డీఎస్సీ -2012 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ నెల 22న అభ్యర్థుల ప్రాథమిక జాబితాను వెల్లడిస్తారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను 23, 24 తేదీల్లో పరిశీలించి, 26న తుది జాబితాను వెల్లడిస్తారు. 27, 28 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు పాఠశాల కమిషనర్ శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న జాబితాలను రద్దు చేసి తాజా జాబితా ప్రకారం నియామకాలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 610 జీవోకు అనుగుణంగా నాన్లోకల్ అభ్యర్థులను కట్టడి చేసే విధంగా మొదటి 20 శాతం ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఒకసారి, మిగతా 80 శాతం కేటగిరీ అభ్యర్థులకు ఒకసారి ప్రక్రియ చేపట్టి భర్తీ చేయాలని ఆదేశించారు.
No comments:
Post a Comment