Tuesday, October 30, 2012

SUPREME COURT STAY ORDER ON GROUP 2 2008 WHITENER CASE

S U P R E M E C O U R T O F I N D I A RECORD OF PROCEEDINGS


Petition(s) for Special Leave to Appeal (Civil) No(s).30781/2012

(From the judgement and order dated 21/08/2012 in WP No.6484/2012 of The

HIGH COURT OF A.P AT HYDERABAD)

A.P.PUBLIC SER.COMMN. Petitioner(s)

VERSUS

N.KYLASA RAO & ORS. Respondent(s)

(With appln(s) for exemption from filing c/c of the impugned Judgment and

with prayer for interim relief)

Date: 29/10/2012 This Petition was called on for hearing today.

CORAM :

HON'BLE DR. JUSTICE B.S. CHAUHAN

HON'BLE MR. JUSTICE JAGDISH SINGH KHEHAR

For Petitioner(s) Mr. Pramod Swaroop, Sr. Adv.

Mrs. Anjani Aiyagari,Adv.

Mr. G. Vivekanand, Adv.

Mr. D. Rajeswar Rao, Adv.

Mr. Ram Lal Roy, Adv.

For Respondent(s) Mr. H.S. Guraraja Rao, Sr. Adv.

Mr. T.V. Ratnam, Adv.

Mr. Munawwar Naseem, Adv.

Mr. J. Sudheer, Adv.

Mr. M. Sowri Dev, Adv.

UPON hearing counsel the Court made the following

O R D E R

Leave granted.

There shall be stay of the impugned judgment, until further orders.


(DEEPAK MANSUKHANI)
(M.S. NEGI)
Court Master

2008 గ్రూప్-2 ఫలితాలను విడుదల చేయనున్న ఎపిపిఎస్సి

2008 గ్రూప్-2 ఫలితాలు ఈ రోజు రాత్రి లేదా ఉదయం విడుదలయ్యే  అవకాశం ఉంది. హై కోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీమ్ కోర్ట్ స్టే ఇవ్వడంతో ఫలితాలను ఎపిపిఎస్సి విడుదల చేస్తున్నది.

APPSC DISPLAYED EXTENSION OFFICER WOMEN & CHILD WELFARE (36/2011) EXAM ANSWER KEY

APPSC DISPLAYED ASO (30/2011) EXAM ANSWER KEY

• Key for Notification No. 30/2011 , Dated : 27/12/2011 , ASSISTANT STATISTICAL OFFICER:: PAPER-1SERIES: A600 - G.S. & M.A.


• Key for Notification No. 30/2011 , Dated : 27/12/2011 , ASSISTANT STATISTICAL OFFICER (30/2011) :: PAPER-2SERIES: A640 - ECONOMICS


• Key for Notification No. 30/2011 , Dated : 27/12/2011 , ASSISTANT STATISTICAL OFFICER :: PAPER-2SERIES: A641 - MATHEMATICS


• Key for Notification No. 30/2011 , Dated : 27/12/2011 , ASSISTANT STATISTICAL OFFICER :: PAPER-2SERIES: A644 - COMMERCE


• Key for Notification No. 30/2011 , Dated : 27/12/2011 , ASSISTANT STATISTICAL OFFICER :: PAPER-2SERIES: A643 - COMPUTER SCIENCE


• Key for Notification No. 30/2011 , Dated : 27/12/2011 , ASSISTANT STATISTICAL OFFICER :: PAPER-2SERIES: A642 - STATISTICS


I am giving edit permission to each and every one, please update your marks according to appsc key.

CLICK HERE TO UPDATE YOUR MARKS.



హలం పట్టి పొలం దున్ని నేడు డిప్యూటీ తహసిల్దార్

* నిన్న ఇంటింటికీ తిరిగి మిఠాయిలమ్మిన వ్యక్తి.. నేడు కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్‌గల స్వీట్ల వ్యాపారానికి అధిపతి.

* మొన్న వీధి చివర పాలప్యాకెట్లు అమ్ముకున్న వ్యక్తి.. నేడు కోటిమందికి ప్రతిరోజూ ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమానికి అధిపతి.

* అటు మొన్న పదవ తరగతి మూడుసార్లు ఫెయిలైన వ్యక్తి.. నేడు అంతర్జాతీయ బిజినెస్ స్కూల్‌లో ఆతిథ్య ఉపన్యాసకుడు.

ఇవన్నీ అదృష్టాలు కావు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా ఎదుర్కొంటూ నిరంతరకృషి, పట్టుదలతో అనుకున్నది సాధించిన విజయగాథలు.

ఇటీవలి గ్రూప్-2 లో బెస్ట్ ర్యాంకర్‌గా నిలిచిన బేగంపేట శ్రీకాంత్‌రెడ్డి విజయగాథ కూడా పైన ప్రస్తావించిన స్ఫూర్తిదాయక ప్రస్థానాలకు తాజా నిదర్శనంగా నిలుస్తుంది.

రెండు మూడు ఎకరాల పేద రైతు కుటుంబానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి ఇల్లు గడవడానికి సరిపడా ఆదాయం వచ్చే ఓ చిన్నపాటి ఉద్యోగం రావడమే గొప్పగా భావించే ఆర్థిక పరిస్థితుల నేపథ్యాన్ని చీల్చుకొని రాష్ట్రప్రభుత్వంలో ఉన్నత హోదాలో డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇంటర్ నుంచే ఇంటికి సాయం

పాఠశాల దశనుంచే మంచి మార్కులతో పాసయిన శ్రీకాంత్‌రెడ్డికి కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన ఉన్నత చదువు కలగానే మిగిలిపోయింది. ఇల్లు గడవడానికి ఉన్న రెండు మూడు ఎకరాల పొలంలో పండే మొక్కజొన్న పంటే ఆధారం. ఆర్థికస్థితితో పాటు బాగా చదివించాలనే చైతన్యం కూడాలేని సామాజిక వాతావరణం. తండ్రితోపాటు తాను కూడా వ్యవసాయ పనులకు వెళ్ళేవాడు. అలా వ్యవసాయ పనులు చేస్తూనే ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ కోర్సులు అభ్యసించాడు. మధ్యాహ్నం వరకూ కాలేజీలో తరగతులకు హాజరై, మధ్యాహ్నం నుంచి పార్ట్‌టైం కలెక్షన్‌బాయ్‌గా ఉద్యోగం చేసేవాడు. పొలంలో పనిచేస్తున్నప్పుడే శ్రీకాంత్‌రెడ్డి దృష్టి స్థానికంగా ప్రభుత్వ హోదాతో తిరిగే తహశీల్దార్‌పై పడింది. అప్పుడే మనసులో ఆ లక్ష్యంపట్ల బలమైన పునాది పడింది. పార్ట్‌టైం కలెక్షన్ బాయ్‌గా చేస్తూనే డిగ్రీ కూడా పూర్తి చేసిన శ్రీకాంత్ కొంతకాలంపాటు పౌల్ట్రీఫామ్‌లో పనిచేశాడు. ఆ తరువాత తానే స్వయంగా ఒక పౌల్ట్రీఫామ్‌ను ప్రారంభించాడు. బ్యాంక్ నుంచి రుణం తీసుకొని ప్రారంభించడం వలన ఆ అప్పును తొందరగా తీర్చాలనే బాధ్యతతో పౌల్ట్రీ యూనిట్ మొత్తాన్ని తానే దగ్గరుండి చూసుకునేవాడు శ్రీకాంత్‌రెడ్డి.

లక్ష్యం దిశగా తొలి అడుగు

తనకు, తన కుటుంబానికి ఆర్థికపరంగా వున్న సమస్యలను ఒక్కొక్కదాన్నీ పరిష్కరించుకుంటూ అనుకున్నది సాధించడానికి ఒక దీర్ఘకాలిక వ్యూహాన్నే వేసుకున్నాడు శ్రీకాంత్. కానీ తాను ఉన్న పరిస్థితులలో అనుకున్నది సాధించడం అంత తేలిక కాదు. ఒక్కోసారి అసలు తాను ఆ పోస్టును పొందగలడా? అనే అనుమానం కూడా శ్రీకాంత్‌కి కలిగేదట. కానీ కేవలం అలా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదని ఒక వైపు పౌల్ట్రీఫాంను నిర్వహిస్తూనే, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని నిర్ణయించుకున్నాడు శ్రీకాంత్.

గ్రూప్ సర్వీసు గురి తప్పలేదు

గ్రూప్ సర్వీసులలో ఆర్‌డీఓ, డిప్యూటీ తహశీల్దార్ పోస్టులను లక్ష్యంగా పెట్టుకొని 2004లో ప్రిపరేషన్ ప్రారంభించాడు శ్రీకాంత్. ఆర్.సి.డ్డి, ఐ.ఎ.ఎస్ స్టడీ సర్కిల్‌లో 2004 గ్రూప్-1 కోసం కోచింగ్ తీసుకున్నాడు. మొదటి ప్రయత్నంలోనే 7 మార్కుల వ్యత్యాసంతో గ్రూప్-1 ఇంటర్వ్యూ మిస్ అయింది. ఆ తర్వాత 2007లో గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యాడు. అందులో కూడా 15 మార్కుల తేడాతో నాన్ ఎగి్జ్యూటివ్ పోస్ట్ చేజారిపోయింది. ఈ వైఫల్యాలేవీ శ్రీకాంత్ మనోధైర్యాన్ని దెబ్బతీయలేదు. పైగా మరింత కసిగా చదవడం మొదలెట్టాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా గ్రూప్-1 పరీక్షలతోపాటు, గ్రూప్-2 పరీక్షలకు కూడా హాజరు కావాలని నిర్ణయించు కున్నాడు.

గ్రూప్-1 మెయిన్స్ జరిగిన నెలరోజుల్లోనే గ్రూప్-2 పరీక్షలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. శ్రీకాంత్‌రెడ్డి అనుకున్నది సాధించాడు. గ్రూప్-2 ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకర్‌గా, ఆరవ జోన్ స్థాయిలో ఆరో ర్యాంకర్‌గా నిలిచాడు.

రంగారెడ్డి జిల్లాలోని షామీర్‌పేట మండలంలోని కొల్తూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి దీర్ఘకాలిక ప్రణాళికతో, ఆశావాదంతో, గట్టి పట్టుదలతో తాను కోరుకున్న డిప్యూటీ తహశీల్దార్ పోస్టును సాధించి చూపెట్టాడు. అదే పేద కుటుంబ నేపథ్యం కలిగి తాము సాధించలేమేవెూ అనుకునే ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచాడు శ్రీకాంత్‌రెడ్డి.

Monday, October 29, 2012

భైరవకోన.....

భైరవకోన 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం.  ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం, కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది. పల్లవుల కాలంనాటి అద్భుత శిల్పకళకు సాక్షీభూతంగా నిలుస్తున్న, ప్రసిద్ధి గాంచిన పురాతన గుహలకు నెలవు భైరవకోన...

ఒకే రాయిలో అష్టశివాలయాలు - భైరవకోన
సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది .   ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీకపౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆరోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాత సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు. కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచి ఉన్నదే. ఆంధ్రప్రదేశ్‌లో వీటి జాబితా చాలానే ఉంది. గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం (విజయవాడ), బొజ్జనకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే ప్రకాశంజిల్లాలోని సీతారామపురం మండలంలోని భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి.వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి.

ఒకేచోట త్రిమూర్తులు...

ఇక్కడ ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. దీనికి ఎదురుగా నంది ఉంటుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ. మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాలయం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోపాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కివుండడం విశేషం. త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన ప్రదేశంగా ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది. అంతేకాదు ఈ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా. ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడనుంచే సేకరిస్తుంటారు.

పల్లవ గుహాలయాలు...

ఇక్కడి ఆలయాలకు మహాబలిపురంలోని ఆలయ నిర్మాణ శిల్పశైలికి సారూప్యం ఉండటంతో ఈ గుహాలయాలను పల్లవుల కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. క్రీశ 600-630 కాలానికి చెందిన మహేంద్రవర్మ పాలనలోనే ఈ గుహాలయాలు ప్రారంభించి ఉంటారన్నది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఐదోగుహలోని స్తంభాలమీద ఉన్న నరనరేంద్రుడు, శ్రీత్రిభువనాదిత్యం... వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళుక్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొనసాగి ఉంటుందని అంచనా. ఇక్కడ ఈ గుహాలయాలతో పాటు చుట్టుపక్కల ఉన్న గుండాలనూ దోనల్నీ చూడొచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలు, పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు ఇక్కడ దర్శనీయస్థలాలు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే కాలినడక తప్పనిసరి.

కోనకు ఎలా వెళ్లాలంటే...

భైరవకోనకు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా అంబవరం, కొత్తపల్లి చేరు కుంటే అక్కడినుండి ఉదయం నుంచి రాత్రి 10 గంటలవరకూ బస్సు సౌకర్యం ఉంటుంది. అటవీప్రాంతం కాబట్టి నిర్వాకులు ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంది.

మళ్ళీ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు ఎప్పుడు?

 సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్లపై నాలుగైదు నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన త్వరలో తొలగిపోనున్నది. గూప్-1, లెక్చరర్స్ వంటి పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూలు పరిమితం చేయకుండా, ఎగ్జిక్యూటివ్ కేటగిరి పోస్టులన్నింటికీ ఇంటర్వ్యూలు కొనసాగించాలని కమిషన్ సభ్యులు చేసిన ప్రతిపాదనలపై అధ్యయనం చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై గత రెండు నెలలుగా పరిశీలిస్తున్న సాధారణ పాలనాశాఖ (జి.ఎ.డి) న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరింది. కాగా అక్టోబర్ రెండో వారంలో ఇంటర్వ్యూలు గ్రూప్-1 లెక్చరర్ వంటి పోస్టులకు మాత్రమే పరిమితం చేయాలంటూ, మిగతా కేటగిరి పోస్టులకు ఇంటర్వ్యూలు అవసరంలేదని, వాటిని కేవలం రాతపరీక్షతో భర్తీ చేసుకోవచ్చని న్యాయశాఖ అభిప్రాయ పడింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలు ఉండని పోస్టులకు సంబంధించిన 420 జి.ఓను న్యాయశాఖ సమర్ధించింది.

ఆపై సాధారణ పాలనా శాఖ అధికారుల నుంచి ఇంటర్వ్యూలు లేని పోస్టుల భర్తీ ఫైలు ఆవెూదానికి రాష్ర్ట ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళిరావాల్సి ఉంటుంది. మరో వారం పదిరోజుల్లో వేటికి ఇంటర్వ్యూలు నిర్వహించాలనే దానిపై రాష్ర్ట ప్రభుత్వం నుంచి కమిషన్‌కు ఆదేశాలు వెళ్ళనున్నాయని సచివాలయ అధికార వర్గాలు భావిస్తున్నాయి. తాజా ఆదేశాలు పొందిన తర్వాత వరుసక్రమంలో ఇప్పటివరకు రాతపరీక్షలు జరిగి ఫలితాలు కోసం వేచి చూస్తున్న పలు పోస్టుల ఫైనల్ రిజల్ట్స్ కమిషన్ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో నవంబర్ మొదటి వారం నుంచి పెండింగ్ పోస్టుల పరీక్ష ఫలితాలు అభ్యర్ధులు ఆశించవచ్చు. ఇదిలా ఉండగా, ఇంటర్వ్యూలు కొనసాగించాలా లేదానేది తేలకపోవటంతో కొన్ని రకాల పోస్టులకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయని సంకట స్థితిలో కమిషన్ ఉంది.

తాజా ఆదేశాలు కమిషన్‌కు చేరిన క్రమంలో పెండింగ్ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. వాస్తవానికి ఈ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు జారీ దశకు చేరుకొని చివరి క్షణంలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కాబట్టి తాజా ఆదేశాలు అందుకున్న వెంటనే పెండింగ్‌లో ఉన్న కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు మొత్తం జారీ చేయనున్నట్లు కమిషన్ అధికారులు వివరించారు. అంటే నవంబర్ మాసంలో కమిషన్ నుంచి ఆరేడు రకాల కొత్త పోస్టుల నోటిఫికేషన్లు పోటీపరీక్షార్థుల ముందుకు రానున్నాయి. ఇంటర్వ్యూల అంశం తేలే అవకాశం ఉండటంతో పరీక్ష ఫలితాల వెల్లడి, ఇటు కొత్త పోస్టుల సందడి కమిషన్ నుంచి అభ్యర్ధులు ఆశించవచ్చు.

బోగస్ డిగ్రీల పాపం

437 మంది ఉపాధ్యాయుల రివర్షన్

డిప్యూటీ డీఈఓలకు నోటీసులు

శాఖాపరమైన చర్యలకు ఆదేశం

మూడేళ్ల తర్వాత కదిలిన డొంక

చెల్లని పట్టాలు.. నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉచ్చు బిగుసుకుంది. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో అడ్డదారిలో ప్రమోషన్లు పొందిన 437 మంది స్కూల్ అసిస్టెంట్లపై చర్యలకు ఆదేశాలు వెలువడ్డాయి. వరంగల్ జిల్లాలో 121, కరీంనగర్‌లో 137, ఖమ్మంలో 83, ఆదిలాబాద్‌లో 33, నల్లగొండలో 63 మంది స్కూల్ అసిస్టెంట్లకు రివర్షన్లు ఇవ్వాలని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కార్యాలయం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సీనియారిటీ జాబితాలు సరిగా తయారు చేయకపోవడంతో పాటు.. నకిలీల ఏరివేతలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగాలపై అప్పట్లో ఖమ్మం జిల్లాలో పనిచేసిన ముగ్గురు ఉప విద్యాధికారులకు సైతం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో మూడేళ్ల క్రితం చెల్లని పట్టాలతో ప్రమోషన్లు అందుకున్న ఉపాధ్యాయుల్లో వణుకు పుడుతోంది. ఈ అక్రమాలపై తీగలాగితే డొంకంతా కదిలినట్లయింది. బోగస్ పదోన్నతుల వ్యవహారాన్ని సీబీసీఐడీ విచారణకు అప్పగించాలని ఇటీవలే ఉపలోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ హడావిడిగా చర్యలకు ఉపక్రమిం చడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2009లో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. అన్ని జిల్లాల్లో వందలాది మంది ఎస్‌జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేసింది. అర్హతఉన్న ఉపాధ్యాయులకు మించిన సంఖ్యలోఖాళీల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించింది. ప్రధానంగా ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా మంజూరు చేసింది. ఇదే అదనుగా భావించిన కొందరు ఎస్‌జీటీలు అప్పటికప్పుడు సంబంధిత విద్యార్హతలు సమకూర్చుకునేందుకు అడ్డదారులు తొక్కారు.

పొరుగు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీల్లో సంబంధిత డిగ్రీలు పూర్తి చేసినట్లు కొందరు సర్టిఫికెట్లు కొనుక్కోగా... కొందరు ఏకంగా బోగస్ సర్టిఫికెట్లు సృష్టించారు. దీంతో ఈ పదోన్నతుల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఉదాహరణకు.... కరీంనగర్ జిల్లాలో 290 మం ది ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రమోషన్‌పై భర్తీ చేస్తే... అప్పటికే సిద్ధంగా ఉన్న సీనియారిటీ జాబితా ప్రకారం కేవలం 140 మంది ఉపాధ్యాయులు మాత్రమే అర్హులున్నారు. కానీ అనూహ్యంగా పుట్టుకొచ్చిన సర్టిఫికెట్ల కారణంగా రెండు నెలల వ్యవధిలోనే ఈ జాబితాలో అదనంగా మరో 250 మంది చేరారు. దీంతో అర్హత లేని ఎస్‌జీటీలు ప్రమోషన్లు అందుకున్నారు. నకిలీల కారణంగా కొందరు అర్హులైన ఉపాధ్యాయులు ప్రమోషన్లు అందుకోలేకపోయారు. ప్రధానంగా ఖమ్మం, వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలన్నింటా ఈ నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతుల వివాదం గందరగోళానికి తెరలేపింది. ఈ వివాదంపై కరీంనగర్ జిల్లాకు చెందిన బెల్లంకొండ రవీందర్‌రెడ్డి, వసంతరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన కె.వాణి, ఎం.అపర్ణ లోకాయుక్తను ఆశ్రయించారు.

అదే సమయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ఉన్న పూనం మాలకొండయ్య నకిలీల ఏరివేతపై ప్రత్యేక దృష్టి సారిం చారు. ప్రధానంగా 14 అంశాలను బేరీజు వేసి పదోన్నతులకు సమర్పించిన సర్టిఫికెట్లు అసలువా.. నకిలీవా తేల్చాలని అన్నిజిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. సంబంధిత డిగ్రీ పరీక్షలు రాసేటప్పుడు ఉపాధ్యాయులు సెలవులో ఉన్నా రా.. లేదా? పొరుగు రాష్ట్రం యూనివర్సిటీల నుంచి దూరవిద్యలో డిగ్రీలు పొందితే ఏ స్టడీ సెంటర్‌లో చదువుకున్నారు? ఆ యూనివర్సిటీలకు మన రాష్ట్రంలో ఉన్న స్టడీ సెంటర్లకు యూజీసీ, డెక్ గుర్తింపు లేనప్పుడు ఎలా పట్టాలిచ్చారు? తదితర వివరాలన్నీ సమగ్రంగా కూపీ లాగారు. దీంతో నకిలీల చిట్టా బట్టబయలైంది. దీంతో ప్రమోషన్లు పొందిన వారిలో అనర్హులున్నారని రూడీ అయింది. కరీంనగర్ జిల్లాలో 2010 జూన్‌లో ఏకంగా 137మంది స్కూల్ అసిస్టెంట్లకు రివర్షన్ ఆర్డర్లు జారీ చేశారు. కానీ వీరందరూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి తిరిగి అదే పోస్టుల్లో ఉన్నారు. ఒక దశలో వరంగల్ జిల్లాలో ఉపాధ్యాయులు సమర్పించిన సర్టిఫికెట్లన్నింటినీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి పరిశీలించింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వీరిపై చర్యలు తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ నడుం బిగించడంతో కలకలం మొదలైంది. తాజా ఆదేశాల ప్రకారం రివర్షన్లతో పాటు అడ్డదారిలో ప్రమోషన్లు పొందిన టీచర్లపై సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. బోగస్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు నిర్ధారణ జరిగితే ఏకంగా కొందరిపై క్రిమినల్ కేసులు తప్పవని కూడా విద్యాశాఖవర్గాలు వెల్లడించాయి.

Saturday, October 27, 2012

పూసపాటి రాజులు - విజయనగరం కోట



 ఆధునిక యుగంలో తెలుగువారి తూర్పు దిక్కు విజయనగరం సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య పునరుజ్జీవనాలకు చిరునామా. 17వ శతాబ్దంలో పోర్ట్ విలియం నిర్మాణం వల్ల ఎలా కలకత్తా అనేక ఆధునిక నగర నిర్మాణానికి దారులు ఏర్పడ్డ్డాయో, అలానే అదే శతాబ్దంలో గాజుల రేగ అనే గ్రామానికి శివారుగా వుండే విజయనగరానికి సైతం, పూసపాటి రాజులు అక్కడ పెద్దదీ, బలమైనదీ అయిన కోట కట్టాలని నిర్ణయించడంతో కొత్త భవిష్యత్తు ఏర్పడింది. 1712-13 ఏడాదిలో విజయనగరం కోటకు పునాది వేసారు. ఈ 2012 సంవత్సరం విజయనగరం కోటకు ముచ్చటగా మూడు వందలేళ్ల సందర్భం. విజయనగరం కోట నిర్మాణానికి ముందు పూసపాటి రాజులకు కుమిలి (కుంభిళాపురం)లో మట్టికోట ఉండేది. దీనిపై మహమ్మదీయుల దాడులు తరచూ జరుగుతూ వుండడంవలన రాజ్య సుస్థిరతా, భద్రతా కారణాల దృష్ట్యా సైతం, ఈ కోట నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. పూసపాటి రాజులలో అయిదో పాలకుడయిన ఆనంద గజపతి రాజు తన కుమారుడయిన విజయరామ గజపతి రాజు పేరిట అయిదు ‘జయ’ శబ్దాలు సమకూరే శుభముహూర్తాన 1712-13లో కోటకు పునాది వేసారు. ఆ అయిదు జయ శబ్దాలూ ఏమిటంటే విజయనామ సంవత్సరం, విజయదశమి, జయవారం, విజయరామరాజు. అందుకే అది విజయనగరం కోటగా పిలువబడింది. తండ్రి ఆనందగజపతి మొదలుపెట్టినా, ఈ కోట నిర్మాణం కుమారుడు పెద విజయరామరాజు కాలంలోనే పూర్తయ్యింది. ఆ విధంగా విజయనగరం కోట నుంచి పరిపాలించిన తొలి రాజు పెద విజయరామరాజు. పూసపాటి రాజుల పరిపాలనా కేంద్రమయిన మూడు వందల ఏళ్ళ ప్రాభవాల విజయనగరం కోట, అటు శ్రీకాకుళం నుంచి రాజమహేంద్రవరం దాకా విస్తరించిన రాజ్యంగానే కాక కాలక్రమంలో విద్యా, సాంఘిక, సాంస్కృతిక వికాస దోహద శక్తిగా సైతం పాత్ర పోషించింది. పదిహేడో శతాబ్దం నుంచి ఇరవయ్యో శతాబ్దందాకా కోట విభిన్న సంఘటనలకు సాక్షిగా నిలిచింది. తొమ్మిది మంది రాజులు పట్ట్భాషిక్తులయ్యారు. పెదవిజయరామరాజు-1, ఆనందరాజు, చినవిజయ రామరాజు-2, నారాయణ గజపతిరాజు, విజయరామ గజపతిరాజు-3, ఆనందగజపతిరాజు, విజయరామ గజపతి రాజు -4, అలక్‌నారాయణ గజపతిరాజు, విజయరామరాజు-5 (పి.వి.జి.రాజు) ఫ్యూడల్ రాజరిక దశ,వలసవాద పరిపాలనల దశ, జమీందారీలుగా పరిణమించిన దశ, సంస్థానాలు భారతదేశంలో కలసిపోయిన దశలు కదిలిపోయిన చరిత్రకు విజయనగర రాజ్యం, కోట, పాలకులు అందరూ సమష్టి ప్రతీకలు. 1945లో ఆఖరుగా పట్టం కట్టుకున్నది మన కాలంలోని వారు ఎరిగిన పి.వి.జి.రాజు. రాచరిక మర్యాదలకు దూరంగా వుంటూ సోషలిజంవైపు మొగ్గుచూపిన అభ్యుదయవాది పి.వి.జి.రాజు ప్రజలతో అనుబంధం పెంపొందించుకున్నారు.












1949వ సంవత్సరంలో జమీందారీ చట్టం రద్దు కావడంతో విజయనగర సంస్థానం ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయింది. పి.వి.జి.రాజు స్వచ్ఛందంగా తన యావదాస్తీనీ, రెండు వందల ముప్ఫయ్యేళ్ళ విజయనగర రాజ్యలక్ష్మికి స్థానమైన కోటనీ విద్యల కోసం, జాతిపరం చేశారు. అయితే బొబ్బిలియుద్ధంలాగానే, విజయనగరం రాజులు గుర్తుండిపోయే మరో ఘట్టమూ వుంది. అది 1794లో జరిగిన పద్మనాభ యుద్ధం. ఈ యుద్ధంలో రెండో విజయరామరాజు పోరాడి కన్ను మూశారు. ఈ రాజు నిజానికి తాళ్లపాలెం రాజుల ఇంటి బిడ్డ. పెదవిజయరామరాజు భార్య రాణీ చంద్రాయమ్మ, భర్త సూచనల మేరకు దత్తత స్వీకరించి చిన విజయరామరాజుగా నామకరణం చేశారు. బొబ్బిలియుద్ధంలో పెద విజయరామరాజు మరణం తర్వాత, చిన విజయరామరాజుకు పట్ట్భాషేకమైనా, బాలుడు కావడంతో, ఇతని సవతి తల్లి కుమారుడు, అన్న అయిన సీతారామరాజు కొనే్నళ్ళు దివాన్‌గా వ్యవహరించి రాజ్య పరిస్థితులను అధోగతికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితి పెద విజయరామరాజు ఆస్థాన కవి అయిన అడిదం సూరకవి తన రామలింగేశ శతకంలో చిత్రణ చేశారు. అగ్రహారంబులు నామావశిష్టములయ్యె మాన్యంబుల్నియు మంట గలిసె బత్తెంబునకు తొంటి పడికట్టు దప్పెను బుధ జనంబుల రాకపోకలుడిగెవర్నాశనంబులు వరద పాలైపోయె మలవ తలను ప్రజల్ మాని పనిరి నశించిపోయె జుంటరులు దుష్కరుల గజతురంగములు తాకట్టు వడియె ధార్మిక స్థానముగ కిట్టి తళ్ళుపుట్టె గఠిన చిత్తున రాజ్యాధికారి సేసి యింత పీడించితివి సత్కవీంద్ర కోటి రామలింగేశ రామచంద్ర పురవాసు! ఇంకా పూసపాటివారి కైఫీయతు, డిస్ట్రిక్టు మాన్యువల్, డిస్ట్రిక్ట్ గెజెటీర్‌లలోని వివరాలు ఆ నాటి సీతారామరాజు క్రౌర్యాన్ని, వితండ పాలననూ వెల్లడి చేస్తున్నాయి. ఇతని తర్వాత పాలనకొచ్చిన (అంటే పదవిలోనుంచి తప్పించి) చిన విజయరామారాజుకు, ఇంటి శత్రువులవల్ల సహజంగా కష్టాలు ఎక్కువయ్యాయి. సీతారామరాజు కంపెనీ పరిపాలకుల పంచన చేరాడు. విజయనగర రాజ్యం, ఆంగ్ల పాలకులకు ఆరు లక్షల యాభై వేలు కప్పంగా కట్టవలసివుందని తాఖీదులొచ్చాయి. ఆంగ్లేయ వర్తకులు, తమ రాజ్యానికి ఆహీలు (హోసీల్)గా మూడు లక్షలపైగా కట్టాల్సి వుందని, ఆ సొమ్ము మినహాయించుకుని మిగిలిన మూడున్నర లక్షలు, మూడు వాయిదాలలో చెల్లిస్తానన్న చిన విజయరామ గజపతి, ఆంగ్ల పాలకులకు అంగీకారం కాలేదు. అందువల్ల విజయనగరం కోటపై రాజు కోటలో లేని వేళ 1794 వత్సరంలో ఆంగ్ల సైన్యాల ముట్టడి జరిగింది. కోట ఖిలేదారు యుద్ధం జరిగితే కోట దెబ్బతింటుందన్న ఆలోచనతో, కోటను వారి పరం చేశాడు.

ఆంగ్ల పాలకుల ఈ దుష్టచర్యలపై కోపించి విజయనగరం ప్రాంత రైతులు తాము కట్టాల్సిన శిస్తులు కట్టడం ఆపివేశారు. దానితో రాజులకు దేశంలోగల పేరు, ప్రేమ చూసి, కప్పం కట్టలేని రాజు, దేశంలో వుండతగదనీ, తాను వెంటనే మచిలీపట్నం వెళ్లిపోవలసిందనీ, ఆంగ్ల పాలకులు ఆదేశాలు జారీ చేశారు. తన భార్య సీతాయమ్మగార్ని, ఎనిమిదేళ్ల బిడ్డ నారాయణబాబును అన్నమరాజు పేటకు పంపించి, తాను మచిలీపట్నం వెళ్ళేందుకు తొలుత సిద్ధపడిన చిన విజయరామ గజపతి, సింహాచలదేవుని సందర్శించుకుని, మచిలీపట్నం వెళ్ళిపోవలసినవాడు మనసు మార్చుకుని, కొద్ది మైళ్ళ దూరంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం చేరుకుని, తనకు విశ్వాసపాత్రులయిన సైన్యాలకు పిలుపు పంపి, ఆంగ్ల పాలకులతో, అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ పద్మనాభ యుద్ధానికి ముందు అనంత పద్మనాభస్వామి ఆలయంలో తన అనుచర యోధులు, సైన్యాలను ఉద్దేశించి, చిన విజయరామరాజు చేరిన ఆఖరి ప్రసంగం ఎంతో చారిత్రాత్మకమైనది. వలస పరిపాలకుల కూట నీతి ఎలా భారతదేశపు రాజ్యాలను లొంగదీసిందో తెలియచెప్పే ఒక సాధికార వివరణ. అందులో కొన్ని వాక్యాలు యిప్పటికీ పాఠకుల రక్తం మరిగేటట్టు చేస్తాయంటే జరిగిన ఆ అన్యాయం అటువంటిది.10.7.1794న జరిగిన పద్మనాభ యుద్ధం కేవలం నలభై అయిదు నిమిషాల్లోనే ముగిసింది. మరణించిన చిన విజయరామరాజు చుట్టూ రెండు వందల ఎనిమిది మంది ఆంధ్ర క్షత్రియ వీరులు ఆయుధాలు విడవనివారై నేలన పడి వున్నారు. వీరిలో నలభై ఎనిమిది మంది ప్రథమ శ్రేణికి చెందిన రాజపుత్ర వీరులు విజయనగరం సైనికులు మూడు వందలమందిపైగా మరణించగా, కంపెనీ సైనికులలో పదమూడు మంది మరణించగా అరవై ఒక్కరికి గాయాలు తగిలాయని నివేదికలు చెప్తున్నాయి. పద్మనాభ యుద్ధంలో ఉత్తర సర్కార్లలోని క్షత్రియ కుటుంబాల వీరులు రాజు తరపున పోరాడి ప్రాణాలు అర్పించారు. వీరిలో పూసాపాటి, వత్సవాయి, నడిపల్లి, చింతలపాటి, దాట్ల, సాగి, జంపన, దంతులూరి భూపతి, వేజర్ల, గొట్టిముక్కల, పెరుమత్స కుటుంబాల వీరులు వున్నారు. 1794 నాటికి, ఈ యుద్ధం ద్వారా ఆంగ్ల పాలకుల చేతుల్లోకి వెళ్లిన కోట, ఎన్నో కొత్త మార్పులను చూసింది. ఈ యుద్ధ బీభత్సాన్ని ఎరిగిన నారాయణ గజపతి, ఆదిల్ కొంత రాజ్యం కోసం యుద్ధాలు చేసినా, కంపెనీవారు పర్మనెంట్ సెటిల్‌మెంటు బిల్లు ద్వారా రాజులందర్నీ, జమీందరులుగా మార్చివేయడం, రాజ్యంలో వుండే సైన్యాల సంఖ్య తగ్గించి వేయడం, కలెక్టర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి, శాంతి భద్రతలకై పోలీసు యంత్రాంగాన్ని కంపెనీ అధికారాల కిందే నియమించడం వంటివి చూసి, ప్రాభవం తగ్గిన చోట తాను పేరుకు మాత్రమే రాజుగా పరిపాలన చేయలేనని ఎరిగి, కంపెనీ పాలకులతో తన జీవితాంతం ఏడాదికి లక్ష రూపాయల జీవన భృతికి ఒప్పందం చేసుకుని కాశీలో నివాసం వుండేందుకు వెడలిపోవడంతో 1794 నుంచి 1852 వరకూ, యాభ్యెనిమిదేళ్ళపాటు కోట, విజయనగర రాజ్యం లేదా జమీందారీ ఆంగ్ల పాలకుల సంరక్షణలోనే వుండిపోయాయి.

నారాయణ గజపతి కాశీకి వెడలిపోయే ముందరి దశాబ్దాలలో 1794 నవంబరు ఇరవై నుంచి కలెక్టరేటు పద్ధతి అమల్లోకి వచ్చింది. అయిదు లక్షల రూపాయల పేష్కస్ ఏడాదికి చెల్లించే పద్ధతిపై నారాయణ గజపతే తొలి విజయనగరం జమీందారయినా పురాతన జమీందారీలుగా పేరు పడ్డవీ, అంతవరకూ విజయనగరం రాజ్యంలో వున్నవీ అయిన ఆండ్ర, బెలగాం, బొబ్బిలి, చెముడు, గోల్కొండ, జయపురం, కాశీపురం, కురుపాం, మాడుగుల, మేరంగి, పాచిపెంట, పాలకొండ, సాలూరు సంగంవలస, సరిపల్లి, భీమవరం, వీటిని ఎవరివి వారికి యిచ్చివేసి స్వతంత్ర జమీందారులుగా ప్రకటించారు. ఇంతటి పెనుమార్పులకు తట్టుకుని విజయనగరంలో వుండలేని నారాయణ గజపతి కాశీ వెళ్లిపోవడమే కాక విజయనగరం తొలి జమీందరుగా అక్కడే మరణించారు. 23.8.1854న సైనిక మర్యాదలతో వీరి అంత్యక్రియలు కాశీలో బ్రిటీష్ కంపెనీవారు జరిపారు.మూడవ విజయరామరాజు చిన్నప్పట్నుంచీ కాశీలోనే పెరిగి పెద్దయిన కారణంగా వీరి వివాహమూ అక్కడి ఉత్తర హిందుస్థానపు క్షత్రియ కన్యతో జరిగింది. వీరి భార్య అలక్ రాజేశ్వరి దేవి చంద్రావతి రాజ్యపాలకులగు ఫిరూ సింగ్ బహదూర్ వారి కుమార్తె, ఈ సందర్భం మొదలుకుని విజయనగరం రాజులెవరూ ఆంధ్ర క్షత్రియ కన్యలను వివాహం చేసుకోలేదు.పద్ధెనిమిదో శతాబ్దానికి రాజ్యాలు సుస్థిరమైనాయి ముఖ్యంగా ఆంగ్ల వలస పాలకులకు. 1857 సిపాయిల తిరుగుబాటు ఈ ప్రాంతాలలో పెద్దగా ప్రభావం కలిగించలేదు. పైగా ఈ 1857 తిరుగుబాటు కాలంలో యువకుడైన విజయరాజ గజపతి-3 ఆంగ్లేయ పాలకులకు సహకరించారు.విజయనగరంలో మహారాజావారి సంస్కృత కళాశాల వీరి పాలనలోనే మొదలయింది. విజయ రామ ముద్రాక్షర శాల ఏర్పడింది. ఈ అచ్చు పనిశాలలోనే 1897లో ‘కన్యాశుల్కం’ అచ్చయింది. వీరి కుమారుడు అభినవాంధ్రభోజుడు ఆనంద గజపతిరాజు కాలంలో సంగీతమూ, సాహిత్యమూ, విద్యా సంస్థల ఏర్పాటు ఇవన్నీ పంధొమ్మిదో శతాబ్ది ఆరంభంలోనే జరిగిన ప్రప్రథమ ఆంధ్ర నగరం విజయనగ విజయరామ గజపతి కాలంలోనే కావ్యరచనలు చేసిన కవి పండితులున్నారు. వీరిలో ముడుంబై నరసింహాచార్య స్వామి, మందా కామేశ్వర కవి, లక్ష్మీ కామేశ్వర శాస్ర్తీ ప్రభృతులూ, పసకాడ సన్యాసి, కిల్లంపూడి ముత్యాలు అనే మల్లుడు, పోడూరి వెంకటరాజ కవి తదితరులున్నారు.

శ్రీపాద వెంకటాచల కవి రామకృష్ణోపాఖ్యానం అనే ద్వర్థికావ్యాన్ని రాశాడు. ఈ సాహిత్య వికాసం, ఇంతకు రెండింతలై తరువాతి పాలకుడు, ఆనంద గజపతి మహారాజు కాలంలో కొత్త ఎత్తులకు ఎదిగింది. ఆ రకంగా పంధొమ్మిదో శతాబ్దం,రాజుల పేరిట సాహిత్య యుగాలను తీర్చితే, ఆనంద గజపతి యుగంగా చరిత్రలో నిల్చిపోతుంది. గురజాడ యువకుడిగా వున్న కాలానికే 1879కి రాజ్యానికి వచ్చారు ఆనందగజపతి. వీరికి ఇరవై అయిదుభాషల్లో ప్రవేశం, ప్రావీణ్యం వుందని చెప్తారు. ‘ప్రిన్స్ ఛార్మింగ్’, ‘డ్యూక్ ఆఫ్ బకింగ్‌హాం’గా కొనియాడిన వీరిది ప్రత్యక్షంగా చూసిన దేశభక్త కొండ వెంకటప్పయ్య తెలిపినది ఇది.‘‘వారి స్వరూపము అత్యంత నిపుణుడగు శిల్పి చెక్కిన పసుపు పచ్చని బంగారు ప్రతిమవలె ఉండెను. వారి ముఖారవిందము ఎన్నిసార్లు చూచినను ఇంకను చూడవలెనను కోర్కె పుట్టుచుండును. తెల్లని లాగును తెల్లని అంగరఖాను తొడిగి దానిపైన నల్లని పూసలుగల బంగారు తావళము మెడలో వేసుకుని రవ్వలు చెక్కిన తురాయిగల ఎఱ్ఱని టోపీని పెట్టుకుని సభలకు వచ్చుచు ప్రేక్షకులకు ఆనందము గొలుపుచుండెను. ఆనంద గజపతి అను నామము వారి యెడ పూర్ణముగ సార్థకమయ్యెను’’.కవిపోషణ, పండితుల ఆదరణ, అనేక గ్రంథాలను అంకితం పొందడం, సంస్కృత, హిందీకావ్యాల తెలుగు అనువాదాన్నీ చేయించడం, తాను స్వయంగా ‘విజయనగరం ట్రీటీ’ అనే లఘుకృతిని కలిగి వుండాలని ఆశించి కన్యాశుల్కం బిల్లు ప్రవేశపెట్టడం, మాక్స్‌ముల్లర్ రచించిన రుగ్వేద వ్యాఖ్యానం (మూలం శాయనాచార్యుడి ఋగ్వేదం) ప్రతులు చెల్లిపోయిన తరుణాన పునర్ముద్రణకు అవసరమయ్యే లక్ష రూపాయల సొమ్మును అందచేయడం, తాను స్వయంగా వీణవాదనం సాధన చేయడం ఇలా విజయనగర కళా సరస్వతీ వికాసాలు ఈ రాజు కాలంలో ఉచ్ఛదశకు చేరుకున్నాయి.వీణా విద్వాంసులు సూర్యనారాయణ శాస్ర్తీగారు, ఫిడేలు వాయిద్య నేర్పరి కలిగొట్ల కామరాజుగారు, రుద్రవీణావాదన నిపుణులు కవిరాయని రమణయ్యగారు హిందుస్తానీ సంగీతంలో మంచి వైదుష్యంగల మహంతి ఖాన్‌గారు, ప్రముఖ వైణికులు గురాచార్యుల వెంకటరమణదాసుగారు, ఆనందగజపతి కొలువు కూటమిలో సంగీత గంగ పొంగులు వారేది.ముడుంబై వరాహ నరసింహాచార్యులు, గురజాడ శ్రీరామమూర్తి, బహుజనపల్లి సీతారామాచార్యులు, తచ్చూరి సింగరాచార్య, గురజాడ అప్పారావు గార్ల విభిన్నమైన రచనల్ని ఆనందగజపతి అంకితం పొందారు. నన్నయచే సంస్కృత మహాభారత ఆంధ్రీకరణం మొదలుపెట్టించిన రాజరాజ నరేంద్రుని వలె, గురజాడ అప్పారావుగారిచే, కన్యాశుల్కము, వ్యవహారిక భాషా నాటకాన్ని రాయ ప్రేరేపించిన ఆనందగజపతి కూడా ఆధునిక తెలుగు సాహిత్య యుగారంభ దీప్తిమంత మూర్తులలో ఒకరిగా వుండిపోతారు.ఆనందగజపతిరాజు పాండితీ ప్రకర్ష చూసిన తిరుపతి వేంకటవులు ‘ఏము చూచిన రాజులందెల్ల నొక్క విజయనగర మహారాజు వేత్త’’ అని స్తుతించారు. నిండు మనసుతో ఆనందగజపతిని ఉద్దేశించి కవితా ప్రశంస చేశారు.ఆనంద గజపతి మేనబావయిన విజయరామ గజపతిని దత్తత చేసుకోవడం వలన, ఈయన ఉత్తర హిందుస్థానములవాడూ, రాజుగారి తల్లి తరపు బంధువర్గంలోనివాడూ కావడం మూలాన, ఈ దత్తత చెల్లదని దాయాదులయిన ఇతర ఆంధ్ర క్షత్రియ కుటుంబాలవారు, తెలుగువారయిన రాజబంధువులు, కోర్టులో దావాతెచ్చారు. ఇదే పెద్ద దావాగా పేరుపొందిన వ్యాజ్యం. దత్తత కోర్టువారిచే చిరకాల వ్యాజ్యం తరవాత ఆమోదించారు. రాజీ షరతుల ప్రకారం జొన్నవలస, పూసపాటిరేగ, కొఠాం, తాళ్ళవలస రాజబంధువులు కొంత సొమ్ము తమలో తాము పంచుకునేలా అంగీకారానికి వచ్చారు.విజయరామగజపతి-4 కాలంలో సైతం గురజాడ వారి సేవలు సంస్థానానికి అందాయి.

అయోధ్య తాలూకా ఖాట్మండు రాజ్యపాలకులయిన ఠాకూర్ సులాజ్‌బ గారి కుమార్తె లలిత కుమారీదేవిని, విజయరామ గజపతి వివాహమాడిన సందర్భంలో సంప్రదింపులు జరిపిన వారుగా గురజాడ వారిని ఇరుపక్షాలూ ఎంతో గౌరవించి ఆదరించాయి. మహారాజ కుమారికా లలిత కుమారీదేవి విజయనగరం కోటలో వున్న కాలంలోనే, అమె చొరవవల్ల గురజాడవారి ఇంటి స్థలం, ఇల్లువారికి కొంత మూల్యం స్వీకరించి సంస్థానం దఖలుపర్చింది. ఈ కృతజ్ఞతతోనే గురజాడ తన లైబ్రరీలోని పుస్తకాలపై ‘గురజాడ అప్పారావు, లలిత్ బిల్డింగ్’ అని రాసుకునేవారు.విజయరామ గజపతి, తమ తండ్రిగారయిన ఆనందగజపతి మార్గానే్న నడిచి, ఎనమండ్ర నారాయణమూర్తిగారిచే 1918లో కావ్యరచన పోటీలు నిర్వహించగా తదుపరి కాలంలో కవికోకిలగా ప్రసిద్ధుడయిన దువ్వూరి రామిరెడ్డి గారి కృషీవలుడు కావ్యం మొదటి బహుమతిని అందుకున్నది. వీరి పాలనా కాలంలోనే కోరుకొండ పాలస్ నిర్మాణం జరిగింది. అదే ప్రస్తుతం కోరుకొండ సైనిక స్కూల్ భవంతి.వీరి కుమారులు అలక్ నారాయణ గజపతికి ఆదిభట్ల నారాయణదాసుగారు షేక్స్‌పియర్, కాళిదాసు మహా కవుల కవిత్వంలోని నవరస ఘట్టాలను నవరస తరంగిణిగా అనువదించి అంకితమిచ్చారు. ఇంకా భోగరాజు నారాయణమూర్తి, ఆకుండి వెంకట శాస్ర్తీ, ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య తెనిగించిన గ్రంథాలు ఈయనకు అంకితం ఇచ్చారు.ఆధునిక కాలపు మహారాజు, సామాన్యులలో మాన్యుడు, సోషలిస్టు అయిన అయిదవ విజయరామగజపతి (పి.వి.జి.రాజు) విజయనగరం విద్యారంగాన, తన తండ్రిగారి పేరిట ‘మహారాజా’ అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ ఎండ్ సైనె్సస్’ 1958లో ప్రారంభించారు. ఇదే మాన్సాస్ (MANSAS) సొసైటీగా ప్రస్తుతం పలు కార్యక్రమాలకు, విద్యా వ్యాసంగాలకు ఊతగా నిలబడుతోంది. బీహార్ ప్రాంత రైతుల తరఫున ‘పన్నులు చెల్లింపు నిరాకరణ’ ఉద్యమంలో పాల్గొన్నందుకు యువకుడయిన విజయరామ గజపతి, సోషలిస్టు ఉద్యమకారులు రామ్‌మనోహర్ లోహియాతోపాటు, బీహార్‌లోని పుర్నియా చెరసాలలో నలభై అయిదురోజుల జైలుశిక్ష అనుభవించారు.ఒక్కొక్క రంగంలో తమ తమ కాలంలో తిరుగులేని పండితులు, కవులు, కళాకారులు ఎందరో. వీరిని కన్న నేల విజయనగర సరస్వతి ధన్య. వీరిది పోషించిన రాజులు తల్చుకోదగ్గవారు. ఈ పునరుజ్జీవన ప్రాభవాలను మానవ జీవితానికి సంప్రాప్తింపచేసిన మూడు వందలేళ్ళ కోట, తెలుగువారి తెలుగు తనాల నిధి. మన చారిత్రక సంపద. కవిత్వంలో కొంత అతిశయోక్తి లేకపోతే అది ఒక ఉత్సవ హేతువు కాలేదు. కత్తిపట్టినా, కవిత్వం చెప్పినా అడిదంవారికే చెల్లిందనేది ఉత్తమ సర్కార్లలో జగమెరిగిన సత్యం. పెద్దాపురం జమీందారు సభలో అడిదం సూరకవి చెప్పిన చాటువు ఇది.‘‘రాజు కళంక మూర్తి రతిరాజు శరీర విహీనుడంబికారాజు దిగంబరుండ, మృగరాజు గుహాంత సీమవర్తి విభ్రాజిత పూసపాడ్వి జమరామ నృపాలుడు రాజుగాక రుూరాజుల్ రాజులే పెను తరాజులు గాక ధరాతలంబునన్’’పదిహేడో శతాబ్ది పూర్వార్థంలో చెప్పిన ఈ చాటువు, పెద విజయరామరాజు కాలానికి చెందింది. ఇందులో ‘తరాజు’ అనే అన్యదేశీయ పదాన్ని సూరకవి ఉపయోగించాడు. తరాజు అనే ఉర్దూ మాటకు ‘తూకం వేసే త్రాసు’ అని అర్థం.ఇలా మానవ జీవితానికిగల ఎన్నో వైవిధ్యవంతమయిన కోణాలను తనలో ఇముడ్చుకున్న కాలపు కలకండ, రాతి పూలదండ మూడు వందలేళ్ళ విజయనగరం కోట.

రాళ్ళలో వికసించిన పూలు పరిమళాలు వెదజల్లితే, అది విజయనగరం సాక్షిగా తెలుగు నేల నలుచెరగులకూ వ్యాపించాయి. లలితకళామతల్లికి నాగరమై, వారి కధాపితామహుల కలనూపురమై గురజాడ విశ్వమానవతల గోపురమై, ఫిడేలు నాయుడి రాగాలలో పరశిస్తున్న విజయనగరం నక్షత్రాలు తాపడం చేసిన నేల అందులో భాగమే ఈ విజయనగరం కోట త్రిశతాబ్ది ఉత్సవ హేల.

Friday, October 26, 2012

ఎపిపిఎస్సి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ లు ఉండవు

 గ్రూప్-1 మినహా ఎపిపిఎస్సి నిర్వహించే మరే పరీక్షలకు ఇంటర్వ్యూ లను నిర్వహించబోమని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ విషయమై కృష్ణయ్య నేతృత్వంలో వివిధ యూనివర్సిటీ లకు చెందిన విద్యార్థులు గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నిమాథ్యును కలిసి చర్చలు జరిపారు. 40 కేటగిరి పోస్టులకు ఇంటర్వ్యూ లేకుండానే ఫలితాలివ్వాలని ఎపిపిఎస్సి అధికారులను ఆదేశిస్తామని, ఈ మేరకు శుక్రవారమే ఉత్తర్వులిస్తామని హామీ ఇచ్చారని కృష్ణయ్య తెలిపారు.

గుడిమల్లం శివాలయం

గుడిమల్లం, చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామము. చారిత్రకంగా చాల ప్రాముఖ్యమైనది. ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం కలదు. ఇది క్రీ.శ. 1 లేదా 2 శతబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. పురావస్తు శాస్తజ్ఞ్రుల పరిశోధన ప్రకారం గుడిమల్లంలోని శివాలయం క్రీ.పూ. రెండో శతాబ్దం నాటిదని నిర్ణయించింది. అయితే ఆలయంలోని లింగాన్ని ఎవరు, ఎప్పుడు ప్రతిష్ఠించారో మాత్రం తెలియరావటం లేదు. అయితే ఉత్తర్రపదేశ్‌లోని మధురలో ఉన్న మ్యూజియంలో క్రీ.పూ. ఒకటవ శతాబ్దానికి చెందినది అంటూ ఒక లింగాన్ని భద్రపరచారు. అది ఈ గుడిమల్లం శివలింగాన్ని పోలి ఉంది. అలాగే ఉజ్జయినిలో క్రీ.పూ. మూడవ శతాబ్దానికి చెందినవిగా భావించే కొన్ని రాగి నాణలు దొరికాయి. వాటిపై ఉన్న చిత్రం అచ్చు గుడిమల్లం శివలింగమే. ఇక ఆలయంలోని శివలింగాకారం. ఇది చిత్రంగా, మరెక్కడా లేని విధంగా పురుషాంగాన్ని పోలి ఉంటుంది. దానిమీద రాక్షసుడి భుజాలపై నిలుచున్న శివమూర్తి ఉంటుంది. మంగోలులని పోలిన ఈరూపం ఖజురాహోలా కూడా కనిపించడం విశేషం. ఆంధ్రశాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయంగా భావిస్తున్న ఈ ఆలయానికి సంబంధించిన మరికొంత సమాచారం చంద్రగిరి కోటలోని మ్యూజియంలో లభ్యమవుతున్నది.


దేవాలయ చరిత్ర...

ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచ్చస్థితిలో నిలిపారు. తదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు పాడుచేసారు. కాకుంటే మూలవిరాట్‌ స్వామికి మాత్రం హాని కలగలేదు.

గుడిమల్లం శివలింగ విశిష్టత...


Gudimallam Shiva Lingam
 గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశు రామేశ్వరుడుగా పూజలందుకుంటున్నడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉన్నది. ఈ ఆలయంలో గర్భాలయం అంతరాలయం, ముఖమండపముల కన్నా లోతులో ఉంటుంది. ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్టించబడిన శివలింగం లింగ రూపంలో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగాని వలే ఉన్నాడు. ఈ లింగం ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన(స్థానకమూర్తి) రూపంలో అతి సుందరంగా ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు.

ప్రక్కన ఉన్న లింగం చంద్రగిరిలో గల రాజమహల్ ప్యాలస్ లోనిది. కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యెక్క కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప)ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్తమ్రు) ధరించి ఉన్నాడు. ఆ వస్తమ్రు మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తున్నాయి. ఆ వస్తమ్రు అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్రభాగము మరియు క్రింది పొడవైన స్థంభభాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము, పురుషాంగమును పోలి ఉంది. ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది.

ఈ ఆలయం పశ్చామాభిముఖంగా ఉంటుంది. కొంత శాతవాహన నిర్మాణ శైలి కనిపిస్తుంది. తవ్వకాల్లో లభించిన శాసనాల బట్టి 12వ శతాబ్దంలో విక్రమచోళుడి కాలంలో పునర్నిర్మిత మైంది. గర్భాలయంపై కప్పు గజ పృష్ఠాకారంలో (ఏనుగు వెనుక భాగం) ఉంటుంది. చోళుల తర్వాత పల్లవులు కొంత కాలం ఈ ఆలయ నిర్వహణ చేశారు. చోళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని ''తిరువిప్పరమ్‌ బేడు'' అని పిలిచినట్టు తెలుస్తోంది. అంటే తెలుగులో 'శ్రీ విప్రపీఠం' అంటారు. పల్లవుల నిర్వహణ లోకి వచ్చాక ఇది గుడిపల్లమైంది. కాలక్రమంలో అదే గుడి మల్లంగా మారి ఆలయం చుట్టూ నిర్మితమైన ఊరే గుడిమల్లంగా మారిపోయింది.

తిరుపతికి గానీ, రేణిగుంటకి గానీ రైల్లో చేరుకుంటే తిరుపతి నుంచైతే 22 కి.మీ., రేణిగుంట నుంచైతే 11కి.మీ. రోడ్డు ప్రయాణం చేసి ఈ ఊరు చేరుకోవచ్చు. అయితే ఇక్కడ సుప్రసిద్ధ ఆలయాల్లో మాదిరి ఉండేందుకు వసతి, హోటల్స్‌ లాంటివేమీ లేవు. మంచినీళ్లతో సహా మనమే తీసుకుని వెళ్లాలి. ఎందుకంటే ఇది చాలా చిన్న ఊరు కాబట్టి. అయినా ఇక్కడి దేవుడు మాత్రం లోకాలనేలే లోకేశ్వరుడే. పురావస్తు శాఖవారి అధీనంలో ఉన్న ఈ గుడి పురోభివృద్ధికి ప్రభుత్వం, భక్తులూ పూనుకుంటే అభివృద్ధి చెందడం ఎంతోసేపు పట్టదు. ఇలాంటి పురాతన ఆలయాలు మన చరిత్రకు సాక్షీభూతాలు. వీటిని సంరక్షించుకోవడం మన బాధ్యత.

సిద్ధార్థుడి అతిపెద్ద ఆలయం... బోరోబుడుర్

Borobudur Temple, Central Java, Indonesia
విశ్వవ్యాప్తంగా సిద్ధార్థుడి ఆనవాళ్ళు దాదాపు ప్రతి దేశంలో మనకు దర్శనమిస్తాయి. అయితే ... ప్రపంచంలో కేల్లా అతిపెద్ద బౌద్ధ దేవాలయం ఎక్క డుంది? అంటే మాత్రం... మన ఆలోచన జపాన్‌, చైనా, భారత్‌, భూటాన్‌ ల వైపు మళ్లుతుంది. ఎందుకంటే... ఈ దేశాలే కదా గౌతమ బుద్ధునితో అధికంగా అనుబంధాన్ని కలిగివున్నాయి. కానీ, పై ప్రశ్నకు సమాధానం వీటిలో ఏదీ కాదు. ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ దేవాలయం ఉన్న దేశం ఇండోనేషియా. అధిక సంఖ్యాక ముస్లిం జనాభా కలిగివున్న ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉంది ఆ దేవాలయం. అదే ‘బోరోబుడుర్‌’ ఆలయం...

ఇండోనేషియాలోని మధ్యజావాలో ప్రాంతంలో ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టులాంటి అందమైన లోయ ఒకటి కనిపిస్తుంది. అందులో ఠీవీగా నిలబడిన అగ్నిపర్వతాలు దర్శనమిస్తాయి. వాటి ముంగిట నిర్మించిన ఆలయమే ‘బోరోబుడుర్‌’. ఇదే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బౌద్ధాలయం.


అద్భుత రాతి కట్టడం...

Borobudur Stupas
పర్వత చక్రవర్తులుగా ప్రసిద్ధిచెందిన శైలేంద్ర వంశానికి చెందిన రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. బ్రహ్మాండమైన ఈ కట్టడ నిర్మాణం 750 - 850 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినట్లు చరిత్ర కారుల అంచనా. బోరోబుడుర్‌ ఆలయాన్ని చూసిన వారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దాని ఆకారం అలా వుంటుంది మరి. ఈ ఆలయంలోని స్థూపాన్ని నిర్మించడానికే 60,000 క్యూబిక్‌ మీటర్ల రాయి అవసరమైంది. ఎటువంటి లోపాలు లేని అంత పెద్ద శిలలను ఆ రోజుల్లో ఆ ప్రదేశానికి ఏలా చేర్చారా అనేది ఈ నాటికీ ఊహకందదు.కొన్ని వందల మంది శిల్పులు అహోరాత్రులు శ్రమపడి అద్భుతమైన ఈ స్థూపాన్ని సృష్టించారు. ఆలయ గోపురాన్ని ఆరు అంతస్థులుగా నిర్మించారు. ప్రతి అంతస్థును అపూర్వమైన శిల్పకళాశోభతో మెరిసిపోతూ వుంటుంది. ఘంటాకారంలో వున్న చిన్నచిన్న మందిరాలలో కూర్చునివున్న బుద్ధ విగ్రహాలు ఈ అంతస్థులలో అనేకం వున్నాయి.

ఈ బుద్ధ ప్రతిమలను తాకినవారికి మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.27 వేల చదరపు అడుగుల కైవారంలో నిర్మించిన కింది గ్యాలరీలన్నీ బుద్ధుని జీవితానికి సంబంధించిన శిల్ప దృశ్యాలతో మనోహరంగా శోభిస్తూ వుంటాయి. ఆలయ ప్రాంగణంలోనూ కుడ్యాలపైనా ఇంకా ఇతర చోట్ల మొత్తం 470కి పైగా బుద్ధ ప్రతిమలు బోరోబుడుర్‌లో వున్నాయి. నాగరికత, జన సమ్మర్థం బోరోబుడుర్‌ వైపు విస్తరించకపోవడంతో ఈ ప్రాంతం ఇంకా పచ్చదనంతో పరవళ్లు తొక్కుతోంది. ఆలయ మధ్యభాగంలో ఉన్న మహాస్థూపం ఆకాశాన్ని తాకుతోందా అనిపిస్తుంది.

శతాబ్దాలపాటు బూడిదలోనే..!

ఒకసారి జావాలో ప్రజ్వరిల్లిన అగ్నిపర్వతాల ప్రభావం బోరోబుడుర్‌ ఆలయం మీద కూడా పడింది. అగ్ని పర్వతాలు విరజిమ్మిన భస్మరాశి ఈ ఆలయాన్ని కప్పేసింది. అలా బూడిద కుప్పల కింద కొన్ని శతాబ్దాలపాటు వుండిపోయింది. 1814వ సంవత్సరంలో అప్పటి జావా గవర్నరు సర్‌ స్టాన్‌ ఫోర్డ్‌ రాఫిల్స్‌ ఆలయ ఉద్ధరణకు పూనుకుని తవ్వకాలకు ఆజ్ఞాపించాడు. భస్మరాసులను తవ్విపోసి ఆలయాన్ని వెలికితీశారు. తర్వాత 1907వ సంవత్సరంలో అప్పట్లో జావాను పరిపాలించిన డచ్‌ వారు ఆలయ పునర్నిర్మాణానికి పూనుకుని చాలా మరమత్తులు చేయించారు. కానీ, అదే సమయంలో ఆలయానికి అంతులేని అపకారాన్ని కూడా చేశారు.

అప్పట్లో జావా సందర్శించిన థాయ్‌లాండ్‌ చక్రవర్తి మెహర్భానీ కోసం ఆయనకు బహుమానంగా బోరోబుడుర్‌లోని అమూల్యమైన శిల్పాలను అనేకం సమర్పించుకున్నారు అప్పటి డచ్‌ ప్రభుత్వం వారు. దాదాపు ఎనిమిది బండ్ల నిండుగా ఆలయ శిల్పాలను, అద్భుతమైన బుద్ధ విగ్రహాలను థాయ్‌లాండ్‌కు తరలించారు. అవన్నీ కూడా యథాతథంగానే వుండివుంటే ఆలయ అత్యంతాద్భుత సౌందర్యంతో నిండివుండేది. వీక్షించ డానికి వేయి కనులున్నా చాలవనే చెప్పుకోవచ్చు. అయినా ఇప్పటికీ బ్రహ్మాండమైన తన ఆకారంతో అద్వితీయ శిల్పకళాసౌందర్యంతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే వుంది బుద్ధదేవాలయం.

మెండట్‌, కాండీపవాన్‌...

Mendut Temple, Centra Java, Indonesia
ఈ దేవాలయంలోకి ప్రవేశించేముందే భక్తులకు మరో రెండు ఆలయాలు దర్శనమిస్తాయి. ఆసలు ముందు ఈ ఆలయాలను సందర్శించిన తర్వాతే బోరోబుడుర్‌ ఆలయంలోకి వెళ్లడం ఆచారం. ఈ రెండు ఆలయాలలో మొదటిది మెండట్‌ ఆలయం. ఇది కూడా బుద్ధుని ఆలయమే. ఇందులో కూర్చొనివున్న బ్రహ్మాండమైన బుద్ధదేవుని విగ్రహం వుంది. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే ఈ బుద్ధుడు మామూలు ఇతర బుద్ధవిగ్రహాలలో మాదిరిగా పద్మాసనం వేసుకుని నిమీలిత నేత్రాలతో కూర్చొని వుండడు. మామూలుగా కూర్చుని వున్నట్లు వుంటాడు. బోరోబుడుర్‌ ఆలయంలోకి వెళ్లేముందు భక్తులు మెండట్‌ బుద్ధుణ్ణి అర్చించిన తర్వాతే ముందుకు వెళతారు. మెండట్‌ తర్వాత కాండీపవాన్‌ అనే గుడి కనిపిస్తుంది. ఇది ధనాధిపతి అయిన కుబేరుని గుడి.

ఈ గుళ్లో కొలువుతీరిన స్వామి కుబేరుడే. బౌద్ధులు కుబేరుణ్ణి అదృష్టదేవతగా భావించి అర్చిస్తూ వుంటారు. ఈ దేవాలయాల వల్ల కూడా బోరోబుడుర్‌ ఆలయం యొక్క అందం ప్రవిత్రతా ద్విగుణీ కృతమై వుంటాయి. ఆ కారణంగానే ఈ ఆలయ సముదాయాన్ని సందర్శించడానికి విదేశాల నుండి కూడా భక్తులు జావా ద్వీపం వస్తుంటారు. జావా చాలా అందమైన ద్వీపం. ఉత్సాహం, డబ్బు వుండాలి కానీ ఇక్కడికి చాలా తేలికగా చేరుకోవచ్చు. జావాలో అడుగుపెట్టిన తర్వాత ఎక్కడికయినా అతి సౌకర్యంగా బస్సులలో ప్రయాణించవచ్చు. రైళ్ల సౌకర్యం కూడా వుంది.

Tuesday, October 23, 2012

31న నిరుద్యోగుల గర్జన

ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక చర్యల కారణంగా లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 31 తేదీ నాడు ఆర్‌.కృష్ణయ్య ఇక్కడ ఇందిరాపార్కు వద్ద ‘నిరుద్యోగుల గర్జన’ కార్యక్రమాన్ని నిర్వహిం చనున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీ విద్యార్థుల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారంనాడిక్కడ బీసీ భవన్‌లో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక ప్రభుత్వ శాఖల లో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడి అవినీతి పెరిగిపోతోందన్నారు.

ఇలాంటి వాటికి చోటివ్వకుండా, ప్రభుత్వంలోని వివి ద శాఖలలో ఏర్పడిన నాలుగున్నర లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయా లని ఆర్‌.కృష్ణయ్య ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా జరిపే ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. యూని వర్సిటీ విద్యార్థుల కార్యాచరణ కమిటీ కన్వీనర్‌ కె.జగదీష్‌ ఆధ్వ ర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్‌, కాశీం, రాజేందర్‌, బాల్‌రాజ్‌, నీలవెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు

Monday, October 22, 2012

నక్షత్రాలు - నక్షత్ర వీధులు (Stars - Galaxies)

విశ్వం అనంతమైనది. భూమి మరియు అంతరిక్షాన్ని కలిపి విశ్వం(Universe) అని లేక Space అని అంటారు. భూమి మరియు భూవాతవరణము తప్ప మిగిలిన ప్రదేశామంతటిని అంతరిక్షము(Outer space) అని అంటారు.

నీహరికలు(Nebula):

విశ్వంలో నక్షత్రాలే కాక నీహరికలు(Nebula) కూడా ఉంటాయి. అంతరిక్షంలో వేడి వాయువులచే ఏర్పడి చలన సహితంగా ఉన్న ధూళి మరియు వాయు మేఘాలు   లాంటి   ఖగోళ   వస్తువునే నీహరికలు(Nebula) అంటారు. వీటిని మొదట హ్యుజేన్(జర్మనీ) అనే శాస్త్రవేత్త గుర్తించారు. నక్షత్రాలన్నీ నిజానికి  ఈ మేఘలలోనే పుడతాయి. 

నక్షత్రవీధి(Galaxy) :

Andromeda Spiral Galaxy
Barred Spiral Galaxy

నక్షత్రాల గుంపును నక్షత్రవీధి(Galaxy) అంటారు.మనం నిత్యం చూచే సూర్యుడు కూడా భూమికంటే 333,000 రెట్లు బరువైనవాడు. భూమి కంటే సూర్యుని వ్యాసం 109 రెట్లు ఎక్కువ. మనం నివసించే నక్షత్రవీధి సముదాయాన్ని పాలపుంత(Milky way) లేక ఆకాశగంగ అంటారు. గెలాక్సీలో 98%  ద్రవ్యరాశి నక్షత్రాలుగా ఉంటుంది. మిగిలిన 2% వాయువుగా, దూళిగా ఉంటుంది. ఒక్కొక్క గెలాక్సీ లో ఒకటినుండి పది బిలియన్ల వరకు నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక గెలాక్సీ మందము కనీసము 1000 కాంతి సంవత్సరాలు ఉంటుంది. కాంతి సంవత్సరం విలువ 9.3 x 1012 కి.మీ. భూమికి సమీపంలో మేఘలేనిక్ మేఘము(Magellanic cloud) అను గేలక్సికి భూమికి మద్య దూరం 1,55,000 కాంతి సంవత్సరములు. మనకు సమీపంలో ఉన్న గెలాక్సీ పేరు ఆండ్రోమెడ (Andromeda). ఆండ్రోమెడా సర్పిలాకారంలో ఉంటూ భూమికి సుమారు 2.5 మిల్లియన్ల కాంతి సంవత్సరాల (2.4×1019 km) దూరంలో కలదు. ఇప్పటివరకు గుర్తించిన వాటిలో అతిపెద్ద గెలాక్సీ హైడ్రా(Hydra). పాలపుంత  గెలాక్సీ తప్ప మిగితా గెలాక్సీలు ఒకదానినుండి ఒకటి దూరమవుతూ అత్యంత వేగంతో విస్తరణ చెందుతాయని హబుల్ నిరూపించాడు. గెలాక్సీలు ఒకటినుండి 500ల వరకు సముదాయాలుగా (Cluster of  galaxies) ఉంటాయి. వీటిని విశ్వము అనే సముద్రములో దీవులుగా వర్ణిస్తారు. గెలాక్సీ అనబడే గ్రీకు పదాన్ని భారతీయులు పాలపుంత అని చైనీయులు ఖగోళ నదులని, హిబ్రులు కాంతి నదులని, ఎస్కిమోలు తెల్లని భస్మి పటలాలని మరియు యకుట్స్ దేవుని అడుగుజాడలని పిలుస్తారు. పాలపుంతలోని నక్షత్రములు పాలపుంత కేంద్రము చుట్టూ ఒక పరిభ్రమణం చేయుటకు పట్టుకాలము 225 x 106. దీనిని కాస్మిక్ సంవత్సరము (Cosmic year) అని అంటారు.

శూన్యప్రదేశాలు :
గెలక్సీలకు, నిహరికలకు మధ్య ఖాళీ ప్రదేశం. ఇది మొత్తం విశ్వం పరిమాణంలో 97% ను ఆక్రమించి ఉంది. విశ్వమంటే నక్షత్రవీధుల, నీహారికల, మరియు వాటి మద్య ఉండే శూన్యప్రదేశముల సంకలనమే. విశ్వాన్ని గురించి అద్యయనం చేసే శాస్త్రాన్ని కాస్మాలజి (రష్యన్), ఆస్ట్రానమీ(అమెరికా) అని పిలుస్తున్నారు.

నక్షత్రాలు(Stars) :

Epsilon Aurigae Star
భూమికి సూర్యుడు అత్యంత సమీపమైన నక్షత్రం. సూర్యునికి భూమికి మద్యవున్న సగటు దూరము 149,598,500 కి.మీ. దీనిని అస్ట్రనామిక్ ప్రమాణము (Astronamic Unit) అని అంటారు. సూర్యుని నుండి కాంతి భూమిని చేరుటకు 8.3 నిముషాలు పడుతుంది.సూర్యుని తరువాత భూమికి అతి దగ్గర నక్షత్రం ప్రోక్సిమా సెంటారీ (Proxima Centauri). ఇది భూమికి 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.కంటికి కనిపించే కాంతివంతమైన నక్షత్రం సూర్యుడు. సూర్యుని తరువాత కాంతివంతమైనది సిరియస్ (Sirius). ఇది భూమికి 8.7 కాంతి సంవత్సరముల దూరములో ఉంది. నక్షత్రాలు ఏర్పడటానికి సుమారు 10 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరమౌతున్నది. ఇప్పటివరకు కనుగొన్న నక్షత్రాలలో అతిపెద్దది ఎప్సిలాన్ అరిగా (Epsilon aurigae).

నక్షత్రాలకు సంబందించిన కొన్ని ముఖ్యమైన విషయాలు :

  • నక్షత్రాలు స్వయం ప్రకాశ శక్తిని కల్గి ఉంటాయి. నాడీ కొట్టుకుంటూ ఉన్న రీతిలో విద్యుత్ అయస్కాంత శక్తిని వెలువరిస్తూ ఉన్న నక్షత్రాలను పల్సర్ (Pulsar) అని అంటారు. వీటికి గల మరొక పేరు న్యూట్రాన్ నక్షత్రాలు.
  • పూర్తి స్థాయి నక్షత్ర దశని పొందక ముందు శక్తి జనక ప్రక్రియ ప్రారంభమైన నక్షత్రాలను అర్ధనక్షత్రాలు అని అంటారు. వీటికి గల మరొక పేరు క్వాసార్ (Quasar).
  • ఈ నక్షత్రాలలో శక్తి జనకనికి కారణమైన చర్య కేంద్రక సంలీనం (Nuclear fusion).
  • ఈ చర్య ప్రారంభమైన తర్వాత నిలకడగా ఒకే ప్రకాశ శక్తితో కనిపించు నక్షత్రాలను స్థిరనక్షత్రాలు అంటారు.
  • ఇందనం అయిపోయిన తర్వాత నిర్ధిష్ట కాలవ్యవధిలో ప్రకాశంలో మార్పుకు లోనయ్యే నక్షత్రాలను అస్థిరనక్షత్రాలు అంటారు. వీటికి గల మరొక పేరు చంచల నక్షత్రాలు (Cepheid variables).
  • తొలిసారి ఇటువంటి నక్షత్రాన్ని కనుగొన్న వ్యక్తి జాన్ గూడ్రిక్ (John Goodricke). ఇతను కనుగొన్న నక్షత్రం పేరు డెల్టా సెఫీ (Delta Cephei). అందువలన చంచల నక్షత్రాలను సేఫిడ్ వేరియబుల్స్ (Cepheid variables) అంటారు.
  • చంచల దశ తరువాత బాహ్య పొరలను ఆక్రమించుకొనే ప్రయత్నంలో మనకు ప్రేలినట్టుగా కనబడే నక్షత్రాలను "తాత్కాలిక నక్షత్రాలు" అంటారు. వీటికి గల ఇతరపేర్లు నోవా, సూపర్ నోవా.
  • బాహ్య పొరలను ఆక్రమించి పరిమాణంలో, ప్రకాశంలో పూర్తి స్థాయి పొందిన నక్షత్ర దశ రెడ్ జెయింట్ (Red giant). సూర్యుడు ప్రస్తుతం రెడ్ జెయింట్ దశలో ఉన్నాడు. రెడ్ జెయింట్ దశ తర్వాత ఇందనాన్ని పీల్చుకొనే ప్రయత్నంలో తెల్లగా మారుతూ పరిమాణంలో చిన్నదిగా మారే నక్షత్రాన్ని మరుగుజ్జు నక్షత్రం (White dwarf) అంటారు.
  • నక్షత్రంలో అణుసంలీన చర్య పూర్తిగా అంతరించిన తర్వాత పదార్థమంతా కేంద్రం దిశగా ఆకర్షించబడి ఏర్పడిన ఖగోళ వస్తువును కృష్ణ బిలం (Black hole) అంటారు. ఇది అత్యధిక సాంద్రతను మరియు అత్యధిక గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది.
  • ఈ కృష్ణ.బిలాల మీద పరిశోదన చేసిన భారత శాస్త్రవేత్త సుబ్రమణ్య చంద్రశేఖర్. ఇతను ప్రతిపాదించిన సిద్దాంతం "చంద్రశేఖర్ లిమిట్".
  • సూర్యుడు గేలక్సీలో ఒంటరిగా ఉండటం వలన ఇతనిని ఒంటరి నక్షత్రం అంటారు. 2 కంటే ఎక్కువ నక్షత్రాలు కల్గి ఉంటె దానిని బహుళ నక్షత్రాలు అంటారు. ఉదా : అల్ఫా సెంటారీ (or) ప్రాక్సిమా సెంటారీ - 3 నక్షత్రాలు.

విద్యార్థులా... మర యంతాల్రా..?

కార్పొరేట్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను చూస్తే బాధ, జాలి కలుగుతోంది. తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయేదాకా విద్యార్థులు నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్నారు. ఎంసెట్‌ అని, ఐఐటీఅని రకరకాల పేర్లు పెట్టి, విద్యార్థులను విభజించి, తరగతి గదులను జైలు గదుల్లా మార్చేసి పుస్తకాలు తప్ప మరో ప్రపంచం తెలియకుండా చేసేస్తున్నారు. ఇంట్లో జరిగే శుభకార్యాలు, ఊళ్లో జరిగే పండగలు పబ్బాల్లో పాల్గొనాలని ఉన్నా సెలవు దొరకని పరిస్థితి. ఆదివారాలూ, సెలవు దినాల్లోనూ తరగతులు నిర్వహిస్తుంటే ఇక విద్యార్థులకు విశ్రాంతి దొరికేదెప్పుడు? కాలేజీల్లో మరయంత్రాల్లా మారిపోతుంటే యువతలో మనో వికాసం కలిగేదెలా? ఎవరికైనా యుక్తవయసులోనే వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అలాంటి వయసులో బాహ్య ప్రపంచానికి సంబంధించిన విషయాలపైన అవగాహన అవసరమవుతుంది. దాని ఆధారంగానే వారిలో భావాలు రూపుదాల్చుతాయి. సామాజిక స్పృహ, బాధ్యత వంటివి ఏర్పడాలన్నా యుక్త వయసే చాలా కీలకమైనది. ఇంత ముఖ్యమైన వయసులో పుస్తకాలు తప్ప మరో అంశంతో పరిచయం లేకుండా చేసేస్తున్నారు. విద్యార్థులకు కనీసం దినపత్రికలైనా చదవడానికి సమయం లేకుండా పుస్తకాలతో కుస్తీ చేయిస్తున్నారు. ఇక టీవీ చూడడానికి, వార్తలు చూడడానికి సమయమే ఉండడం లేదు.


కళాశాలల యాజమాన్యాల తీరుకు విద్యార్థుల తల్లిదండ్రులూ వంత పాడుతున్నారు. తమ పిల్లలకు మార్కులొస్తే చాలని భావిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో జరగబోయే నష్టం గురించి ఆలోచించడం లేదు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను విస్మరించడానికి కారణం వారికి సామాజిక బాధ్యత, మానవతా విలువలు వంటివి నేర్పించకపోవడమేనని గుర్తించలేకపోతున్నారు. సెలవు దినాల్లో క్లాసులు నిర్వహించడం తప్పని విద్యార్థి సంఘాలు చెబుతున్నా వారికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సరైన మద్దతు లభించడం లేదు.

ఇప్పటికైనా పరిస్థితి మారాలి. యాజమాన్యాలు, ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలి. చదువులకు మార్కులే పరమావధి కాదని గుర్తించాలి. విద్యార్థుల మనో వికాసానికి అవసరమైన అన్ని చర్యలనూ చేపట్టాలి.

Sunday, October 21, 2012

ఏపీపీఎస్సీపై ట్రిబ్యునల్ ఆగ్రహం

ఏపీపీఎస్సీ అధికారుల తీరుపై రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 కీలో రెండు తప్పులపై దాఖలైన కేసులో వివరణ ఇవ్వాలంటూ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేసినప్పటికీ, ఏపీపీఎస్సీ స్పందించకపోవడంపై ట్రిబ్యునల్ మండిపడింది. సకాలంలో కౌంటర్ దాఖలు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏపీపీఎస్సీ అధికారులను ప్రశ్నించింది. గ్రూప్-1 కీ పత్రంలో ప్రకటించిన తప్పులకు గాను ఇప్పటికే 11 మార్కులను అభ్యర్థులకు కలిపిన విషయం తెలిసిందే. అయితే కీ లో మరిన్ని తప్పులు ఉన్నాయని, మెయిన్స్ పరీక్ష రద్దు చేయాలంటూ కొంత మంది అభ్యర్థులు అక్టోబర్ మొదటి వారంలో ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ట్రిబ్యునల్ విచారించింది.

గ్రూప్-4 పరీక్ష పేపర్ల వేల్యూయేషన్ ప్రారంభమయింది

గ్రూప్-4 పరీక్ష పేపర్ల వేల్యూయేషన్ ప్రారంభమయింది. ముందుగా గ్రూప్-4లోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కేటగిరి పేపర్ల వేల్యూ యేషన్ కమిషన్ మొద లు పెట్టింది. ఈ ప్రక్రి య పూర్తయిన తర్వాతే గ్రూప్-4 జూనియర్ అసి స్టెంట్స్ పేపర్ల వేల్యూయేషన్ ప్రారంభించ నున్నారు. 867 పోస్టులు గల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రాత పరీక్షకు 1.2 లక్షల మంది అభ్యర్ధులు పోటీపడిన సంగతి తెలిసిందే. కంప్యూటర్ వేల్యూయేషన్ ప్రక్రియను నవంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేయనున్నారని సమాచారం. వేల్యూయేషన్ ప్రక్రియ ముగిసే క్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రాత పరీక్ష ‘కీ’ ప్రకటించి, అభ్యర్ధుల నుంచి అబ్జెక్షన్స్ తీసుకోవాలని కమిషన్ నిర్ణయించింది. ఈ పరీక్ష పేపరు జవాబులపై ఏవేని ఫిర్యాదులు వస్తే వాటిని సమీక్షించుకుని ఫైనల్ ‘కీ’ ప్రకటించిన తర్వాతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్ష ఫలితాలు వెల్లడించనున్నారని కమిషన్ నుంచి సమాచారం. మొత్తం మీద డిసెంబర్ మొదటివారం కల్లా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు అభ్యర్ధులు ఆశించవచ్చు. ఇదిలా ఉండగా, 6.7 లక్షల మంది హాజరైన గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు 2013 జనవరి లేదా ఫ్రిబవరిలో వెలువడేలా కమిషన్ పనులు జరుగుతున్నాయి.

టాపర్‌గా నిలిచినా దక్కని కొలువు!

-ఏపీపీఎస్సీ నిర్వాకంతో పాలమూరువాసికి అన్యాయం

-తక్కువ మార్కులు వచ్చినవారికి ఉద్యోగాలు

-టాపర్‌కు మొండిచేయి చూపిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్లక్ష్యం నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తామని చెబుతున్న అధికారుల మాటలు ఆచరణలో బుట్టదాఖలవుతున్నాయి. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇంటర్వ్యూలు పూర్తయ్యేవరకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రిపేర్ అవుతున్నప్పటికీ నిరుద్యోగులకు ఉద్యోగం అందని ద్రాక్షలా తయారవుతోంది. అధికారుల చేతివాటం, నిర్లక్ష్య వైఖరి కారణంగా ఫలితాలు తారుమారవుతున్నాయనే ఆరోపణలు వెల్లు ఇందుకు మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన మల్లేష్ ఉదంతం ఓ ఉదాహరణ.

జరిగిందేమిటీ..?: గ్రూప్-2కు సంబంధించి 256 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్  ఉద్యోగాలతో 2010 ఆగస్టులో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు రాత పరీక్షను 2011 డిసెంబర్ 18న నిర్వహించింది. రాత పరీక్ష ఫలితాలను 2012 ఆగస్టు 8న విడుదల చేసిన ఏపీపీఎస్సీ... అదే నెల 23న ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఫలితాలను సెప్టెంబర్ 12న వెల్లడించింది. ఈ ఫలితాలలో జోన్-6 టాపర్‌గా 159/300 మార్కులతో మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఆర్ మహేష్ నిలిచారు. ఈ జోన్‌లో మొత్తం 12 పోస్టులకు గాను 5 పోస్టులు జనరల్, 2 పోస్టులు ఎస్సీ, 1 బీసీ-డీలకు కేటాయించారు. మరో నాలుగు పెండింగ్‌లో పెట్టారు. జనరల్‌కు సంబంధించి 3పోస్టులు, ఎస్సీకి సంబంధించిన 2 పోస్టులు, బీసీ-డీకి చెందిన ఒక్క పోస్టును అధికారులు భర్తీ చేశారు. ఐదు జనరల్ పోస్టులు ఉండగా అందులో టాపర్‌గా నిలిచిన మహేష్‌కు మాత్రం ఉద్యోగం దక్కలేదు. తనకంటే తక్కువగా అంటే.. 153, 145.5, 142 మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఆ కేటగిరిలో అధికారులు ఉద్యోగాలు కల్పించారు. జనరల్ కేటగిరీలోని ఐదు పోస్టుల్లో మూడే పోస్టులను భర్తీ చేయడం, ఆ మూడింటిలో కూడా తనకంటే తక్కువ మార్కులు వచ్చినవారికే అవకాశం ఇవ్వడం ఏమిటని మల్లేష్ ప్రశ్నిస్తున్నారు.

ఇంకా రెండు పోస్టులను భర్తీ చేయకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీస్తున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఏపీపీఎస్సీ చైర్మన్ రేచల్ చటర్జీకి సెప్టెంబర్ 17న, అక్టోబర్ 11న ఫిర్యాదు చేశానని, సరైన సమాధానం రాలేదని బాధితుడు మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న ఫిర్యాదు చేసిన తర్వాత ఎలాంటి సమాధానం రాకపోవడంతో తిరిగి అక్టోబర్‌లో ఏపీపీఎస్సీ చైర్మన్‌ను గట్టిగా ప్రశ్నించడంతో పొరపాటు జరిగిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలిపారు. కానీ, ఉద్యోగం కల్పించే విషయంపై స్పందించలేదని పేర్కొన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి, గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

బువ్వపెట్టని బిఇడి విద్య!

విద్యను అనేకమంది విద్యావేత్తలు వారి వారి ఆలోచనలను బట్టి, ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో మానవ జీవన విధానానికి అనుగుణంగా విద్యకు అనేక అర్థాలను ఆపాదించడం జరిగింది. కొందరు విద్యావేత్తలు విద్య అంటే ప్రశ్నించడం అన్నారు. విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్‌ అంటారని తెలుసు. ఇది ఎడ్యుకేర్‌, ఎడ్యుసీర్‌ అనే లాటిన్‌ పదాలనుంచి ఆవిర్భవించింది. ఎడ్యుకేర్‌ అంటే శిశువును అభివృద్ధి చేయడం అనీ, ఎడ్యుసీర్‌ అంటే దారి చూపించడం అనే అర్థాలు ఉన్నాయి. అంటే చీకటి నుండి వెలుగుకు దారి చూపించడం విద్య అని అర్థం.

ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య -అరిస్టాటిల్‌.

 మానవుడి అంతర్గత శక్తుల సహజమైన, సామరస్యమైన ప్రగతిపూర్వకమైన అభివృద్ధి విద్య -పెస్టాలజీ.

 విద్య అంటే వ్యక్తిలోని -శారీరక, మానసిక ఆధ్యాత్మిక పరమైన అత్యున్నత అంశాలను సమీకృతంగా వెలికితీయడం -గాంధీజీ.

 వేదకాలంలో మానవజీవితమునకు పరమార్థములు ధర్మ, అర్థ, కామ మోక్షములు అన్నారు. వీటిని సాధన చేయడం ఆనాటి విద్యావిధానంలో విధులు. వీటిని సాధించుటకే మనిషి జీవించాలి. బోధించే విద్య విధిగా అందుకు సహాయపడాలి. విద్య మానవుడిని సుఖమైన జీవనం గడపడానికి కాక అతడిని సమాజాభివృద్ధికి తోడ్పడే వ్యక్తిగా కూడా తయారు చేయాలి. విద్య సమాజంలో పేరుకొనిపోయిన చెడును మార్పు చేసి అందరు రుజుమార్గంలో నడిచే విధంగా చేస్తుంది. విద్య లేకపోతే సమాజం ఉంటుందా? ఎలా ఉంటుంది? ఇంతటి మహా అద్భుత శక్తి ఉన్న విద్యను అందించువారు ఉపాధ్యాయుడు. విద్యార్థికి, తల్లి, తండ్రి తర్వాత గురువు (ఉపాధ్యాయుడు) ముఖ్యమైన వ్యక్తి, కానీ వీరికి నేటి సమాజంలో లభిస్తున్న ఆదరణ ఎటువంటిదో మనందరికీ తెలుసు.

 ముఖ్యంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును పరిశీలిస్తే బి.ఇడి (బ్యాచ్‌లప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) ప్రొఫెషనల్‌ కోర్స్‌ పరిస్థితి ఘోరం. చైనా దేశంలోని వ్యక్తులు ఉపాధ్యాయులను ఎక్కువగా గౌరవిస్తారు. కానీ, మన రాష్ట్ర పరిస్థితిని గమనిస్తే వీరికి ఇచ్చే ఆదరణ గౌరవం శూన్యం అనే చెప్పాలి. రాజకీయ నాయకులు వాగ్దానాలకే పరిమితం అవుతున్నారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్ధానాలను ఎన్నికల తర్వాత పూర్తిగా మరిచిపోతారు. ''ఓటు వేసేదాకా ఓడమల్లన్న, ఓటు వేసిన తర్వాత బోడి మల్లన్న'' అంటారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వీరు నిర్వీర్యం చెందుతున్నారు. బి.ఇడి ఉపాధ్యాయ అభ్యర్థులు ముందుగా ప్రవేశ పరీక్ష (ఎడ్‌ సెట్‌)కు సన్నద్ధమై దానిలో కష్టపడి ర్యాంకు సాధించుకొని, బి.ఇడి (ప్రొఫెషనల్‌) కోర్స్‌లో చేరుతారు. ఈ ఒక సంవత్సర కాలంలో ప్రాజెక్టు వర్క్స్‌, రికార్డ్‌లు, మైక్రో, మాక్రో, కో-కరిక్యులమ్‌, కంప్యూటర్‌ ప్రాజెక్ట్‌లు నిర్వహిస్తారు. వీటిలో నైపుణ్యం చదివిన తర్వాత కోర్స్‌ చివరలో మరోసారి పరీక్షలకు సిద్ధమై పరీక్షల్లో ఉత్తీర్ణులై బి.ఇడి (సర్టిఫికెట్‌)ను సాధిస్తారు. ఈ కోర్స్‌ ఒక్క ఉపాధ్యాయ పరీక్షకు తప్ప వేరే ఇతర పనులకు ఉపయోగపడదు. ఇతర ప్రొఫెషనల్‌ కోర్స్‌ల్లాగా వేరే ఉద్యోగాలకు ఎలాంటి డిమాండ్‌ లేకపోవడంతో ఈ కోర్స్‌ పట్ల ఆదరణ తగ్గుతుంది. వీటిలో ఎక్కువగా బీద, మధ్యతరగతి, సామాన్య కుటుంబ విద్యార్థులే చేరతారు. రాజకీయ నాయకుల పిల్లలు, ధనవంతుల పిల్లలు ఇతర ప్రొఫెషనల్‌ కోర్స్‌లైన ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, ఎంబిఎ, ఎంసిఎ, సాఫ్ట్‌వేర్‌ కోర్సులను మరియు ఇతర దేశాల్లో అమెరికా, బ్రిటన్‌, లండన్‌లో విద్యను అభ్యసిస్తారు. కావున రాజకీయ నాయకులకు ఇక్కడి పరిస్థితులు అర్థం కావు. వారి పిల్లలు ఉన్నారుగా, వేరే వారి పిల్లల పరిస్థితి గురించి మాకేంటి అనే రీతిలో ప్రవర్తిస్తారు. బి.ఇడి అభ్యర్థులకు ఉపాధి దొరకక రోడ్డునపడే పరిస్థితి దాపురించింది. డి.ఎస్‌సిలు (డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ)లు రెండు లేదా నాలుగు సంవత్సరాలకొకసారి నిర్వహిస్తారు. వాటిలో ఖాళీలు తక్కువ, పోటీ ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో సుమారు 80,000 మంది బి.ఇడి అభ్యర్థులు తయారు అవుతున్నారు. అనేక ఇబ్బందులతో సంపాదించిన పట్టాతో ఉద్యోగానికి అప్లై చేస్తే అనేక పరీక్షలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడు కొత్తగా టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)ను మరియు దానిలో క్వాలిఫై అయిన తర్వాత డి.ఎస్‌సి (డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ) ద్వారా మరో పరీక్షకు సన్నద్ధమై పరీక్షలు రాసి దానిలో మంచి మార్కులు సాధించాలి. ఇలా అనేక పరీక్షలను ఎదుర్కోవలసి వస్తోంది. ఇన్ని పరీక్షలు సివిల్‌ సర్వీసెస్‌, గ్రూప్‌ 1, 2 లకు లేవు ఉపాధ్యాయ పరీక్షకే ఎందుకు? ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల బి.ఇడి అభ్యర్థులు తగ్గిపోతున్నారు.

ఈ ఏడాది సుమారు 11,800 సీట్లు మిగిలిపోయాయి. బి.ఇడి చేయాలనే తపన విద్యార్థుల్లో సన్నగిల్లుతోంది. ఎలాంటి ఇతర ఉపాధి అవకాశాలు లేకపోవడం అభ్యర్థులు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. అభ్యర్థులు లేక ప్రైవేట్‌ కళాశాలలు వెలవెలబోతున్నాయి. దేశం ఎంత అభివృద్ధి జరుగుచున్న కంప్యూటర్‌, సాఫ్ట్‌వేర్‌ రంగంలో దూసుకుపోతున్నా, బోధించే ఉపాధ్యాయులు లేనిదే సమాజం అభివృద్ధి సాగదు, కుంటుబడుతుంది. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడానికి ఇష్టపడరు. కారణం ఉపాధి అవకాశాలు లేకపోవడం. ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ ఉద్యోగాలు కల్పిస్తామంటూనే, మరోవైపు నిరుద్యోగులకు అన్యాయం చేస్తోంది. దీనికి ఉదాహరణ: సర్వశిక్షా అభియాన్‌ పథకం ద్వారా మంజూరయిన ఉపాధ్యాయ పోస్టులకు ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు 70 శాతం ప్రమోషన్లు ఇచ్చి, నిరుద్యోగులకు మాత్రం 30 శాతం పోస్టులను కేటాయించడం అన్యాయం కాదా? ఉన్నవారికే ఉపాధా? మరియు బి.ఇడి వారికి ఎస్‌జిటి పోస్టులకు అనర్హులుగా పేర్కొన్నది. ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు మాత్రమే అవకాశం ఇచ్చింది. ఎస్‌ఎ పోస్ట్‌లో 1-5 వరకు మాత్రమే అన్ని సామాజిక వర్గాలకు పోస్టులు వస్తున్నాయి. అంటే ఒక్కో పోస్ట్‌కు 1 : 150 కంటే ఎక్కువగా పోటీ ఉంటుంది. ఎస్‌జిటి పోస్టులను 100 శాతం డి.ఇడి అభ్యర్థులకు కేటాయించింది. ఇలా అన్నిరకాలుగా బి.ఇడి అభ్యర్థులకు నష్టం జరుగుతోంది. రానున్న కాలంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే బి.ఇడి అభ్యర్థులు, కరవై, మొత్తం బి.ఇడి కళాశాలలు మూతపడే ప్రమాదం ఉంది. కావున, బి.ఇడి చేసిన అభ్యర్థులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలి. ప్రతి సంవత్సరం డిఎస్‌సిని నిర్వహించాలి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను ఎక్కువగా ఖాళీలను భర్తీ చేయాలి. సుమారుగా 20,000 మంది స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలను ఇవ్వాలి. ఒక ఉపాధ్యాయ వృత్తికే కాకుండా ఎపిపిఎస్‌సి నిర్వహించే జూనియర్‌ లెక్చరర్‌ పోస్ట్‌లు కూడా పిజితో బాటు బి.ఇడి విద్యార్హత తప్పనిసరి చేయాలి. టెట్‌ని రద్దు చేయాలి. డిఎస్‌సి ఒకే పరీక్షను నిర్వహించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం తప్పనిసరి అయితే టెట్‌ ్శ డిఎస్‌సిని ఒకే పరీక్షను నిర్వహించాలి. ప్రైవేట్‌ పాఠశాలల్లో బి.ఇడి అభ్యర్థులను మాత్రమే తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. డిగ్రీతో నిర్వహించే ఇతర పోస్టులకు కూడా బి.ఇడి తప్పనిసరి చేయాలి. కొత్త ఉపాధి మార్గాలు చూపాలి. త్వరలో వెలువడే గ్రామ కార్యదర్శి, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు బి.ఇడి తప్పనిసరి చేయాలి. ఇలా కొత్త ఉపాధి చూపిస్తే తప్ప లేనిచో బి.ఇడి అనే మాటను అభ్యర్థులు మరిచిపోయే ప్రమాదం ఉంది. కావున ప్రభుత్వం పునరాలోచించి అన్ని రకాలుగా బి.ఇడి అభ్యర్థులను ఆదుకొని ఉపాధి మార్గాలను చూపించాలని ప్రభుత్వానికి హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను.


ఎపిపిఎస్‌సి ఇంటర్వ్యూలపై త్వరలో నిర్ణయం: సిఎం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా కొన్ని కేటగిరీ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ఇంటర్వ్యూలు అవసరం లేని పరీక్షల ఫలితాలను ప్రకటించాలనే అంశంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశంపై సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభ్యర్థులకు హామీ ఇచ్చారు. ఏపిపిఎస్‌సి నిర్వహించిన అనేక పరీక్షలు రాసిన విద్యార్థులు శుక్రవారం సిఎంను క్యాంపు ఆఫీసులో కలుసుకుని ఏపిపిఎస్‌సి పరీక్షలు నిర్వహించి నెలలు గడచినా ఫలితాలు విడుదల చేయలేదని, ఈ అంశంపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు అభ్యర్థించారు.

అటవీ రేంజి అధికారులు, ఔషధ శాఖ ఇన్‌స్పెక్టర్లు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్లు, సీనియర్ ఎంటమాలజిస్టులు తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ఆరు నెలలు గడచింది. ఈ ఉద్యోగాలకు ఇంటర్య్వూలు నిర్వహించాలని ఏపిపిఎస్‌సి సభ్యులు పట్టుబడుతున్నారు. కాని జీవో 420 ప్రకారం ఈ కేటగిరీ ఉద్యోగాలకు ఇంటర్వూలు అక్కర్లేదు. ఇదే అంశంపై పెద్ద సంఖ్యలో ఏపిపిఎస్‌సి పరీక్షలు రాసిన విద్యార్థులు ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. గత ఏడాది నుంచి ఏపిపిఎస్‌సి 40 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2 లాంటి ప్రజలతో ప్రతక్ష్య సంబంధం ఉన్న ఉద్యోగాలకు మాత్రమే ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. మిగతా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అక్కర్లేదు. ఇంటర్వ్యూలు అక్కర్లేని ఉద్యోగాలు నాలుగు వేల వరకు ఉన్నాయి. వీటికి ఇప్పటికే పరీక్షలు నిర్వహించారు. ఇంటర్వ్యూలు అక్కర్లేదని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అభ్యర్థులు పేర్కొన్నారు. ఇంకా ఐదారు నోటిఫికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగార్థులు వీటిపై ఓ స్పష్టమైన ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని, ఈ సందర్భంగా అభ్యర్థులు ముఖ్యమంత్రికి విన్నవించారు.

Saturday, October 20, 2012

గ్రూప్-2 2011 వైట్నర్ వివాదం పై సుప్రీమ్ కోర్టుకు వెళ్ళిన ఎపిపిఎస్సి - CASE NUMBER SPL(CIVIL) 30781/2012

గ్రూప్-2 2011 వైట్నర్ వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. వివరాల్లోకి వెళితే 600 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గాను 1200  అభ్యర్థులను ఇంటర్వ్యూ కి ఎపిపిఎస్సి పిలిచింది.అయితే ఫైనల్ ఫలితాలు ప్రకటించే లోగానే అనూహ్యంగా వైట్నర్ వివాదం తెరపైకి వచ్చింది. పరీక్షలో వైట్నర్ వాడిన అభ్యర్థులను ఎలా ఇంటర్వ్యూ లకు, ఆపై ఉద్యోగాలకు ఎంపిక చేస్తారంటూ వైట్నర్ వాడని కైలాస రావు ప్రధాన పిటిషనర్ దారుగా మరొక ఎనిమిది మంది  అభ్యర్థులు కోర్టను ఆశ్రయించారు.ట్రిబ్యునల్, హైకోర్ట్ లలో వాదోపవాదనలు జరిగాయి.

ఈ విషమై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైట్నర్ వాడిన అభ్యర్థులకు అనుగుణంగా, ఇప్పటికే ఇంటర్వ్యూ ల ప్రక్రియ పూర్తయినందున, ఈసారికి, వైట్నర్ వాడటం ఇది తోలిసారి  కాబట్టి, మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయాలనీ సుప్రీమ్ కోర్టకు వెళ్ళినట్లు తెలుస్తుంది. సుప్రీమ్ కోర్టు తీర్పు ఒక పది రోజుల్లో తేలనుంది. విషయం తేలిన తరువాత సుప్రీమ్ కోర్టు ఆదేశాలనుగునంగా ఎపిపిఎస్సి గ్రూప్-2 2011 నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.  

గ్రూప్-2 2012 రిజల్ట్స్


గత సంవత్సరం జరిగిన గ్రూప్-2 ఫలితాలకు సంబంధించిన వైట్నర్ కేసులో  సుప్రీమ్ కోర్టు  తీర్పు మరో 10 రోజుల్లో ప్రకటించనుందని ఎపిపిఎస్‌సి అధికారులు భావిస్తున్నారు. ఈ తీర్పు మేరకు పెండింగ్ లోఉన్న గ్రూప్-2 పోస్టుల ఎంపిక ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జులై 21, 22వ తేదీలలో జరిగిన తాజా గ్రూప్-2 పరీక్ష పేపర్ల వేల్యూయేషన్ పక్రియ పూర్తయిందని మరో వారం పదిరోజులలో కోడింగ్, డీకోడింగ్ ,కాన్ఫిడెన్షియాలిటీ పనులు పూర్తిచేసి ఫలితాల వెల్లడికి సిద్ధం చేస్తామని తెలిపారు. మొత్తం మీద పాత గ్రూప్-2 పోస్టుల ఎంపిక పక్రియ పూర్తి చేసిన నెల రోజులలోనే తాజా గ్రూప్-2 పోస్టుల పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామన్నారు. దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రూప్-2 పరీక్ష ఫలితాలు వచ్చే నెలలో వెలువడుతాయని అభ్యర్థులు భావించవచ్చు. తాజా గ్రూప్-2 పోస్టుల భర్తీలో ఇంటర్యూలు లేక పోవటంతో రాతపరీక్ష మెరిట్‌తోనే ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చని అభ్యర్థులు భావిస్తున్నారు.


గ్రూప్-1 వేల్యూయేషన్....

శరవేగంగా గ్రూప్-1 వేల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబర్ 18న ప్రారంభమైన గ్రూప్-1 వేల్యూయేషన్ పక్రియను 45 రోజుల వ్యవధిలో పూర్తిచేయాలనే షెడ్యూల్‌తో కమిషన్ దూసుకెళ్తోంది. ఇప్పటికే రెండు పేపర్ల వేల్యూయేషన్ ప్రక్రియ ముగిసిందని, మిగతా పేపర్ల వాల్యుయేషన్ నవంబర్ మొదటి వారం కల్లా పూర్తి కానుందని అధికారుల ద్వారా తెలిసింది.

సాధారణంగా గ్రూప్-1 పేపర్ల వేల్యూయే షన్ ప్రక్రియ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేసే సామర్థ్యం ఎపిపిఎస్‌సికి ఉంది. అయితే ఈ సారి డబుల్ వేల్యూయేషన్ విధానం అమలు చేస్తున్న దృష్ట్యా మరో 15 రోజులు అదనపు వ్యవధి కమిషన్‌కు అవసరమని అధికారులు వివరిం చారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో 314 గ్రూప్-1 పోస్టులకు 1ః2 నిష్పత్తిలో 628 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.

ఈ మొత్తం అభ్యర్థులకు నెల రోజుల వ్యవధిలో ఇంటర్వ్యూలు పూర్తి చేయనున్నట్లు సమాచారం. మొత్తం మీద గ్రూప్-1 పోస్టుల ఎంపిక పక్రియ మొత్తం ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి చేసేలా కమిషన్ కట్టుది ట్టమైన చర్యలు చేపట్టింది. అయితే గ్రూప్-1 రిక్రూట్‌మెంట్‌పై వేసిన పలు కోర్టు కేసుల తుది తీర్పునకు లోబడి మెయిన్స్ పరీక్ష ఫలితాలు కమిషన్ ప్రకటించనుంది.

నిరుద్యోగులకు వరమనుకున్న ఏపీపీఎస్సీయే వారిపాలిట శాపంగా మారుతోంది

 •డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ - పరీక్ష తేదీ ఏప్రియల్‌ 29

•ఇండస్ట్రియల్‌ ప్రమోషన్ ఆఫీసర్స్‌- పరీక్ష తేదీ మే 6

•ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్‌- పరీక్ష తేదీ జూన్‌ 3

•రాత పరీక్షల మార్కులే ఫైనల్‌ అంటున్న ప్రభుత్వం

•ఇంటర్వ్యూలు పెడతామంటున్న ఏపీపీఎస్సీ

•మధ్యలో నలిగిపోతున్న అభ్యర్థులు

•20 వేల పోస్టుల భర్తీకి 50 నోటిఫికేషన్లు

•రాతపరీక్షలతో పోస్టింగ్‌లు ఇస్తామన్న ప్రభుత్వం

•ఇంటర్వ్యూలు పెట్టి తారాలంటున్న ఏపీపీఎస్సీ

•కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూలు వద్దని సూచించిన కమిటీ

•ఇంటర్య్వూలు రద్దుచేస్తూ జీవో 420 విడుదల

•ఇంటర్వ్యూలు కావాలని పట్టుపడుతున్న కమిషన్ సభ్యులు

•నిలిచిపోయిన 30 కిపైగా నోటిఫికేషన్‌ల ఫలితాలు

•లాంగ్‌లీవ్‌పై వెళ్లిన సెక్రటరీ పూనం మాలకొండయ్య?

•ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనంటూ సీఎంపై ఒత్తిడి

నిరుద్యోగులకు వరమనుకున్న ఏపీపీఎస్సీయే వారిపాలిట శాపంగా మారుతోంది. నెలలు గడుస్తున్నా.. పరీక్షా ఫలితాలు మాత్రం విడుదల చేయడం లేదు. ప్రభుత్వం వద్దని చెప్పినా.. ఇంటర్య్వూలు నిర్వహించాలనే పట్టుబడుతోంది. అసలింతకీ కమిషన్‌లో ఏం జరుగుతుంది.? లక్షలాది మంది అభ్యర్ధుల జీవితాలతో ఏపీపీఎస్‌సీ ఎందుకు చెలగాటం ఆడుతుంది....వాచ్‌ దిస్‌ స్టోరీ.పరీక్షలు జరిగి ఐదునెలలైంది... ఫలితాలెప్పుడొస్తాయి సార్‌.... ఇదీ వందలాదిమంది నిరుద్యోగులు ఏపీపీఎస్సీ కార్యాలయంలో కనబడిన వారినందరినీ అడుగుతున్న ప్రశ్న. ఏళ్ల తరబడి ప్రిపేర్‌ అయి పరీక్షలు రాసిన అభ్యర్ధులు... ఇప్పడు ఫలితాల కోసం కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ ఏపీపీఎస్సీ నుంచి వస్తున్న సమాధానం చూసి ఆశ్యర్యపోతున్నారు.

గతేడాది దాదాపు 20 వేల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 50కి పైగా నోటిఫికేషన్‌లు జారీ చేసింది. రాత పరీక్షలూ పూర్తయ్యాయి. కానీ ఏంలాభం నెలలు గడుస్తున్నా ఫలితాలు మాత్రం విడుదల కావడం లేదు. 30 నోటిఫికేషన్‌ల ఫలితాల విడుదలపై కమిషన్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీనికి కారణం కమిషన్‌లోని కొంతమంది నిర్వాకమే అని తెలుస్తుంది. వాస్తవానికి నోటిఫికేషన్‌లు విడుదల చేసినప్పుడు రాతపరీక్షల మార్కుల ఆధారంగానే పోస్టింగ్‌లు ఇస్తామని పేర్కొన్నారు. తీరా పరీక్షలయ్యాక ఇప్పడు ఇంటర్య్యూలు పెడితేగానీ కుదరదంటూ మడతపేచి పెడుతోంది. ప్రభుత్వ ఇంటర్య్వూలు ఉండవని చెబుతుంటే సభ్యులు మాత్రం ఇంటర్య్వూలు పెట్టాలని డిమాండ్‌ చేస్తుండటంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు.

వాస్తవానికి గతేడాదే ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం వేసిన సత్యనారాయణ కమిటీ... ప్రజలతో సంబంధం ఉండని పోస్టులకు ఇంటర్య్వూలు అవసరం లేదని సూచించింది. దీని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న కొన్ని పరీక్షలకు ఇంటర్య్వూలు రద్దు చేస్తూ జీవో 420 ని విడుదల చేసింది. దీన్ని కమిషన్‌లోని మెజార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్వత్రంత్ర ప్రతిపత్తిగల సంస్థ కావడంతో ప్రభుత్వానికి తమపై పెత్తనం చేసే అధికారం ఉండదని చెప్పుకొస్తున్నారు కమిషన్‌ సభ్యులు.మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పోస్టులకు అభ్యర్ధుల నుంచి భారీగా డబ్బులు గుంజుకోవచ్చనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంటర్య్వూల విషయంలో కమిషన్‌ సభ్యులు, కార్యదర్శి పూనం మాలకొండయ్య మధ్య కోల్డ్‌వార్‌ కారణంగా ఆమె లాంగ్‌లీవ్‌ పెట్టి వెళ్లినట్టుగా సమాచారం. ఇంటర్య్వూల నిర్వహణపై ఇటీవల కమిషన్‌ సభ్యులు కొంతమంది సీఎం కిరణ్‌ను కలిసి విన్నవించారు. ఇప్పటికే రచ్చబండ కార్యక్రమాల్లో చాలాసార్లు సీఎం కిరణ్ సైతం ఇంటర్య్వూలు రద్దు చేస్తామని ప్రకటించారు. ఇవేమీ పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.కమిషన్‌ తీరుతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఏపీపీఎస్సీ విషయంలో సర్కార్ జోక్యం చేసుకోకుంటే ప్రతిభ ఉన్న నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది.

ఎపిపిఎస్సి ని ముట్టడిస్తాం - ఆర్.కృష్ణయ్య

గ్రూప్-2 ఉద్యోగాలను గ్రూప్-1 లో విలీనం చేయాలనే ఆలోచనను విరమించకపోతే వేలాదిమంది నిరుద్యోగులతో ఎపిపిఎస్సి ని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షలు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.చీఫ్ సెక్రటరీని ప్రిన్సిపల్ సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీని కలెక్టర్ గా నియమిస్తారా? వేర్వేరు స్థాయి కలిగిన గ్రూప్-2 ఉద్యోగాలను గ్రూప్-1 లో  ఎలా విలీనం చేస్తారని ఆయన ప్రశ్నిచారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆద్వర్యంలో వేలాది మంది నిరుద్యోగులు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ప్రదర్శనలో ఆయన మట్లాడుతూ గ్రూప్-2 లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను, గ్రూప్-1(బీ)  సర్వీసుగా మార్చడం న్యాయపరంగా, చట్టపరంగా విరుద్దమన్నారు. ఆరువేల గ్రూప్-2 ఉద్యోగాలను తక్షణమే భర్తిచేయాలని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవినీతిని అరికట్టాలని, అన్ని కేటగిరీల ఉద్యోగాలను రాత పరీక్షల మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారమే భర్తీ చేయాలనీ సూచించారు.గ్రూప్-2 ఉద్యోగాలను గ్రూప్ 1 లో విలీనం చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఇలా విలినంచేస్తే రెండు మార్కుల తేడాతో డిప్యూటీ కలెక్టర్ నుంచి డిప్యూటీ తహసిల్దార్ పోస్టుకు పడిపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు .ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే వేలదిమందితో ఎపిపిఎస్సి ని దిగ్బందం చేస్తామని హెచ్చరించారు. ఖాళీగా ఉన్న 4.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేసారు.


Friday, October 19, 2012

దసరా తర్వాతే డీఎస్సీ మెరిట్ జాబితాలు

రాష్ట్రంలో 21,343 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ రాత పరీక్షకు సంబంధించిన జిల్లాల వారీ మెరిట్ జాబితాలను దసరా పండుగ తరువాతే జిల్లాలకు పంపించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇటీవల రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఈ నెల 8 నుంచి అభ్యర్థుల ఆన్‌లైన్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం ఇచ్చింది. గురువారంతో ఈ గడువు ముగిసింది. దాదాపు 4,500 మంది అభ్యర్థులు దరఖాస్తుల్లో పొరపాట్లను సరిదిద్దుకున్నారు. ఇక అభ్యర్థులకు సంబంధించిన రాత పరీక్ష మార్కులను, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మార్కులను కలిపి జిల్లాల వారీగా మెరిట్ జాబితాలను రూపొందించే పనిపై దృష్టి సారించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో 10 రోజులకు పైగా సమయం పట్టనుంది. దసరా పండుగ తరువాతే మెరిట్ జాబితాలను హార్డ్ కాపీలతోపాటు సాఫ్ట్ కాపీలను జిల్లాలకు పంపనుంది.

గ్రూప్-2కు ప్రత్యేక నోటిఫికేషన్ కోసం ఇందిరాపార్క్ వద్ద నేడు ఆర్.కృష్ణయ్య భారీ ధర్నా

గ్రూప్-2 లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో విలీనం చేయవద్దని, గ్రూప్-2 ఉద్యోగాలకు  ఎప్పటిలాగే ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలని, ఈ కేడర్ లో ఖాళీగా ఉన్న 6 వేల ఉద్యోగాలను భర్తీ  చేయాలనే డిమాండ్లతో శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలిరావాలని పిలుపిచ్చారు. గ్రూప్-2 పోస్టుల్ని గ్రూప్-1 లో విలీనం చేస్తే గ్రామీణ పేద  అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. 


హైదరాబాద్ లో గ్రూప్ 2 కోసం కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అందరు ఇందిరాపార్క్ వద్ద గల ధర్నా లో పాల్గొని విజయవంతం చేయాలనీ మనవి.

Thursday, October 18, 2012

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై స్టే

హైదరాబాద్ : గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను వచ్చే నెల 5 వరకు ప్రకటించరాదని రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్ గురువారం ఏపీపీఎస్సీని అదేశించింది. ప్రిలిమ్స్ పరీక్ష కీ విషయంలో వారంలోగా కౌంటర్ దాఖలు చేయలని స్పష్టం చేసింది. కీలో మరో ఆరు తప్పులు ఉన్నాయని, వాటిని పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షను నిర్వహించటంపై కొందరు అభ్యర్థులు ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ విషయంలో ఏపీపీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించటం లేదని, దీనివల్ల తమకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు కోర్టుకు విన్నవించారు. అభ్యర్థుల వాదనలపై స్పందించిన ట్రిబ్యునల్ ఫలితాలపై స్టే విధించింది.

Tuesday, October 16, 2012

గ్రూప్ 2 2011 వైట్నర్ కేసు ఎప్పుడు ముగుస్తుందో దేవుడు కూడా చెప్పలేడు - కైలాస రావు


కైలాస రావు, గ్రూప్ 2 2011 అభ్యర్థులకు పరిచయం అవసరం లేని పేరు, ఎనిమిది నెలలుగా ఫైనల్ సెలక్షన్ లిస్టు ను ఆపిన ఘనత వీరికి మరియు ఎపిపిఎస్సి వారికే చెందుతుంది.ముందు కైలాస రావు వాదన ఏంటో చూద్దా. " ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైట్నర్ ఫ్లూయిడ్ వాడిన అభ్యర్థుల OMR షీట్లను వాల్యుయేషన్ చేయడమే కాకుండా వారిని ఎగ్జిక్యూటివ్ పోస్టల భర్తీకి పరిగణలోకి తిసుకోవడం జరిగినది, ఇది అన్యాయం మరియు రాజ్యాంగ విరుద్దం, కావున  వైట్నర్ ఫ్లూయిడ్ వాడిన అభ్యర్థులను పూర్తిగా సెలక్షన్ కు మినహాయించి మిగిలిన మొత్తం అభ్యర్థులతో క్రొత్త సెలక్షన్ లిస్టును తయారు చేసి వారికే ఇంటర్వ్యూ లను నిర్వహించి ఎగ్జిక్యూటివ్  మరియు నాన్ - ఎగ్జిక్యూటివ్ పోస్టల భర్తీని  చేయవలసినదిగా కోరడమైనది." ఇది కైలాస రావు వాదన.

కైలాస రావు వాదనను పూర్తిగా పరిశీలించినట్లైతే కొంత న్యాయం మరికొంత అన్యాయం కనిపిస్తుంది. పూర్తిగా  వైట్నర్ ఫ్లూయిడ్ వాడిన అభ్యర్థులను తొలగించాలి అని కోరడం అది అన్యాయం, కేవలం వైట్నర్ ఫ్లూయిడ్ వాడిన ప్రశ్నలను తొలగించాలి అని కోరితే సరిపోయేది . కైలాస రావు ఈ చిన్న విషయమై కోర్టకు వెళ్ళడం నాకైతే సబబుగా అనిపించడం లేదు ఎందుకంటే ఇది వరకు పెన్సిల్ వాడినప్పుడు తప్పుడు  సమాదానంను గుర్తించాం అని అనుకొన్నప్పుడు  దాన్ని రబ్బరు తో చెరిపివేసి సరైన సమాదానంను గుర్తించే అవకాశం ఉండేది.ఇప్పుడు పెన్సిల్ బదులు పెన్ వాడమని ఎపిపిఎస్సి వారు చెప్పడంతో అందరు పెన్ నే ఉపయోగించారు.ఎపిపిఎస్సి వారు పెన్ ను ఉపయోగించమన్నారు కానీ వైట్నర్ ఫ్లూయిడ్ ను ఉపయోగించమని కానీ ఉపయోగించకూడదు అని కానీ చెప్పకపోవడంతో ఈ గందరగోల పరిస్థితికి కారణం అయింది.వైట్నర్ ఫ్లూయిడ్ ఉపయోగించవచ్చు అని అనుకోన్నవారు ఉయోగించారు ఉపయోగించకూడదు అని అనుకోన్నవారు ఉపయోగించలేదు.  ఇక్కడ అభ్యర్థులు ఏమనుకొన్నారు  అనేది ముఖ్యం కాదు నోటిఫికేషన్ లోని నిబందనలో ఏమున్నది అనేదే ముఖ్యం. నోటిఫికేషన్ లోని నిబందనలో వైట్నర్ ఫ్లూయిడ్ గురించి ఎక్కడా ఏమిలేదు. అలాంటప్పుడు వైట్నర్ ఫ్లూయిడ్ ను ఉపయోగించిన వారిని తప్పుపట్టడం ఎంతవరకు సబబు.పూర్తిగా తప్పంత ఎపిపిఎస్సి  అదికారులదే, నోటిఫికేషన్ లో వైట్నర్ ఫ్లూయిడ్ ఉపయోగించాలో లేదో ఏమి తేలపకపోవడంతో ఈ గందరగోల పరిస్థితికి కారణం అయింది.

ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే కైలాస రావు కేసు గెలిచినా, ఓడిన అతనికి వ్యక్తిగతంగా కలిగే ప్రయోజనం ఏమిలేదు. అతను ఇంటర్వ్యూ లకు సెలెక్ట్ అయిన 1203 అభ్యర్తులలో లేనేలేడు. నేను అతనిని కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుంది అని అడిగినప్పుడు అతను నాకిచ్చిన నిర్లక్షపు సమాదానం " గ్రూప్ 2 2011 వైట్నర్ కేసు ఎప్పుడు ముగుస్తుందో దేవుడు కూడా చెప్పలేడు ".

ఇతని విషయం ఇలాఉంటే ఇక ఎపిపిఎస్సి ప్రవర్తన విస్మయం కలిగించేలా ఉంది. అక్టోబర్ 17 న కేసు గనుక ఓడిపోతే ఎపిపిఎస్సి సుప్రీమ్ కోర్టకు కూడా వెళ్ళడానికి కూడా సిద్దంగా ఉంది అట.అదే నిజం అయితే అభ్యర్థులందరూ పోరు బాట పట్టాల్సిందే న్యాయం కోసం ధర్నాలు చేయవలిసిందే. అంతే కాకుండా ఇప్పటివరకు హైకోర్టుకు మరియు ట్రిబ్యునల్ కు సహకరించకుండాఎపిపిఎస్సి వాయిదాలు కోరడం సమస్యను త్వరగా పరిష్కరించాలని చూడకపోవడం తన నిర్లక్షాన్ని చూపెడుతోంది. ఇది నిజంగా బాదాకరం.

ఇంటర్వ్యూ విధానాన్నీ ఎత్తివేయాలి : కృష్ణయ్య

  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) నిర్వహిస్తున్న పరీక్షల్లో గ్రూప్ 1ను మినహాయించి మిగితా పరీక్షలకు ఇంటర్వ్యూ విధానాన్నీఎత్తివేయాలని బీసీ సంక్షేమ సంఘం  రాష్ట్ర అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీని రాత పరీక్ష ద్వారానే పూర్తి చేయాలనీ, ఇంటర్వ్యూ విధానాన్నీ రద్దు చేయాలనీ కోరుతూ సోమవారం నాంపల్లి లోని ఎపిపిఎస్సి కార్యాలయం ఎదుట బీసీ సంఘాల ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కృష్ణయ్య మాట్లాడుతూ గ్రూప్-2 లో 40 కేటగిరీల పరీక్షలకు సంబందించిన ఫలితాలు ప్రకటించకుండా సంవత్సరాల తరబడి జాప్యం చేయడమేమిటని ప్రశ్నించారు. కొన్ని పరీక్షల విషయంలో నోటిఫికేషన్ లో  రాత పరీక్ష  మార్కుల అధారంగా భర్తీ చేస్తామని ప్రకటించి నేడు అందుకు విరుద్దంగా ఇంటర్వ్యూ లు  నిర్వహిస్తామని ప్రకటించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఈ విషయమై నేడు ముఖ్యమంత్రిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో ఎపిపిఎస్సి అధికారులు స్పందించకపోతే ఇందిరాపార్క్ వద్ద భారీ ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించార. ఈ కార్యక్రమంలో వివిధ  బీసీ సంఘాల నేతలు  పాల్గొన్నారు.