టులు) పరీక్షకు 4.5 లక్షలమంది కి పైగా పోటిపడ్డారు. ఈ పరీక్ష జరిగిన కేంద్రాల్లో గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంట లోని ప్రియదర్శిని ఇన్స్టిట్యుట్ అండ్ మేనేజ్ మెంట్ (సెంటర్ కోడ్ – 07049) ఒకటి. ఈ కేంద్రాన్ని పద్దయ్య సందర్శించారు. ఈ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు ( పరీక్ష ప్రారంభ సమయం) ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. ఆ తరువాత ఆయా గదుల్లోకి వెళ్ళిన అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలను ఇన్విజిలేటర్లు అందచేశారు. పరీక్ష రాయడంలో అభ్యర్థులు మునిగిపోయారు. దాదాపు 50 నిమిషాల సమయం గడిచాక మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో పరీక్ష కేంద్రం తలుపులు తెరుచుకోన్నాయి. తొమ్మిది మంది అభ్యర్దులు టివీగా పరీక్ష కేంద్రంలోనికి ప్రవేశించారు. ఈ పరిణామంతో విడుల్లో ఉన్న అధికారులు ఆశ్చర్యపోయారు. ఆలస్యంగా వచ్చిన ఆ అభ్యర్థులను అక్కడి చీఫ్ సూపరిండేంట్ డాక్టర్ పీ డీ రత్నకుమార్ నిలదీయగా వారు పద్దయ్య పేరు చెప్పారు. ఆ తర్వాత ఆ 9 మంది, మిగిలిన అభ్యర్థులతో పాటు పరీక్ష రాశారు. “ తన ముందస్తు అనుమతి లేకుండానే 9 మంది లోపలికి వచ్చారని, తాను దీనిపై ప్రశ్నిస్తే పద్దయ్య తానే పూర్తి భాద్యత వహిస్తానని చెప్పారని, మానవీయ కోణంలో పరీక్షను రాయనివ్వాలని కోరారని” రాత్నరాజు తన నివేదికలో కలెక్టర్ కో తెలిపారు. ఇదే విషయాన్నీ అక్కడ అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్ గా వ్యవహరించిన వ్యక్తి కూడా తన నివేదికలో పేర్కొన్నారు.

No comments:
Post a Comment