Friday, October 19, 2012

గ్రూప్-2కు ప్రత్యేక నోటిఫికేషన్ కోసం ఇందిరాపార్క్ వద్ద నేడు ఆర్.కృష్ణయ్య భారీ ధర్నా

గ్రూప్-2 లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో విలీనం చేయవద్దని, గ్రూప్-2 ఉద్యోగాలకు  ఎప్పటిలాగే ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలని, ఈ కేడర్ లో ఖాళీగా ఉన్న 6 వేల ఉద్యోగాలను భర్తీ  చేయాలనే డిమాండ్లతో శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలిరావాలని పిలుపిచ్చారు. గ్రూప్-2 పోస్టుల్ని గ్రూప్-1 లో విలీనం చేస్తే గ్రామీణ పేద  అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. 


హైదరాబాద్ లో గ్రూప్ 2 కోసం కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అందరు ఇందిరాపార్క్ వద్ద గల ధర్నా లో పాల్గొని విజయవంతం చేయాలనీ మనవి.

No comments:

Post a Comment