Wednesday, July 3, 2013

PANCHAYAT SECRETARY (GRADE - IV) IN A.P. PANCHAYAT RAJ AND RURAL EMPLOYMENT SUBORDINATE SERVICE (GENERAL RECRUITMENT)

Recruitment Applications online are invited between 09.07.2013 to 31.07.2013 and the 
last date for payment of fee is 29.07.2013. 
The Written Examination is likely to be held on 15.09.2013. 

http://website.apspsc.gov.in/Documents/PRESSNOTE/464.pdf

కొలువుల జాతర

కొలువుల జాతరప్రభుత్వ ఉద్యోగ జాతరలో భాగంగా 24078 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. ఇందులో ఏపీపీయస్సీ- 1127, శాఖాపరమైన ఎంపిక కమిటీ- 702, ప్రాంతీయ ఎంపిక కమిటీ- 1741, డీయస్సీ- 20508 పోస్టులను భర్తీకి ఆర్థికశాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు అనుగుణంగా వెంటనే పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.


పాస్‌ చేస్తే రూ.10 లక్షలు

'పకడ్బందీ ప్రణాళికతోనే ఉద్యోగార్థులకు వల వేశాం. సంధ్యారాణి, ఇద్దరు మధ్యవర్తులు, మరో ఇద్దరు కలిసి ఇదంతా చేశాం. వీరంతా సంధ్యారాణి ద్వారానే నాకు పరిచయం అయ్యారు. మౌఖిక పరీక్షలో మార్కులు ఎక్కువ వేస్తే రూ.పదిలక్షల చొప్పున ఇస్తారంటూ సంధ్యారాణి చెప్పింది. దీంతో అందరం కలిసి పథకాన్ని అమలు చేశాం'' అని ఏపీపీఎస్సీ బోర్డు సభ్యుడు గూడూరి సూర్యవంశం సీతారామరాజు పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. ఏపీపీఎస్సీ ఉద్యోగ కుంభకోణం కేసులో అరెస్త్టెన సీతారామరాజు పోలీసుల విచారణలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. సంధ్యారాణి పరిచయం నుంచి ఉద్యోగార్థుల నుంచి డబ్బు తీసుకోవడం వరకూ జరిగిన పరిణామాలన్నింటినీ పోలీసులకు చెప్పారు. తనకు ఎలాంటి హాని ఉండదన్న భావనతోనే ఈ పనికి అంగీకరించానన్నారు. సీతారామరాజు చెప్పిన అంశాల ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగించనున్నామని హైదరాబాద్‌ సిటీ డీసీపీ(నేరాలు) ఎల్‌కేవీ రంగారావు మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈ కేసులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అర్హులైన వారి వద్ద రూ.పదిలక్షల చొప్పున డిమాండ్‌ చేసిన ఈ కుంభకోణంలో... ఢిల్లీలోని అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఎం.అరుణ్‌కుమార్‌, హైదరాబాద్‌లోని కె.ఎస్‌.రావు ఐ.ఎ.ఎస్‌. స్టడీ సర్కిల్‌ సంచాలకులు డాక్టర్‌ కొలకపూడి శ్రీనివాసరావులు పాత్రధారులుగా ఉన్నారు. వీరిద్దరూ సంధ్యారాణి ద్వారా సీతారామరాజుకు పరిచయం అయ్యారు. వృత్తిరీత్యా న్యాయవాదైన సీతారామరాజుకు సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే పరంధాములు కుమారుడు ఎ.రవిబాబు ఏడాదిన్నర క్రితం సంధ్యారాణిని పరిచయం చేశారు. అప్పటి నుంచి సంధ్యారాణి, సీతారామరాజులు అప్పుడప్పుడూ కలుసుకునేవారు. ఫోన్‌లోనూ మాట్లాడుకునేవారు. గత ఏడాది సెప్టెంబరులో సీతారామరాజు ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమితులయ్యారు. అప్పటి నుంచి తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలో సీతారామరాజు రెండు నెలల క్రితం సంధ్య ఇంటికి వెళ్లారు. మే 20 నుంచి పాలిటెక్నిక్‌ కళాశాలల్లో జూనియర్‌ లెక్చరర్ల ముఖాముఖి ఉందని ఆమెకు చెప్పారు. కొద్దిరోజులయ్యాక సంధ్య తన బాల్యమిత్రుడు ఢిల్లీలోని అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ అరుణ్‌కుమార్‌తో ఏపీపీఎస్సీ కార్యాలయానికి వచ్చారు. వారి పథకాన్ని వివరించారు.

సంధ్యారాణి, అరుణ్‌కుమార్‌లు తమకు తెలిసిన అభ్యర్థులున్నారని, మన చేతికి మట్టి అంటకుండా మధ్యవర్తులే చూసుకుంటారని సీతారామరాజుకు వివరించారు. అశోక్‌నగర్‌లోని కె.ఎస్‌.రావు ఐ.ఎ.ఎస్‌.అకాడమీ సంచాలకులు డాక్టర్‌ కె.ఎస్‌.రావు కూడా కొందరు అభ్యర్థుల నుంచి డబ్బు ఇప్పిస్తానని చెప్పారు. 2013 మే 12న మియాపూర్‌లోని సంధ్య ఇంట్లో కె.ఎస్‌.రావును సీతారామరాజు కలుసుకున్నారు. అభ్యర్థుల నుంచి వసూలు చేసిన డబ్బులను కె.ఎస్‌.రావు ఇస్తారని సంధ్య వివరించింది. హిమాయత్‌నగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగులు షేక్‌ అంజావలి, కళ్యాణ్‌నగర్‌లోని పి.సతీష్‌కుమార్‌లు డబ్బు వ్యవహారంలో మధ్యవర్తులని సీతారామరాజుకు చెప్పారు. జూన్‌ 3, 2013న మాదాపూర్‌లోని ఫార్చ్యూన్‌ టవర్స్‌లో ఉంటున్న ఫణికిరణ్‌ ఇంటికి రావాలంటూ సంధ్య సీతారామరాజుకు చెప్పింది. దీంతో ఆయన అక్కడికి వెళ్లారు. అక్కడ విశాఖపట్నంలోని మహారాజ సహకార పట్టణ బ్యాంక్‌ అధ్యక్షుడు ఎం.ఆర్‌.కె.రాజు ఉన్నారు. ఆయనను సీతారామరాజుకు సంధ్య పరిచయం చేశారు. కొద్దిసేపయ్యాక సంధ్య బయటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చింది. వీరిద్దరూ చెరో పదిలక్షల రూపాయలిస్తారంటూ వివరించింది. వీరిని మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ)లో పాస్‌చేయాలంటూ కోరింది. ఒప్పందం కుదిరాక వారు వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై ఆరోపణలు రావటంతో ఏపీపీఎస్సీ కార్యదర్శి చారుసిన్హా సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత నెల సంధ్యను అరెస్ట్‌చేయగా సోమవారం రాత్రి సీతారామరాజును అరెస్ట్‌ చేశారు.అరెస్టయిన ఏపీపీఎస్‌సీ సభ్యుడు సీతారామరాజును మంగళవారం ఉదయం చంచల్‌గూడ జైలుకు తరలించారు. సీసీఎస్‌ పోలీసులు ఆయన్ను సోమవారం అర్ధరాత్రే న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.

Monday, July 1, 2013

ప్రభుత్వ పరిశీలనలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు

- తరువాత ఖాళీలకు ఇంకా ఆమోద ముద్ర రాలేదు
- వాటిని కూడా భర్తీ చేయాలని నిరుద్యోగుల అభ్యర్థన
- ఇతర పోస్టులతో నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సన్నాహాలు!

సర్కారీ కొలువులపై కోటి ఆశలతో 15 లక్షల మందికిపైగా నిరుద్యోగులు గ్రూప్-1, గ్రూప్-2 లాంటి ప్రధాన పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారిలో ప్రధానంగా సగం మంది నిరీక్షణ వీటి కోసమే! ఎక్కువ పోస్టులతో కొత్త నోటిఫికేషన్లు వస్తాయని భావిస్తున్న వీరంతా ప్రభుత్వం ఇంతవరకు ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు ఇంతవరకూ అనుమతి ఇవ్వడంతో ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి వరకూ ఏర్పడిన అన్ని ఖాళీలను గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లలో చేర్చాలని కోరుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 2010 తరువాత ఖాళీలు ఏర్పడిన 600కిపైగా పోస్టుల భర్తీ ఆర్థికశాఖ, ప్రభుత్వం పరిశీలనలో ఉంది. మరోవైపు ఏపీపీఎస్సీ తనకు అందిన వివరాలతో ఈ నెలలోనే ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసి అనంతరం నోటిఫికేషన్లను కూడా జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని ఖాళీలకూ నోటిఫికేషన్లు రావేమోననే ఆందోళన అభ్యర్థులను పీడిస్తోంది. ఆలస్యమైనా.. అన్నీ ఇవ్వండి కాస్త ఆలస్యమైనా సరే, 2010 తరువాత ఏర్పడిన ఖాళీలను కూడా కలిపి అన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నికల నేపథ్యంలో హడావుడి గా నోటిఫికేషన్లు ఇవ్వడం కాకుండా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వేల రూపాయలు ఫీజులు చెల్లించి కోచింగ్ తీసుకుంటున్నామని, అప్పులు చేసి నాలుగైదేళ్లుగా హాస్టళ్లలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నామని పేర్కొంటున్నారు. వయోపరిమితి పెంపుతో ఊరట కొంతే.. ఆర్థికశాఖ 33 వేల పోస్టుల భర్తీకి ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2 లాంటి పోస్టులు తక్కువగానే ఉన్నాయి. గ్రూప్-2 కేటగిరీలో ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 314 వరకు ఉన్నాయి. వీటికి గరిష్ట వయోపరిమితి జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లే. దీంతో మెజారిటీ అభ్యర్థులకు ఈ పోస్టులకు అర్హత ఉండదు. గరిష్ట వయోపరిమితి 5 ఏళ్లకు పెంచాలని ఐదు లక్షల మంది నిరుద్యోగులు వేడుకుంటే ప్రభుత్వం రెండేళ్లు మాత్రమే పెంచింది. అదికూడా 2011 తరువాత నోటిఫికేషన్లు ఇవ్వలేదు కాబట్టి గరిష్ట వయోపరిమితి రెండేళ్లు పెంచి ఆ లోటును మాత్రమే పూడ్చింది. వయోపరిమితిపరంగా నిరుద్యోగులకు అదనంగా ఒనగూరిన ప్రయోజనం పెద్దగా లేదని అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-1, గ్రూప్-2లో అనుమతి లభించాల్సిన పోస్టులు.. గ్రూప్-1, గ్రూప్-2 కేటగిరీల్లోనే 600లకు పైగా పోస్టులకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి లభించలేదని, ఇతర కేటగిరీల్లోనూ చాలా పోస్టులకు అనుమతి రాలేదని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. గ్రూప్-2 కేటగిరీలోని ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో 24 సబ్ రిజిస్ట్రార్, 183 డిప్యూటీ తహసీల్దార్, 99 అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, 10 మున్సిపల్ గ్రేడ్-3 కమిషనర్, 184 కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ పోస్టులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. గ్రూప్-1 కేటగిరీలో 33 కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, 8 గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులతో మరికొన్ని కేటగిరీలకు చెందిన పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఖాళీ పోస్టులు అన్నిటికీ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Sunday, June 30, 2013

వయోపరిమితి పెరిగిందోచ్‌

నిరుద్యోగులకు స్వల్ప వూరట. ఉద్యోగ వయో పరిమితిని 34 నుంచి 36 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెలలో ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థలు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టులను ప్రత్యక్ష పద్ధతిలో భర్తీ చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి. అందిన ఖాళీలను అనుసరించి ఆయా శాఖల నుంచి సామాజిక వర్గాల వారీగా వివరాలు వస్తే ఏపీపీఎస్సీ వచ్చే నెలలో ప్రకటనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వం వయో పరిమితిని రెండేళ్లకు పెంచడం ద్వారా కొందరు ప్రయోజనం పొందనున్నారు. వేల పోస్టుల భర్తీలో భాగంగా సంవత్సర కాలపట్టికను అమలు చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించిన నేపథ్యంలో వయో పరిమితిని 34 నుంచి కనీసం 3-5 ఏళ్లు పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖలో 2008-09లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేశారు. 2004లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఛైల్డ్‌ ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (జనరల్‌ కేటగిరి) పోస్టులను భర్తీ చేశారు. తిరిగి ఈ ఏడాది మాత్రమే ఈ రెండు రకాల పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. 2011 తరువాత మళ్లీ వచ్చే నెలలో ఉద్యోగ ప్రకటనలు రాబోతున్నాయి. వయో పరిమితి పెంపు నిర్ణయం ఖాకీ దుస్తుల పోస్టుల భర్తీ (పోలీసు, ఎక్సైజ్‌, ఫైర్‌, ప్రిజన్స్‌, ఫారెస్ట్‌, తదితర)కి వర్తించదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Friday, June 28, 2013

జూలైలో ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్

- రోస్టర్ పాయింట్లు, ఇండెంట్లు త్వరగా ఇవ్వాలని శాఖలకు కమిషన్ సూచన
- గరిష్ట వయోపరిమితి పెంపు, ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనం రద్దుపై రావాల్సిన స్పష్టత

వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 15,000 పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) త్వరలో పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించి నోటిఫికేషన్లు జారీ చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కమిషన్ ఇప్పటికే దృష్టి సారించినట్లు సమాచారం. ఈ ఏడాది వివిధ పోస్టుల భర్తీకి సంబంధించిన వార్షిక కేలండర్ అమలులో భాగంగా షెడ్యూల్ విడుదల కానుంది. జూలై నెలలో(మరో 15 రోజుల్లోగా) పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

కేటగిరీలవారీగా నోటిఫికేషన్ల జారీ తేదీలు, పరీక్షల నిర్వహణ తేదీలు, ఫలితాల వెల్లడి సహా పోస్టింగ్‌ల వరకు సమగ్ర వివరాలను అందులో పొందుపరచనుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం సిద్ధం అయ్యేందుకు ఇది ఉపకరిస్తుందని ఏపీపీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి.శాఖల వారీగా, పోస్టుల కేటగిరీల వారీగా సమగ్ర వివరాలు తెప్పించి షెడ్యూల్ జారీ చేసేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు వీలైతే వచ్చే నెల చివరి వారంలో నోటిఫికేషన్ల జారీని ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తోంది. వివిధ శాఖల్లోని ఒకే కేటగిరీ పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని కూడా భావిస్తోంది.

రోస్టర్ పాయింట్లు, ఇండెంట్ల సేకరణకు చర్యలు

వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 33 వేలకు పైగా పోస్టులను ఈ ఏడాది భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఇటీవల ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీ ద్వారానే 11 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. మరోవైపు గతంలోనూ వివిధ శాఖలనుంచి క్లియరెన్స్ వచ్చిన పలు కేటగిరీలకు చెందిన దాదాపు 3 వేలకుపైగా ఖాళీల వివరాలు ఏపీపీఎస్సీ వద్ద ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం వాటికి సంబంధించి ఆయా శాఖల నుంచి భర్తీకి ఇండెంట్స్, పోస్టుల కేటగిరీ వారీగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల వివవరాలను తెప్పించే పనిలో ఏపీపీఎస్సీ నిమగ్నమైంది. ఆర్థిక శాఖ 11 వేల పోస్టుల భర్తీకి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత నుంచి ఏపీపీఎస్సీ ఈ చర్యలు చేపట్టినా అన్ని శాఖల నుంచి పోస్టుల వివరాలు ఇంకా అందలేదు. ఆయా పోస్టులకు సంబంధించిన రోస్టర్ పాయింట్లు వస్తేగానీ నోటిఫికేషన్లు జారీ చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో రోస్టర్ పాయింట్ల వివరాలు, ఇండెంట్లను త్వరగా పంపించాలని ఏపీపీఎసీ ఆయా శాఖలను కోరుతోంది.

మరో 15 రోజుల లోగా ఎక్కువ శాతం పోస్టులకు సంబంధించిన వివరాలు అందే అవకాశం ఉంది. వీటి ఆధారంగా తొలుత పోస్టుల భర్తీకి షెడ్యూల్ (ఏయే తేదీల్లో ఏయే కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయాలి, పరీక్షలు తేదీలు, ఫలితాల వెల్లడి వివరాలు) జారీ చేయాలని భావిస్తోంది. ఈలోగా ప్రధానమైన గ్రూపు-1లో గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనం, వయోపరిమితి లాంటి అంశాలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పష్టత తీసుకోవాలని ఏపీపీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి.

Friday, May 3, 2013

విజ్ఞ్యాపన పత్రం

Friends please send this letter to APPSC chairman and helpdesk   appschelpdesk@gmail.com, appscchair@yahoo.in


To                                                                                                                                     తేది: 03/05/2013
శ్రీయుత గౌరవనీయులైన
శ్రీ చిత్తరంజన్ బిస్వాల్ IAS గారు
ఏపిపిఎస్సి చైర్మన్,
హైదరాబాద్ .

విషయం: గ్రూప్ – 2 (నోటిఫికేషన్ నెం : 39/2011) నాన్ ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం.

నమస్కారములతో.....

గ్రూప్ – 2 (నోటిఫికేషన్ నెం : 39/2011) నాన్ ఎగ్జిక్యుటివ్ ఎంపిక ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తారనే ఉద్దేశంతో ఈ విజ్ఞ్యాపన పత్రం ద్వారా మీ దృష్టికి కొన్ని విషయాలను తీసుకువస్తున్నాము.

నోటిఫికేషన్ ను విడుదల చేసిన తేది : 29/12/2011

పరీక్ష నిర్వహించబడిన తేది : 21/07/2012 & 22/07/2012

ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ కొరకై సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టు ను విడుదల చేసిన తేది : 11/03/2013

ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ కొరకై ఎంపిక కాబడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తేది : 17/04/2013

నాన్ ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ కొరకై సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టు ను విడుదల చేసిన తేది : వెలువడలేదు

నాన్ ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ కొరకై ఎంపిక కాబడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తేది : వెలువడలేదు


గ్రూప్ – 2 నోటిఫికేషన్ (నెం : 39/2011) లోని ఎగ్జిక్యుటివ్ మరియు నాన్ ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ కై పరీక్ష జరిగి 9 నెలల పైనే అవుతున్న ఇప్పటివరకు కేవలం ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మాత్రమే పూర్తైనది కానీ నాన్ ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికి మొదలు కాలేదు దీనితో అభ్యర్తులు తీవ్ర ఒత్తిడికి మరియు మనోవేదనకు లోనవుతున్నారు. తీవ్రమైన ఒత్తిడి మూలంగా అభ్యర్థుల్లో కొందరు వచ్చే నోటిఫికేషన్ కొరకై ఏకాగ్రతతో చదవలేక, వేరే ప్రైవేటు ఉద్యోగాలకు వెళ్ళలేక ప్రిపరేషన్ పరంగాను మరియు ఆర్థికంగాను తీవ్రంగా నష్టపోతూ నరకయాతన అనుభవిస్తున్నారు.

భర్తీ ప్రక్రియ ఎక్కడివరకు వచ్చిందో తెలుసుకోవాలనుకునే అభ్యర్థులకు సరైన సమాచారం లబించడంలేదు. సమాచారం కోసం PRO cell కూ ఫోన్ చేసిన లేదా అభ్యర్థులు స్వయంగా ఎపిపిఎస్సి ఆఫీస్ కు వచ్చిన వారికీ చేదు అనుభవాలే మిగులుతున్నయి కానీ సరైన సమాచారం లబించడంలేదు.

అభ్యర్థుల మనోవేదనను సహృదయంతో అర్థం చేసుకొని గ్రూప్ – 2 నాన్ ఎగ్జిక్యుటివ్ ఎంపిక ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తారని ఆశిస్తూ.

ఇట్లు

గ్రూప్ – 2 అభ్యర్థులు

Sunday, April 28, 2013

వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులు 63,621

* ప్రధాన కార్యదర్శికి ప్రభుత్వ శాఖల నివేదిక
* ఆర్థిక శాఖ జాబితా రూపొందించాక భర్తీ ప్రక్రియ

హైదరాబాద్: ప్రభుత్వానికి ఇప్పటి వరకూ అందిన వివరాల ప్రకారం వివిధ శాఖల్లో 63,621 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖలో 20,790, పోలీసు శాఖలో 10,730 ఖాళీలతో పాటు పలు ఇతర శాఖల్లోని వివరాలను ఏప్రిల్ 27న ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూకి ఇచ్చిన నివేదికలో వెల్లడించారు. ఇంకా పలు శాఖల్లో ఖాళీల వివరాలు అందలేదు. వాటిని రెండు రోజుల్లో సమర్పించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యోగాల ఖాళీల వివరాల సేకరణకు ప్రధాన కార్యదర్శి ఏప్రిల్ 27న సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్థిక శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. శాఖల వారీగా నివేదికలు ఇచ్చారు. అన్ని శాఖల నుంచి నివేదికలు అందాక వాటిని ఆర్థిక శాఖకు పంపిస్తామని, అక్కడ దస్త్రం రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం తీసుకొని భర్తీ ప్రక్రియ చేపడతామని ప్రధాన కార్యదర్శి చెప్పారు. గతంలో చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.

ఖాళీల వివరాలు

పాఠశాల విద్యాశాఖ - 20,790; పోలీసు శాఖ - 10,730; రెవెన్యూ (భూపరిపాలన ప్రధాన కమిషనర్) - 6,095; ఇంటర్మీడియట్ విద్య - 2,898; ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు - 3,208; కుటుంబ సంక్షేమం - 2,234; ఏపీ జెన్‌కో - 1,303; వైద్యవిధాన పరిషత్ - 974; వైద్య విద్య - 963; అగ్నిమాపక శాఖ - 886; ఆయుష్ - 729; కళాశాల విద్యాశాఖ - 685; గురుకుల విద్యా సంస్థలు - 684; అటవీ శాఖ - 600; ఉపాధి కల్పన - 577; వాణిజ్య పన్నుల శాఖ - 573; ట్రెజరీ - 407; జైళ్ల శాఖ - 383; ఎక్సైజ్ - 364; సర్వే - 342; పశుసంవర్థకం - 290; టౌన్‌ప్లానింగ్ - 288; సాంకేతిక విద్య - 286; నీటిపారుదల - 277; వ్యవసాయం - 236; ప్రజారోగ్యం - 225; పౌరసరఫరాలు - 223; రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ - 194; ప్రత్యేక భద్రత దళం (ఎస్పీఎఫ్) - 185; దేవాదాయ శాఖ - 180; ఉద్యానవన విశ్వవిద్యాలయం - 167; ఆప్కో - 162; రోడ్లు భవనాల శాఖ - 135; బీమా సంచాలకుల కార్యాలయం - 113; సాధారణ పరిపాలన శాఖ - 104; ఆర్థిక శాఖ - 103. ఇవి కాకుండా మరికొన్ని శాఖల్లో వంద కంటే తక్కువ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.

Friday, April 26, 2013

తుద'కీ' తప్పులే గురువా!

 హైదరాబాద్‌: కొంతమంది ఆచార్యుల్లో ఎంత'కీ' మార్పు రావడం లేదు. ఏపీపీఎస్సీ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఫారెస్టు రేంజి అధికారి (ఏఎఫ్‌ఆర్‌ఓ) ఉద్యోగాల ప్రశ్నపత్రాల తుది 'కీ' ఖరారులో ఆచార్యులు మరోమారు తమ బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించారు. దీంతో మళ్లీ సవరణలతో మరోమారు తుది' కీ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. తుది 'కీ' ప్రకటించిన తరువాత ఒకటి, రెండు కాదు ఏకంగా ఐదు సబ్జెక్టుల్లోని 20 ప్రశ్నల జవాబుల్లో మార్పులు జరగడం గమనార్హం. ఉద్యోగ నియామకాల్లో ఒక మార్కు కూడా కీలకమే. ఇప్పుడు ఆచార్యుల తీరు అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. వీరి భవిష్యత్తే అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఏర్పడింది. వీరి వల్ల ఏపీపీఎస్సీ అధికారులూ తలలు పట్టుకుంటున్నారు. ఏఎఫ్‌ఆర్‌ఓ ఉద్యోగాల భర్తీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వీటి భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో వివిధ సబ్జెక్టుల వారీగా అతికష్టంమీద ప్రాథమిక 'కీ' జారీ చేస్తే, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వీటిని పరిశీలించడం ఏపీపీఎస్సీకి కత్తిమీద సామే అయింది.

Monday, March 18, 2013

AN APPEAL TO GROUP 2 2011 SELECTED CANDIDATES



విజ్ఞప్తి


గ్రూప్ – 2 2011 ఉద్యోగాల ఎంపిక కొరకై సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు అవుతున్న అభ్యర్థులందరికీ ఒక మనవి, ముఖ్యంగా ఇదివరకే ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ఉన్నత పదవులకై ఈ పరీక్షను వ్రాసిన అభ్యర్థులకు మనవి చేసేది ఏమనగా, మీరు చెక్ లిస్టు ఫారం నింపే ముందు మీ సోదర నిరుద్యోగ మిత్రుల గురించి ఒక్క క్షణం ఆలోచించండి. మీరు అంగీకరం(Preference) తెలిపిన పోస్టులలో కచ్చితంగా చేరుతాను అని అనుకొన్న పోస్టులకు మాత్రమే మీ అంగీకారాన్ని తెలపండి. మీకు ఇష్టం లేని పోస్టులకు ఒకవేళ మీరు ఆ పోస్టులకు ఎంపిక అయినప్పటికీ కూడా చేరను అనుకొన్న వాటికీ మీ అంగీకారం తేలపవద్దు వాటిని ఖాళీగా(Blank) వదిలివేసి  వాటిని “నాట్ విల్లింగ్” జాబితాలో మాత్రం స్పష్టంగా పేర్కొనండి. దీనివల్ల ఇదివరకు ఏ ఉద్యోగం లేని కొందరు అభ్యర్థులు ఆ ఉద్యోగాలను పొందుతారు.
  
ఉదాహరణకు గ్రూప్ – 2 2011 నోటిఫికేషన్ లో 7 ఎగ్జిక్యుటివ్ పోస్టులు ఉన్నపటికీ అందులో ఒకటి లేదా రెండు పోస్టులకు మాత్రమే ఇది వరకే ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఆసక్తి చూపిస్తారు కానీ, మిగిలిన పోస్టుల పై అంతగా ఆసక్తి చూపించరు.  ఒకవేళ మీరు చెక్ లిస్టు ఫారంలో ఈ 7 ఎగ్జిక్యుటివ్  పోస్టులన్నిటికీ  అంగీకారం తెలిపి ఫైనల్ సెలక్షన్ లిస్టులో మికు ఆసక్తి లేని పోస్టుకు మీరు ఎంపిక కాబడినట్లైతే మీకు ఆ పోస్టుపై ఆసక్తి లేదు కనుక మీరు ఆ పోస్టులో చేరకపోవటంతో ఆ పోస్టు నాన్ జాయినింగ్ పోస్టుగా మిగిలిపోయి తరువాత నోటిఫికేషన్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నది. దీనివల్ల మీ తరువాత ఉన్నటువంటి ఏ ఉద్యోగం లేని మన నిరుద్యోగ మిత్రులు నష్టపోతున్నారు. ఇలా ప్రతి గ్రూప్ – 2 నోటిఫికేషన్లో కనీసం నూటయబై ఉద్యోగాల వరకు వృదాగా మిగిలిపోతున్నాయి.

అందుకే ఇదివరకే ఉద్యోగాలు పొంది ఉన్న అభ్యర్థులకు మనవి చేసేది ఏమనగా  మీరు ఖచ్చితంగా చేరుతాను అని అనుకొన్న పోస్టులకు మాత్రమే మీ అంగీకారాన్ని తెలిపి మిగిలిన వాటిని దయచేసి ఖాళీగా వదిలివేసి ఒక నిరుద్యోగ మిత్రుడికి సహాయం చేయండి.  నిరుద్యోగ సమస్య తీవ్రత గుర్తించి, ఆసక్తి లేని పోస్టులను “నాట్ విల్లింగ్” జాబితాలో స్పష్టంగా పేర్కొనండి.


    ఇట్లు
దీటి శ్రీకాంత్ 



180 మంది ఎక్సైజ్‌ ఎస్సైలకు అస్వస్థత


శిక్షణ శిబిరంలో అసౌకర్యాల కారణంగా ఎక్సైజ్‌ శాఖ ప్రొబేషనరీ ఎస్సైలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శిక్షకులు, ఉన్నతాధికారులు తీవ్రతను గుర్తించకపోవడంతో ఒకేసారి 180 మంది అస్వస్థత బారినపడ్డారు. గొంతునొప్పి, జ్వరంతో ఉక్కిరిబిక్కిరవుతున్న వీరిని నల్లకుంట ఫీవరాసుపత్రిలో చేర్పించారు. రెండుమూడు రోజులుగా కొందరు జ్వరంతో బాధపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరిగిందని బాధితులు ఆరోపించారు. శిక్షణలో ఉన్నవారిలో దాదాపు అందరూ అనారోగ్యంతో ఉండడంతో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఎక్సైజ్‌ కమిషనర్‌ సమీర్‌శర్మ పరామర్శించారు. శిక్షణను రెండు వారాల పాటు వాయిదా వేశారు. వారిని మరోచోటికి మార్పించారు. మొదట్లో వీరికి కంఠసర్పి (డిఫ్తీరియా) అనుకున్నామని, ప్రాథమిక పరీక్షల అనంతరం కాదని తేలడంతో ఇతర పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు.

హైదరాబాద్‌ శివారు బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీలో 183 మంది ప్రొబేషనరీ ఎస్సైలు ఫౌండేషన్‌ కోర్సు శిక్షణ పొందుతున్నారు. వీరంతా 2008 గ్రూప్-2 నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన వీరికి కొద్దిరోజులుగా ఇక్కడ శిక్షణ ఇస్తున్నా.. శిబిరంలో సరైన వసతులు లేవు. తాగేందుకు నీళ్లు కూడా అభ్యర్థులే కొనుక్కొంటున్నారు. శిక్షణలో భాగంగా వ్యాయామాలు, ఎండలో పరిగెత్తడం వంటివి చేయిస్తుండగా.. నాలుగైదు రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో కొందరికి జ్వరం వచ్చింది. జ్వరం, ఒళ్లు నొప్పులకు గొంతు నొప్పి కూడా తోడైంది. పదిమంది దాకా అనారోగ్యంతో బాధపడుతున్నా వారిని అక్కడే ఉండాలంటూ అధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రానికి యాభైమందికిపైగా జ్వరం బారిన పడగా.. శనివారం మధ్యాహ్నం అధికారులు స్పందించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈలోపు మిగతా వారందరికీ వ్యాపించింది. గొంతునొప్పి ఉండడంతో కంఠసర్పిగా భావించి ఆదివారం ఉదయం సుమారు 50 మందిని నల్లకుంట ఫీవరాసుపత్రికి తీసుకువచ్చారు. వీరిలో పది మంది మహిళా ఎస్సైలున్నారు. ప్రాథమిక పరీక్షల అనంతరం ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వైద్యులు నిర్ధరించారు. ఆరోగ్యంపై ఆందోళనతో వందమందికిపైగా ఎక్సైజ్‌ ఎస్సైలు వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. మరికొంతమందిని కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్లారు. మూకుమ్మడిగా అనారోగ్యం ఎందుకు సోకిందన్న అంశంపై విచారణ జరిపిస్తున్నామని, శిక్షణలో లోపాలుంటే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ కమిషనర్‌ సమీర్‌ శర్మ తెలిపారు. ఆసుపత్రిలో చేరిన వారిలో ఎవరికి కంఠసర్పి లేదని ఫీవరాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని చెప్పారు. 20 మందికి నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని, వారికి డిఫ్తీరియా లేదని స్పష్టం చేశారు.ఎక్సైజ్‌ ఎస్సైలకు ప్రారంభ కోర్సు కింద రెండు బ్యాచుల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉండగా అందరికీ ఒకేసారి మొదలుపెట్టారు. అకాడమీలో సరైన వసతి లేకపోవడంతో అందరూ సమీప హాస్టళ్లు, బంధువుల ఇళ్ల నుంచి వస్తున్నారు. అకాడమీలో మెస్‌ పూర్తిగా మూతపడింది. తాగునీరు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం కోసం ఒక్కొక్కరి నుంచీ రూ.135 చొప్పున తీసుకుంటున్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నెలకొల్పిన ఎక్సైజ్‌ అకాడమీలో తాగునీరు, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌, సరైన డ్రైనేజి వ్యవస్థ, పెరుగుతున్న శిక్షణార్థులకు తగిన సంఖ్యలో గదులు, బాత్‌రూంలు, మరుగుదొడ్లు నిర్మాణం కాలేదు. సిబ్బందీ అరకొరగానే ఉన్నారు. మురుగు నీరు, దుమ్ము, ధూళిలోనే శిక్షణ ఎస్సైలతో పనులు చేయిస్తున్నారు. ఇన్నేసి అసౌకర్యాల మధ్య సహజీవనం చేయడంతో శిక్షణలోని ఎస్‌ఐ అభ్యర్థులు అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది.

Tuesday, March 12, 2013

Thursday, February 21, 2013

జిల్లాలకు గ్రూపు-4 ఫలితాలు

రాష్ట్ర ప్రజాసేవా సంఘం (ఏపీపీఎస్సీ) గ్రూపు-4 పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 20న అన్ని జిల్లాలకు పంపింది. ఫలితాల ఆధారంగా నియామకాలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను కోరింది. జాబితాలు అందిన వెంటనే జిల్లా కలెక్టర్లు నియామకాల ప్రక్రియను చేపడతారని అధికారవర్గాలు తెలిపాయి.

Tuesday, February 19, 2013

గతేడాది 133 డిప్యూటీ తహశీల్దార్‌ పోస్టులకు ప్రభుత్వం అనుమతించిన ఇంతవరకూ ఎలాంటి నోటీఫికేషన్‌ ఇవ్వని ఏపిపిఎస్సీ

రెవెన్యూ శాఖలోని డిప్యూటీ తహశీల్దార్‌, వీఆర్వో తదితర ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయాలని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఆదేశించారు. సోమవారంనాడు సచివాయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్‌ మీనా, అశుతోష్‌ మిష్రా, సీసీఎల్‌ఏ పీకే మహంతిలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జనవరిలో జరిగిన జాయింట్‌ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. రెవెన్యూ శాఖలోని అన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సత్వరం ఆర్థిక శాఖకు పంపాలని ఆయన ఆదేశించారు. గతేడాది 133 డిప్యూటీ తహశీల్దార్‌ పోస్టులకు అనుమతించి ప్రభుత్వం వివరాలు పంపినప్పటికీ ఏపిపిఎస్సీ ఇంతవరకూ ఎలాంటి నోటీఫికేషన్‌ ఇవ్వకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

తక్షణమే ఈ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా వందల సంఖ్యలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల ఖాళీల వివరాలను ఏపిపిఎస్సీకి పంపించామని, కానీ వీటి భర్తీకి పరీక్షలు నిర్వహించినప్పటికీ ఇంకా ఫలితాలు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఏపిపిఎస్సీతో మాట్లాడాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. మరోవైపు 1600 వీఆర్వో ఖాళీలు, 120కిపైగా డిప్యూటీ సర్వేయర్‌ ఖాళీల భర్తీపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రితో సమావేశమవుతానని ఆయన తెలిపారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఎంఎల్‌సీ, సహకార ఎన్నికలు, తాజాగా వర్షాల కారణంగా వాయిదా పడ్డ ప్రాంతీయ రెవెన్యూ సదస్సులను నిర్వహించే అంశంపై ఆయన అధికారులతో చర్చించారు. వీటిని నిర్వహించేందుకు 26న తిరుపతి, 27న విజయవాడ, మార్చి 2న హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

6 నెలల్లోనే కొలువు

ఇకపై ఉద్యోగ ప్రకటన జారీ అయిందంటే.. అభ్యర్థులు ఆరునెలల్లోగా కొత్త కొలువులో చేరిపోవలసిందే.. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సరికొత్త యోచన ఇది. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు చిత్తరంజన్‌ బిశ్వాల్‌ వెల్లడించారు. ఏపీపీఎస్సీలో సభ్యుల ఎంపిక, ఉద్యోగ నియామకాల్లో రావలసిన మార్పులపై ఈనాడు.నెట్‌, ఈనాడు ప్రతిభ.నెట్‌ ద్వారా ఉద్యోగార్థుల నుంచి వచ్చిన అభిప్రాయాల సమాహారానికి సంబంధించి ఆయన 'ఈనాడు'కు సోమవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రకటన జారీ సమయంలోనే ఫలితాల వెల్లడి తేదీని సైతం ప్రకటిస్తామని చెప్పారు. అలాగే ఏటా ఉద్యోగ ప్రకటనల జారీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగానే ప్రశ్నపత్రాల్లో, అనువాదంలో, 'కీ'ల్లో తప్పులు జరగకుండా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. బిశ్వాల్‌ ఇంటర్వ్యూలోని ప్రధాన అంశాలివి..

ఉద్యోగ ప్రకటన జారీ చేశాక ఆరునెలల్లో నియామకాలను పూర్తిచేస్తాం. ఇకపై ఉద్యోగ ప్రకటనల్లో రాత పరీక్షల తేదీతోపాటు ఫలితాల తేదీనీ వెల్లడిస్తాం. గ్రూపు-1కు మాత్రం ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, మౌఖిక పరీక్షల దృష్ట్యా ఆరునెలల కంటే మరికొంత సమయం తప్పదు.ప్రస్తుతం ప్రశ్నపత్రాల్లో అనువాదపరంగా, 'కీ'ల్లో తప్పులు ఉన్నాయని ఫిర్యాదులొస్తున్నాయి. తప్పులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇకమీదట అలా జరగకుండా చూస్తాం. దీనిపై విశ్వవిద్యాలయాలతో చర్చలు జరుపుతున్నాం. సబ్జెక్టుల వారీగా ప్రతిభగల ప్రొఫెసర్ల జాబితా సిద్ధం చేస్తున్నాం. యూపీఎస్సీ ఇలాగే చేస్తోంది. పదవీ విరమణ చేసిన 75 సంవత్సరాల నిపుణులు సైతం ప్రతిభగలవారి జాబితాలో ఉన్నారు.

రాతపరీక్షల 'కీ'లు విడుదలయ్యాక తప్పులున్నాయంటూ చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకోగలం. కానీ వారు చెప్పిందే సరైనదని చెప్పలేం. వీటిపై నిశితంగా పరిశీలించాకే నేనీ విషయాన్ని చెబుతున్నాను. ఫ్రొఫెసర్లు కూడా లక్షలమంది జీవితాలను ప్రభావితం చేసే ప్రశ్నపత్రాలను తయారు చేస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొందరైతే ప్రశ్నలను మూస పద్ధతిలో ఎంపిక చేస్తున్నారనే విషయం మా దృష్టికీ వచ్చింది. ఈ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక ప్రశ్నకు ఒక సమాధానం మాత్రమే ఉండాలన్న నియమంతో ప్రశ్నపత్రాల తయారీ జరిగితే.. తప్పులు అనే మాటే ఉండదు. ఎంసెట్‌, స్లెట్‌, ఇతర పోటీ పరీక్షల్లో ఈ సమస్య లేదు. ఇక్కడ తీసుకుంటున్న జాగ్రత్తలపైనా అధ్యయనం చేస్తున్నాం.

గ్రూపు-2 రాతపరీక్ష 'కీ'లో తప్పులు ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. వీటిపై పరిశీలిస్తున్నాం. నాకు తెలిసినంత వరకు తప్పులు తక్కువగానే ఉన్నాయి. 'కీ'ని ఈవారంలో ఖరారు చేస్తాం.గ్రూపు-4 తుది 'కీ'లోనూ తప్పులు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. కాని అవి నిర్ధారణ కాలేదు.

 గ్రూపు-4 రాతపరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ వారంలోగా జిల్లాలకు పంపేస్తాం. కలెక్టర్ల నేతృత్వంలో ఈ నియామకాలు జరుగుతాయి.

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఎ.ఎఫ్‌.ఆర్‌.ఒ., ఇతర పోస్టులకు ఎంపికైనవారి జాబితాను ఈ నెలాఖరునాటికి వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే, మరికొంత సమయం పట్టేలా ఉంది. 'కీ 'పరంగా ఎటువంటి సమస్యలు ఉండకూడదన్న ఉద్దేశం వల్లనే ఆలస్యమవుతోంది.

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టుకు సంబంధించి 22 సబ్జెక్టులు ఉన్నాయి. పోస్టు స్థాయిని అనుసరించి ఎక్కువమంది నిపుణుల ద్వారా 'కీ'లను ఖరారు చేయాల్సి ఉంది.

ఏపీపీఎస్సీలో అకడమిక్‌ సెల్‌ ఏర్పాటు ఆలోచన మంచిదే. దీనిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగాలి!

గ్రూపు-1, గ్రూపు-2 పోస్టుల విలీనంపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఈ నిర్ణయం ప్రభుత్వానిదే.. మాది కాదు. మేమైతే ఈ నిర్ణయాన్ని కనీసం ఏడాదిపాటు వాయిదా వేయాలని ప్రభుత్వానికి లేఖరాశాం. అక్కడినుంచి వచ్చే ఆదేశాలు అనుసరించి ముందుకెళ్తాం. అలాగే నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు, గెజిటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఉన్న వ్యత్యాసాలపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి.

గ్రూపు-1 ప్రిలిమ్స్‌ ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా ప్రధాన పరీక్షకు 1.15లోగా అభ్యర్థులను అనుమతించే విషయం ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ కూడా ఏర్పడింది. ఇంకా నిర్ణయం తీసుకున్నట్లు లేదు. గ్రూపు-1 ప్రిలిమ్స్‌ నుంచి ప్రధాన పరీక్షకు అభ్యర్థులను పరిమితం చేయడం వలన అనేక ప్రయోజనాలుంటాయి.

వయోపరిమితి పెంపు అభ్యర్థనలపైనా ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవాలి.

ఏప్రిల్‌నుంచి వరసగా ఉద్యోయ ప్రకటనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని అనేది ఇప్పుడే చెప్పలేం. సచివాలయంలో దీనిపై కసరత్తు జరుగుతోంది.

ఆన్‌లైన్‌లో రాతపరీక్షలను జరపడం మామూలు విషయం కాదు. దీనికి క్వశ్చన్‌ బ్యాంక్‌ను విస్తృతస్థాయిలో తయారుచేయాల్సి ఉంటుంది. తక్కువ పోటీ కలిగిన ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో జరపాలన్నా అంతకుముందు తీసుకోవల్సిన జాగ్రత్తలు అనేకం ఉన్నాయి. ముందుముందు అలా జరగవచ్చు.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించే సమయంలో కానీ, ఆ తరువాత కానీ అర్హతలు లేని వారిని తొలగించడం సాధ్యంకాదు. వేలల్లో, లక్షల్లో దరఖాస్తులు వస్తున్నందున వారి అర్హతలు అనుసరించి దరఖాస్తులను తొలిదశలో తిరస్కరించడం కష్టమవుతోంది. అదే రాతపరీక్ష అనంతరం ఎంపికచేసిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అర్హతలు గుర్తిస్తున్నాం. సమాన గుర్తింపు సమస్య ఉంటే విశ్వవిద్యాలయాలను సంప్రదించి తెలుసుకుంటున్నాం. ఈ కారణంగా కొంత జాప్యం జరుగుతోంది. సాధ్యమైనంత వరకు జాప్యాన్ని తగ్గించేందుకు కృషిచేస్తాం.

Monday, February 18, 2013

ఓఎంఆర్‌ షీట్లతో ‘నలిగి’పోతున్నారు!

గ్రూపు-4 రాత పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో ఏపీపీఎస్సీ ఇబ్బందుల్లో పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు రాతపరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గ్రూపు-4 తుది ‘కీ’పై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. మరోపక్క అభ్యర్థుల జవాబుపత్రాల్లో పలువురి ఓఎంఆర్‌ షీట్లు స్కానింగ్‌ (మూల్యాంకన ప్రక్రియలో భాగం) కోసం అనువుగా లేవని తెలిసింది. దీంతో ఆయా అభ్యర్థుల దగ్గర ఉన్న ఓఎంఆర్‌ కార్బన్‌ షీటు పత్రాలను పంపించాలని లిఖితపూర్వకంగా కోరినట్లు తెలిసింది. దాదాపు 15 మంది నుంచి ఓఎంఆర్‌ షీట్లను కోరినట్టు సమాచారం. వీరిలో కొంతమంది నుంచి మాత్రమే స్పందన వచ్చినట్టు తెలిసింది. ఓఎంఆర్‌ షీట్లను పరీక్షా కేంద్రాల నుంచి బండిళ్ల రూపంలో పంపించే సమయంలో అవి నలిగినట్లు చెబుతున్నారు. ఫలితాల వెల్లడి కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తుండగా తాజా సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఓఎంఆర్‌ షీట్లను పంపించాలని కోరడం వెనుక ఏమైనా మతలబు ఉందా అన్న దానిపై పలువురు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా… అందుకు అవకాశమే లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Friday, February 8, 2013

ఏపీపీఎస్సీ నియామకాలు చెల్లవా!

'అదనపు అర్హతల' కారణంగా ఇంటర్‌ బోర్డులో ఆగిన భర్తీ ప్రక్రియ

అంతా పద్ధతిగానే చేశామంటున్న ఏపీపీఎస్సీ

త్రిశంకు స్వర్గంలో 'ఎంపికైన' అభ్యర్థులు.

పెళ్లికొడుకు బాగున్నాడు కాని.. ఆరో వేలే నచ్చలేదు' అన్నట్లుంది ఇంటర్‌బోర్డు వ్యవహారం. ఈ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగాల నియామక సంస్థ (ఏపీపీఎస్సీ) చేపట్టిన ఉద్యోగ నియామకాలు చెల్లుతాయా? చెల్లవా? అనే దానిపై మాధ్యమిక విద్యా శాఖ తేల్చుకోలేకపోతోంది. ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న అర్హతలు కంటే.. ఎక్కువగా ఉన్న వారిని ఏపీపీఎస్సీ ఎంపిక చేసినందున వారిని ఉద్యోగాల్లోనికి తీసుకోవాలో లేదో తెలియక అధికారులు హైరానా పడుతున్నారు. ఏపీపీఎస్సీ మాత్రం.. తాము అన్నీ నిబంధనల ప్రకారమే కానిచ్చామంటూ చేతులు దులుపేసుకుంటోంది. ఈ గందరగోళం మధ్య ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రకటన జారీకి ముందే తీసుకోవల్సిన జాగ్రత్తల్లో ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లోపించినందున నియామకాల ప్రకటన చెల్లుబాటుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాధ్యమిక విద్యా శాఖ పరిధిలోని ఇంటర్‌ బోర్డులో 84 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ 2011 డిసెంబరులో ప్రకటన జారీచేసింది. డిగ్రీలో కంప్యూటర్స్‌ సబ్జెక్టు ఆప్షనల్‌గా ఉండాలని పేర్కొంది. లేదంటే.. డిగ్రీ అర్హతతో అదనంగా సాంకేతిక విద్య శిక్షణ సంస్థ ద్వారా ఆఫీస్‌ ఆటోమేషిన్‌లో, పీసీ మెయింటెనెన్స్‌ అండ్‌ ట్రబుల్‌ షూటింగ్‌లో, వెబ్‌డిజైనింగ్‌లో కానీ ఏదో ఒక సర్టిఫికేట్‌ కోర్సును పూర్తిచేయాలని పేర్కొంది. ఆ ప్రకారం కిందటేడు జులై 8న రాత పరీక్ష జరిపి సెప్టెంబరు 27న ఫలితాలను వెల్లడించింది. గత డిసెంబరు 8న ఎంపికచేసిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఇంటర్‌ బోర్డుకు పంపించింది.

ఇక్కడే సమస్య మొదలైంది.అర్హతలు ఎక్కువగా ఉన్నాయని..!మొత్తం 84 మందిలో 54 మందికి ఇంటర్‌ బోర్డు పేర్కొన్న అర్హతలు ఖచ్చితంగా ఉన్నాయి. మిగతావారికి మాత్రం అర్హతలు కాస్తంత ఎక్కువ (ఎంసీఏ, ఇతర)గా ఉన్నాయి. అందుకే వీరికి ఉద్యోగాలు ఇవ్వాలా.. వద్దా అన్న దానిపై ఇంటర్‌ బోర్డుకు ధర్మసందేహం వచ్చింది. దీనిని ఏపీపీఎస్సీ వర్గాలు కొట్టిపారేశాయి. సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులను అనుసరించి ఎక్కువ అర్హతలు ఉన్నా ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేశామని తెలిపింది. అయితే.. దీనిని ఇంటర్‌ బోర్డు పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ నిర్ణయం ఏదైనా.. ఇంటర్‌ బోర్డు జనరల్‌ కౌన్సెల్‌లో ఆమోదించాలని, ఇతర శాఖల మాదిరిగా ఇక్కడ బోర్డు లేదని వాదిస్తోంది. న్యాయనిపుణులను సంప్రదిస్తే.. ప్రకటనలో ఉన్న ప్రకారమే సాగించాలన్నారని చెబుతోంది. చివరికి ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అక్కడి నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడితే అలా చేస్తామని పేర్కొంటోంది.అభ్యర్థుల ఆవేదనకొద్దిమంది నియామకాలపై వివరణ కోసం మిగతా అన్ని నియామకాలు ఎందుకు ఆపుతారని అభ్యర్థులు వాపోతున్నారు. సాధారణ పరిపాలన శాఖ జి.ఒ.ను ఇంటర్‌ బోర్డులో ఆమోదించకపోవడం ఎవరి తప్పని వారు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క.. ఇంటర్‌ బోర్డులో పబ్లిక్‌ పరీక్షల హడావుడి మొదలైంది. ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్తవారు వస్తే.. అదనపు భారం తగ్గుతుందని భావిస్తున్న సహచర ఉద్యోగులకు తాజా పరిణామాలు ఇబ్బందిని కలిగిస్తున్నాయి.

Monday, January 21, 2013

2008 Group 2 Non-Executive Certificate Verification List

Certificate Verification List for Notification No. 11/2009 TO 38/2008 , Group-II Services GENERAL RECRUITMENT

The verification of the certificates will be held from 10.30 AM in the Commission’s Office from 04/02/2013 to 06/02/2013. The verification schedule will be placed in the website separately. The candidates should download the call letter, Revised Vacancy Position, Check lists, Attestation Forms and other Relevant forms from the Commission’s website from Dt: 24/01/2013 and should submit at the time of verification of certificates.

గ్రూపు-2 విలీనం ఈసారి ఉండకపోవచ్చు - చిత్తరంజన్ బిస్వాల్

‘కీ’లక తప్పులు సవరిస్తాం.. వివిధ పరీక్షల్లో దొర్లిన పొరపాట్లపై నిపుణుల కమిటీలు
గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనం వాయిదా వేయాలని సర్కార్‌కు లేఖ రాస్తాం
ఏప్రిల్‌లో కొత్త నోటిఫికేషన్లు

ప్రతిభావంతులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూడటమే లక్ష్యంగా ఉద్యోగ నియామక పరీక్షల ప్రశ్నపత్రాల రూపక్పలనలో సమూల మార్పులు తెస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చైర్మన్ చిత్తరంజన్ బిస్వాల్ వెల్లడించారు. వివిధ పోటీ పరీక్షల ‘కీ’లలో దొర్లిన పొరపాట్లను సరిదిద్ది అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బిస్వాల్ ‘సాక్షి’తో మాట్లాడారు. భవిష్యత్తులో అభ్యర్థులు ఎవరికీ అన్యాయం జరక్కుండా తీసుకోనున్న చర్యలను వివరించారు. పలు పోటీ పరీక్షల ‘కీ’లలో పొరపాట్లను సాక్షి వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో నిపుణుల కమిటీతో పరిశీలన జరిపి చర్యలు చేపడతామని తెలిపారు. గ్రూపు-1 ప్రిలిమ్స్ తుది ‘కీ’లో దొర్లిన నాలుగు తప్పుల విషయంపై కోర్టు ఉత్తర్వుల కాపీ అందాక నిపుణుల కమిటీని నియమిస్తామని చెప్పారు. ఈనెల 6వ తేదీన నిర్వహించిన పాలిటెక్నిక్ లెక్చరర్ల రాత పరీక్షలో ఓ ప్రైవేటు బిట్‌బ్యాంక్ పుస్తకంలోని 120 ప్రశ్నలను, జవాబుల ఆప్షన్లను యథాతథంగా ఇవ్వడం సరైంది కాదని బిస్వాల్ అభిప్రాయపడ్డారు. దీన్ని నిపుణుల కమిటీకి నివేదిస్తామని చెప్పారు. ఇంకా బిస్వాల్ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..

రకరకాలుగా అన్వయించే ప్రశ్నలు నివారిస్తాం

భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా ప్రశ్నపత్రాల రూపకల్పనలో పకడ్బందీ చర్యలు చేపడతాం. ప్రశ్నలు అడిగే తీరులో మార్పులు తెస్తాం. ఒక ప్రశ్నను వివిధ కోణాల్లో ఆడగవచ్చు. పుస్తకాల్లోని ప్రశ్నలనే యథాతథంగా ఇవ్వకుండా, మార్పులు చేసి అభ్యర్థిని పరీక్షించేలా చర్యలు చేపడతాం. రెండు రకాలుగా అన్వయించేందుకు వీలుండే(డ్యూయల్ ఆప్షన్లు) ప్రశ్నలను ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ అంశాలపై ప్రశ్నపత్రాలు రూపొందించే ప్రొఫెసర్లతో చర్చించి అభ్యర్థులకు మేలు చేకూరేలా చూస్తాం. అంతేకాదు 150 ప్రశ్నలతో ప్రశ్నపత్రాన్ని రూపొందించాల్సి వచ్చినపుడు మరో 50 ప్రశ్నలను అదనంగా రూపొందించేలా చర్యలు చేపడతాం. దీనివల్ల ప్రొఫెసర్లు మరోసారి సరిచూసుకుని డ్యూయల్ ఆప్షన్లు ఉండే ప్రశ్నలను తొలగించి తుది ప్రశ్నపత్రాన్ని రూపొందించడం సులభం అవుతుంది. మున్సిపల్ విభాగంలో జూనియర్ అకౌంటెంట్ పరీక్ష కీలో పొరపాట్లు దొర్లినట్లు వచ్చిన ఫిర్యాదులను నిపుణుల కమిటీతో పరిశీలన జరిపి తగిన చర్యలు చేపడతాం.

ఇద్దరు ప్రొఫెసర్లతో పరిశీలన..

గ్రూపు-1 మెయిన్స్ లాంటి డిస్క్రిప్టివ్ జవాబు పత్రాల మూల్యాంకనంపై వస్తున్న ఫిర్యాదులపై చర్యలు చేపడతాం. ఉదాహరణకు గ్రూపు-1 మెయిన్స్ నాలుగో పేపరును భౌతిక, రసాయన, వృక్ష, జంతు, పర్యావరణ శాస్త్రాలకు సంబంధించిన సిలబస్‌తో రూపొందిస్తారు. ఈ పేపరు మూల్యాంకనం ఒక ప్రొఫెసర్‌తోనే చేయిస్తున్నారని, అయితే ఆ ప్రొఫెసర్ ఒకే సబ్జెక్టులో నిపుణులై ఉంటారని, దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. దీన్ని నివారించేందుకు డబుల్ వాల్యుయేషన్ చేయిస్తున్నాం. అయినా అభ్యర్థులకు అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇద్దరు లేదా ముగ్గురితో మూల్యాంకనం చేయించాలని భావిస్తున్నాం. దీనిపై కమిషన్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

గ్రూపు-2 విలీనం ఈసారి ఉండకపోవచ్చు

గ్రూపు-1లో గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను విలీనం చేస్తూ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పలువురు అభ్యర్థులు దీన్ని మా దృష్టికి తెచ్చారు. గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనాన్ని కొంతకాలం వాయిదా వేయాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. కొత్త విధానం తెచ్చినపుడు కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే లేఖ రాశాం. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. వాయిదా వేసేందుకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో జారీ అయ్యే గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లలో ఈ విలీనం ఉండకపోవచ్చు.

వచ్చే నెలాఖరులోగా అన్ని ఫలితాల వెల్లడి

ఇప్పటివరకు రాత పరీక్షలు పూర్తయిన వివిధ పోస్టుల ఫలితాలను దశలవారీగా వెల్లడించేందుకు చర్యలు చేపడుతున్నాం. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలపై క్షుణ్నంగా పరిశీలన జరిపిస్తున్నాం. అభ్యర్థులకు అన్యాయం జరక్కుండా పరిశీలన నిర్వహిస్తున్నందున ఫలితాల వెల్లడిలో కొంత ఆలస్యం అవుతోంది. అభ్యంతరాలపై నిపుణుల కమిటీ నుంచి వివరణలు అందిన ఫలితాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తాం. ఎక్కువమంది అభ్యర్థులు హాజరైన గ్రూపు-2, గ్రూపు-4, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ లాంటి పోస్టుల ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు అన్ని నోటిఫికేషన్ల ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపడతాం.

ఖాళీల వివరాలతో వార్షిక కేలండర్ తయారీ..

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వార్షిక కేలండర్‌ను అమలు చేస్తాం. వివిధ శాఖల నుంచి అందిన ఖాళీల సమాచారాన్ని అనుసరించి ఆర్థికశాఖ అనుమతులు లభించిన పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తాం. ఫిబ్రవరి, మార్చి నెలాఖరు వరకు వివిధ శాఖల నుంచి అందే ఖాళీ పోస్టులకు ఏప్రిల్‌లో నోటిఫికేషన్లు జారీ చేసేలా చర్యలు చేపడతాం.

ప్రభుత్వం అనుమతిస్తే రిజర్వేషన్ల వారీగా ఎంపిక

గ్రూపు-1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికను రిజర్వేషన్లవారీగా చేపట్టాలని 2011 అక్టోబర్‌లో కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం అమోదం కోసం ప్రభుత్వానికి ఫైలు పంపింది. మెయిన్స్ రాత పరీక్షకు మెరిట్ ప్రాతిపదికన 1:50 చొప్పున కాకుండా ప్రతి రిజర్వేషన్ కేటగిరీలో 1:15 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయాలని అందులో పేర్కొంది. ప్రభుత్వం ఆమోదిస్తే భవిష్యత్తులో జారీ చేసే గ్రూపు-1 నోటిఫికేషన్‌లో అమలు చేస్తాం. అయితే ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.

Sunday, January 20, 2013

గ్రూప్ - 1 లో బడుగులకు పెద్దపీట

ప్రతిష్టాత్మకమైన గ్రూప్‌-1 నియామక ప్రక్రియలో ఈ సారి నుంచి కొత్త విధానంలో పరీక్షలను నిర్వహించాలన్న ఆలోచనలో ఏపీపీఎస్‌సీ నిమగ్నమైంది. ఆ మేరకు కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నడూ లేని విధంగా గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షలకు హాజరైన వారిని మెయిన్‌ పరీక్షలకు ఎంపిక చేసే ప్రక్రియలో రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేయాలని ఏపీపీఎస్‌సీ ప్రాథమిక స్థాయిలో నిర్ణయించింది.రిజర్వేషన్ల వారీగా ఒక్కొక్క పోస్టుకు 15 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీని వల్ల బడుగు, బలహీన వర్గాలకు ఎంతో మేలు కలుగుతుందని ఏపీపీఎస్‌సీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌ సి.ఆర్‌.బిశ్వాల్‌ పేర్కొన్నారు.

అంటే ఇప్పటి వరకు ఏపీపీఎస్‌సీ నిర్వహిస్తూ వస్తోన్న గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షల్లో రిజర్వేషన్లు విధానాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేసినట్లయితే రాష్ట్రంలోనే తొలి సారిగా ఈ తరహా రిజర్వేషన్ల విధానం అమల్లోకి వచ్చినట్లవుతుంది.ఇప్పటి వరకు గ్రూప్‌-1ఎంపిక నిమిత్తం మూడు దశల్లో పరీక్షలు నిర్వహిస్తు వస్తున్నారు. ఇందులో ప్రాథమిక పరీక్ష, మెయిన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా గ్రూప్‌-1 పోస్టుల ఎంపిక జరుగుతుంది. ప్రాథమిక పరీక్షలకు హాజరైన వారి నుంచి 1:50 నిష్పత్తి ప్రకారం మెయిన్‌ పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఆ దశలో ఇప్పటి వరకు ఎన్నడూ రిజర్వేషన్లు విధానం అమలు చేయలేదు. మొత్తం గ్రూప్‌-1 పోస్టులను 1:50 నిష్పత్తి ప్రకారం లెక్కించి మెయిన్‌ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీని వల్ల ఓపెన్‌ కేటగిరి అభ్యర్థులే అధిక సంఖ్యలో మెయిన్‌ పరీక్షలకు ఎంపికవుతున్నారు. ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్‌ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.

మెయిన్‌ పరీక్షలకు హాజరు కావడానికి వీరికి అవకాశం దక్కడం లేదు. దీంతో వీరంతా గ్రూప్‌ -1 ఉద్యోగాలపై ఆశలు చాలించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో ప్రకటించిన పోస్టులను రిజర్వేషన్ల వారీగా ముందే కేటాయిస్తారు. ఆ ప్రకారం నోటిఫికేషన్‌లో ప్రకటిస్తారు. దాని ప్రకారం ఒక్కొక్క పోస్టుకు 15 మంది అభ్యర్థులను మెయిన్‌ పరీక్షలకు ఎంపిక చేస్తారు. అంటే ఓపెన్‌లో 10 పోస్టులు ఉంటే 150 మందిని ఓపెన్‌ అభ్యర్థులను మెయిన్‌ పరీక్షలకు ఎంపిక చేస్తారు. అలాగే ఎస్‌సీ వారికి 5 పోస్టులు ఉన్నట్లయితే మెయిన్‌ పరీక్షలకు 75 మందినే ఎస్‌సీ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇతరులకు అవకాశం ఇవ్వరు. ఎస్టీ ఉమెన్‌ పోస్టులు 8 ఉన్నట్లయితే ఆ పోస్టులు కూడా వారికే కేటాయిస్తారు. అంటే 120 మందిని ఎస్టీ ఉమెన్‌ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఒక వేళ ఆయా సామాజిక వర్గానికి కేటాయించిన పోస్టులకు అభ్యర్థులు దొరకనట్లయితే.. ఆ పోస్టులను తర్వాత నోటిఫికేషన్‌లో ప్రకటించే అవకాశం ఉంటుందని ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌ సి.ఆర్‌.బిశ్వాల్‌ పేర్కొన్నారు. అయితే ఈ విధానం ప్రస్తుతం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి)లో అమలు పరుస్తున్నారని, దీని వల్ల ఎవరికీ అన్యాయం జరిగే అవకాశం ఉండదని ఛైర్మన్‌ అభిప్రాయపడ్డారు.

Saturday, January 19, 2013

ఏపీపీఎస్సీలో నలుగురికి షోకాజ్ సీఎం నిర్ణయం.. గవర్నర్ గ్రీన్‌సిగ్నల్

ప్రభుత్వ ఉత్తర్వుల అమలును అడ్డుకోవడంతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారుల పాత్రను తప్పుపట్టారన్న కారణంతో ఏపీపీఎస్సీలోని నలుగురు సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ సభ్యుల వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న సీఎం కిరణ్ వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా తొలుత షోకాజ్ నోటీసుల జారీకి నిర్ణయం తీసుకున్నా రు.

దీనికి గవర్నర్ నరసింహన్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సర్కారు అభిమతాన్ని ధిక్కరించేలా వ్యవహరించారని భావిస్తున్న సభ్యుల్లో పద్దయ్య, రిపుంజయరెడ్డి, నౌమాన్, పోచయ్య, రవీందర్‌రావు, గుబ్బా చంద్రశేఖర్ ఉన్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్, సెక్రెటరీల పాత్రను ప్రశ్నించడం, వారిపై కోర్టులకు జీ.వో.నెం.420 జారీ విషయంలో ఐఏఎస్ అధికారి జె.సత్యనారాయణ పాత్రను తప్పుపడుతూ వీరు గవర్నర్‌కు లేఖ రాయడం వంటి అంశాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

LET US GO TO APPSC ON JAN 22nd

ఎపిపిఎస్సి ఎగ్జామ్స్ వ్రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులందరికీ ఒక మనవి, జనవరి 22 మంగళవారం రోజున అభ్యర్తులందరం కలిసి ఎపిపిఎస్సి చైర్మన్ గారిని కలిసి ఫలితాలు త్వరగా ఇచ్చేలా వారిపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించాం, కావున అందుబాటులో ఉన్న అభ్యర్తులందరు జనవరి 22 మంగళవారం రోజున మధ్యానం 2  గంటలకు ఎపిపిఎస్సి ఆఫీసుకు రాగలరని మనవి. 9700559470 - suneel, 9985852386 - madhav.

Monday, January 7, 2013

కనకపుష్యరాగం – పొణకా కనకమ్మ స్వీయచరిత్ర

“తెలుగునాట ఆడవాళ్ళు స్వీయచరిత్ర వ్రాసుకోవడము ఎక్కడైనా ఉండవచ్చును కానీ, అంతగా లేదు. ఆ భాగ్యము నాకు లభించినందుకు గర్వపడుచున్నాను.స్త్రీలకు సమర్థత లేక కాదుకానీ వారు బయట సంచరిటము తక్కువ” అంటూ తన స్వీయచరిత్రను కనకమ్మగారు 1959 జనవరి15న మొదలుబెట్టి 1960 సెప్టెంబరు 20న ముగించినా, ఏ కారణాలచేతో కాని, 2011 వరకూ అముద్రితంగానే ఉండిపోయింది. నెల్లూరులో విశ్రాంతజీవనం గడుపుతున్న డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారు పనిగట్టుకొని ఈ వ్రాతప్రతిని సంపాదించి, సంస్కరించి, కనకమ్మగారి గురించి ఇతర విషయాలను సేకరించి శ్రద్ధగా ప్రచురించారు.

కనకమ్మగారు 1892 జూన్ 10వతేదీన నెల్లూరుజిల్లా మినగల్లులో పుట్టారు. మడమనూరులో, పోట్లపూడిలో పెరిగారు. తండ్రి మరుపూరు కొండారెడ్డి, అమ్మ కామమ్మ. తాతలు కోడెల వ్యాపారులు. పడమటి బేరగాండ్రు ఇల్లంతా కంబళ్ళు పరచి వాటి మీద వెండిరూపాయలు కుప్పలు కుప్పలుగా పోసుకొని లెక్కపెట్టుకునేవారట. మేనమామ పొణకా సుబ్బరామిరెడ్డిగారితో ఆమెకు తొమ్మిదవ ఏట వివాహమయ్యింది. పోట్లపూడిలోనే కాపురం. జిల్లాలోని పెద్ద కుటుంబాలలో ఒకటి. 800 ఎకరాల పొలం; 500 ఆవులుండేవట. కోడెదూడల మీద సంవత్సరానికి పదివేలరూపాయల ఆదాయం, 20,30 వేల రూపాయల ధాన్యం రాబడి. వారి అవ్వ మరణించినప్పుడు పదిపుట్ల అన్నప్రదానము చేశారట; వచ్చినవారికి “త్రాగటానికి నీరుపోసే అవకాశము లేక వీధులలో కాలువలు త్రవ్వి నీరు పారించినారు”. అన్నప్రదానము చేయుటలో సుబ్బరామిరెడ్డిగారికి పెట్టింది పేరు.

కనకమ్మ గారు చిన్నతనంలో చదువుకోలేదు. తర్వాత స్వయంకృషి వల్ల చదువుకున్నారు. క్రమంగా కావ్యాలు, సంస్కృతము, హిందీ నేర్చుకున్నారు. శశిరేఖ, హిందూసుందరి, అనసూయ పత్రికలకు పద్యాలు, వ్యాసాలు పంపేవారు, చెట్టునీడ ముచ్చట్లు పేర ఆమె హిందూసుందరిలో వ్రాసిన వ్యాసాలకు మంచి గుర్తింపు వచ్చింది.

పోట్లపూడిలో కనకమ్మగారు సోదరులు, మరదులు, నెల్లూరు రామానాయుడు (తర్వాత జమీన్‌రైతు పత్రిక సంపాదకుడిగా ప్రసిద్ధుడు), మరికొందరితో కలసి 1913లో సుజనరంజనీ సమాజం స్థాపించి గ్రంథాలయము, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. రాయప్రోలు సుబ్బారావు, దువ్వూరి రామిరెడ్డి వంటివారు సమాజ కార్యక్రమాలకు వచ్చేవారు. నెమ్మదిగా సమాజంలోకి రాజకీయ భావాలు వచ్చాయి. మద్రాసునుంచి రివాల్వరులు తెప్పించి వాటిని పేల్చడం ప్రాక్టీసు కూడా చేశారు. వెన్నెలకంటి రాఘవయ్యగారు పూనాలో తిలక్‌నీ, మద్రాసులో చిదంబరం పిళ్ళేని కలసివచ్చారు. స్వదేశీ వస్త్రాలు ధరించటం, హరిజనవాడల్లో సేవాకార్యక్రమాలు చేయడం మొదలుబెట్టారు. 1917లో నెల్లూరులో జరిగిన ఆంధ్రమహాసభలో ఆంధ్రరాష్ట్ర తీర్మానం చేశారు. నెమ్మదిగా ఆ ప్రాంతంలో జాతీయోద్యమంలో కనకమ్మగారి పాత్ర పెరగటం మొదలయ్యింది. పెద్దపెద్ద నాయకులందరూ వారి ఇంటనే బస చేసేవారు. గాంధీజీ, బిపిన్‌చంద్రపాల్, రాజేంద్రప్రసాద్, ప్రకాశం పంతులు, కాశీనాధుని నాగేశ్వరరావు వంటి జాతీయ, రాష్ట్రీయ నాయకులు వారి ఆతిథ్యం స్వీకరించిన వారే. గోగినేని రంగా, బెజవాడ గోపాలరెడ్డి, దుర్గాబాయి దేశముఖ్ వంటివారు సన్నిహితంగా ఉండేవారు.

ఈ కార్యక్రమాలలో నెమ్మదిగా ఆస్తులు తరగటం ప్రారంభమయింది. వెంకటగిరి రాజాతో ఇబ్బందులు మొదలయ్యాయి. వారి కుటుంబం జమీందారుకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. ఆ పోరాటంలో భాగంగానే జమీన్‌రైతు పత్రిక ఆవిర్భవించింది. ఇతరులు కూడా మోసం చేశారు. నివాసం పోట్లపూడినుంచి, పిడూరుకూ, అక్కడి ఆస్థీ పోయాక నెల్లూరుకూ మారింది. మోసం చేసినవారిగురించి, తర్వాత రోజుల్లో ఇబ్బందులు పెట్టిన వారి గురించి అవసరమైనదానికన్నా తక్కువ పరుషంగా మాట్లాడారు ఈ ఆత్మకథలోలో. ఆత్మస్థుతీ, పరనిందా రెండూ తక్కువే. పిడూరులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లంతా కాలిపోయి భారీనష్టం జరిగింది. పుస్తకాల బీరువా (కొన్ని అముద్రిత పుస్తకాలతో సహా) కాలిపోయింది. ఇల్లు పోయినదానికన్నా పుస్తకాల బీరువా పోయినందుకు ఎక్కువ బాధపడ్డాను అని అన్నారు కనకమ్మ గారు.

కనకమ్మగారు నెల్లూరు స్త్రీల కాంగ్రెస్ సంస్థను స్థాపించి స్వాతంత్ర్యపోరాటంలో అనేక ఉద్యమాలు నిర్వహించారు. రెండుసార్లు జైలుకు కూడా వెళ్ళారు. గాంధీజీ వచ్చినప్పుడు ఆమె, ఆమె కుమార్తె వెంకటసుబ్బమ్మ తమ వంటిపై నగలన్నీ కాంగ్రెస్ నిధికి ఇచ్చారు. 1934లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌కు ఉపాధ్యక్షులుగా ఎన్నికయిన మొదటి మహిళ కనకమ్మ గారు.

కనకమ్మగారి కుమార్తె చిన్న వయస్సులో మరణించారు. రమణ మహర్షి, ఆయన శిష్యుడు రామయోగుల దగ్గర కనకమ్మగారు దుఃఖోపశమనమనం పొందారు. వారి ఆశ్రమాలలో చాలాకాలం ఉన్నారు. ఆధ్యాత్మిక పుస్తకాలు రచించారు.

ఆడపిల్లలకోసం ప్రత్యేకంగా కస్తూరి విద్యాలయం స్థాపించారు. గాంధీజీ ఈ స్కూలు భవనానికి శంకుస్థాపన చేశారు. కుల మత వివక్ష లేకుండా ఆడపిల్లలకు హాస్టల్ వసతి కల్పించి చదువు చెప్పించేవారు. ప్రభుత్వగ్రాంటులులేకుండా, జాతీయోద్యమంలో భాగంగా, ఆదర్శపాఠశాలగా నడిపారు. ఆమె జైలుకు వెళ్ళినప్పుడు పాఠశాల మూత పడిపోయింది. మళ్ళీ 1944లో పాఠశాలను తిరిగి ప్రారంభించారు. తర్వాత బాలికలకోసం ఒక పారిశ్రామిక పాఠశాలను కూడా మొదలుబెట్టారు. వీటి నిర్వహణకోసం నిధులను ఆమే నాటక ప్రదర్శనలు నిర్వహించి, ఇతరత్రా కష్టపడి సంపాదించేవారు. కస్తూరి విద్యాలయ నిర్వహణనుంచి ఆమెను తప్పించటం ఆమె చరమాంకంలో విషాదఘట్టం. ఆరోగ్యం క్షీణించి, ఇబ్బందులు పడుతూనే స్వీయచరిత్రను ముగించి, 1963 సెప్టెంబరు 15న మరణించారు.

ఈ పుస్తకం చదువుతుంటే ఆరోజుల్లో ఆంధ్రదేశంలో హేమాహేమీలు అనదగ్గ వారందరితోనూ కనకమ్మగారికి సన్నిహిత పరిచయాలున్నట్టు తెలుస్తుంది. కాశీనాథుని, రాయప్రోలు, దువ్వూరి రామిరెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య, సి.ఆర్.రెడ్డి, మోటూరి సత్యనారాయణ, రంగా, నార్ల వంటివారితో మొదలుబెట్టి, సినిమానటులవరకూ అందరూ ఆమెకు పరిచయమే.

ఆవిడ చాలా కథలు, వ్యాసాలు, పద్యాలు వ్రాశారట (కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి). ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మతో కలసి జంట కవిత్వం చెప్పేవారట. కనకమ్మగారిని 1955లో గృహలక్ష్మి స్వర్ణకంకణంతో సత్కరించారు. అంతకు ముందే 1939లో గృహలక్ష్మి స్వర్ణకంకణ ప్రదానోత్సవ సభలో ఆమె చేసిన అధ్యక్షోపన్యాసం చదువుతున్నప్పుడు, ఆమె విషయ పరిజ్ఞానానికి, ఆధునిక ఆలోచనావిధానానికి ఆశ్చర్యం వేస్తూంది.

నెల్లూరు రాజకీయ సాంఘిక చరిత్రతో ఇంతగా ముడివడ్డ పొణకా కనకమ్మగార్ని నెల్లూరు పట్టణం ఎందుకో మరచిపోయింది. పొణకా కనకమ్మ బాలికల పాఠశాల మాత్రమే నెల్లూరులో ఆవిడ జ్ఞాపకం. ముప్పై ఏళ్ళ క్రితం తయారుచేసిన ఆమె కాంస్యవిగ్రహం ఇప్పటికీ ప్రతిష్టించకుండా ఏదో స్కూల్లో మూల గదిలో ఉందట.

Thursday, January 3, 2013

ఉద్యోగాల ‘జాతర’

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ముస్తాబవుతోంది. తమ సంక్షేమ పథకాలతో అన్ని రకాల ప్రజలను, అన్ని సామాజిక వర్గాల ప్రజలతో పాటు, విద్యార్థు లను, నిరుద్యోగులను కూడా హక్కున చేర్చుకోవాలని కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీని వల్ల వచ్చే ఎన్నికలలో ఓట్లు సంగతి ఎలా ఉన్నప్పటికీ విద్యార్థులు, నిరుద్యోగులకు మాత్రం మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకంలో ఎస్‌సి, ఎస్‌టీ, బిసీ సామాజిక వర్గాలకు చేరవుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో తక్షణమే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయడానికి కంకణం కట్టుకున్నది. ఏప్రిల్‌ నెలాఖరు లోగా 50 వేల ఉద్యోగాల భర్తీ కోసం అన్ని రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలన్న కృతనిశ్చయంతో సర్కారు ఉన్నది.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం మొత్తం 21 నోటిఫికేషన్లు ద్వారా 50 వేల సర్కారి ఉద్యోగాలను భర్తీ చేయాలన్నదే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తపన. ఆ మేరకు అన్ని రకాల నియామక సంస్థలతో పాటు.. పలు ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఈ సారి వివాదాలు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వయోపరిమితి పెంచడం, రిజర్వేషన్ల విధానాన్ని కచ్చితంగా పాటించడం. ప్రాంతాలు, లోకల్‌, నాన్‌ లోకల్‌ విధానంపై వివాదాలు లేకుండా చూడడంపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. పలు రకాల వివాదాల వల్ల నోటిఫికేషన్లతో పాటు, నియామక ప్రక్రియలు కూడా నిర్ధాక్షణ్యంగా నిలిచి పోతున్నాయి. కాబట్టి ఎలాంటి వివాదాలకు ఆష్కారం లేకుండా.. నిరుద్యోగుల ప్రయోజనాలే ధ్యేయంగా నియామకాలు చేపట్టాలని ఏపీపీఎస్‌సీ, డిఎస్సీలతో పాటు.. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌, జైళ్ల శాఖ వంటి సంస్థలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

32 వేల టీచర్ల భర్తీకి నెలాఖరులో నోటిఫికేషన్‌..

పాఠశాల విద్యా శాఖలో ఉన్న 32 వేల టీచర్‌ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులోగా డిఎస్సీ-2013 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయంపై మాధ్యమిక విద్యా శాఖ మంత్రి స్పష్టతతో ఉన్నారు. అందుకు సీఎం అనుమతి ఉండనే ఉన్నది. ఇప్పటికే డిఎస్సీ-2012 ద్వారా 21 వేల టీచర్ల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ఇందులో మిగులు పోస్టులు, ఖాళీలు, ఆర్‌విఎం ద్వారా వచ్చిన పోస్టులు కలుపుకుని దాదాపు 32 వేల పైగా సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేస్తారు. వీటితో పాటు భాషా పండితులు, పిఇటి పోస్టులు కూడా భర్తీ చేస్తారు. ఈ పరీక్షలకు దాదాపు మూడు లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది.

కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ జారీ..

పోలీస్‌ శాఖలో కానిస్టేబుళ్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6,071 కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులను పరుగు పందెం, శారీరక పరీక్ష, రాత పరీక్షల ద్వారా భర్తీ చేస్తారు. ఇందుకోసం దాదాపు లక్షల మంది నిరుద్యోగులు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.

గ్రూప్‌ -1, గ్రూప్‌ -2 పై అభ్యర్థుల దృష్టి..

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పోస్టులుగా భావించే గ్రూప్‌-1 పోస్టులకు భర్తీపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో దాదాపు 350 వరకు పోస్టులు ఉన్నాయి. వీటిలో డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, సిటీఓలు, ఎకై్సజ్‌ సూపరింటెండెంట్లు, మున్సిపల్‌ కమీషనర్‌ గ్రేడ్‌-1 వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే రాష్ట్ర స్థాయి పోస్టులకు కచ్చితంగా ఇంటర్వ్యూలు నిర్వహించ నున్నారు. ఇదే క్రమంలో గ్రూప్‌-2 పోస్టుల పోస్టుల భర్తీ కోసం కూడా కొత్తగా నోటిఫికేషన్లు విడుదల చేసే ప్రక్రియ ప్రారంభం అయింది. గ్రూప్‌-2 ఉద్యోగ ప్రక్రియను పాత విధానంలోనే కొనసాగిస్తారని తెలిసింది. తాజాగా విడుదల చేసిన జీవో 623, 624 జీవోల ప్రకారం భర్తీ చేసే విషయాన్ని సర్కారు తాత్కాలికంగా నిలిపి వేసింది. దీంతో ఎగ్జిక్యూటీవ్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించే ఆలోచనలోనే ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌ ఉన్నారు. అలాగే గ్రూప్‌-4 పోస్టుల భర్తీ కోసం కూడా త్వరలో భారీ సంఖ్యతో నోటిఫికేషన్‌ విడుదల కాబోతున్నది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దాదాపు 1,500 వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలలో ఖాళీలుగా ఉన్న 5,705 లెక్చరర్ల పోస్టులకు కూడా త్వరలో ఆర్థిక శాఖ ఆమోదం తెలియజేయనున్నది. ఇవి జోనల్‌ పోస్టులుగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వివాదాలు లేకుండా సర్కారు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అలాగే ఈ ఖాళీలల్లో కాంట్రాక్ట్‌ లెక్చరర్లు కొనసాగుతున్నారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు బదులుగా రెగ్యులర్‌ లెక్చరర్లను నియమించాలని సర్కారు భావించింది. అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలలో ఖాళీలుగా ఉన్న దాదాపు 911 లెక్చరర్ల భర్తీ కోసం చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ వివాదాలను అధిగ మించి పోస్టులను భర్తీ చేయాలన్నది సర్కారు సంకల్పం. కాబట్టి ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 6వ తేదీన రాత పరీక్ష నిర్వహించన్నారు. ఇవి కాకుండా.. వీలయినంత త్వరలో మరో 200 పాలిటెక్నిక్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్‌ విడుదల కాబోతున్నది.

Wednesday, January 2, 2013

కొలువుల మేళా

కొలువుల మేళాఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి సుమారు 3500 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటనలు త్వరలో రాబోతున్నాయి. వివిధ శాఖల నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలు అందినప్పటికీ.. సామాజిక రిజర్వేషన్లు, ప్రాంతీయ వివరాలపై స్పష్టత కోసం ఎపీపీఎస్సీ అధికారులు సచివాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందుకు అనుగుణంగా అందే సమాచారాన్ని అనుసరించి ప్రకటనల జారీ జరుగుతుంది. మొత్తంమీద 16 రకాల ప్రకటనలు జనవరిలో కొన్ని, ఫిబ్రవరిలో మరికొన్ని రాబోతున్నాయి. గత వారం 610 ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ ప్రకటనలు జారీచేసింది. త్వరలో విడుదల చేయనున్న ప్రకటనల్లో.. పంచాయతీ కార్యదర్శుల పోస్టులు 2677 వరకు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరపాలని తొలుత నిర్ణయించారు.

 స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎపీపీఎస్సీని పరీక్ష జరపాలంటూ ప్రభుత్వం కోరింది. ఇందుకు అనుగుణంగా అధికారిక ఉత్తర్వుల్లో మార్పు జరగాల్సి ఉంది. ఈ విషయమై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఉత్తర్వులు వెలువడితే.. ఈ నెల మూడోవారంలో ప్రకటన వెలువడనుంది. కేన్‌ రెగ్యులేషన్‌ ఇన్‌స్పెక్టర్స్‌ పోస్టులు 37 ఉన్నాయి. వీటిని రాష్ట్ర పోస్టులుగా గుర్తించి 1965లో భర్తీచేశారు. ప్రస్తుతం జోనల్‌ పోస్టులుగా గుర్తించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. అలాగే అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఇరిగేషన్‌) పోస్టులు 465, ఇతర పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీలో సర్వీసు నిబంధనల అంశంపై స్పష్టత కోసం ఎపీపీఎస్సీ అధికారులు ఎదురుచూస్తున్నారు. సంబంధిత శాఖల నుంచి లభించే స్పష్టతను అనుసరించి ఈ ప్రకటనల జారీ వేగాన్ని అందుకోనుంది.గ్రూపు-1ఎ, బి, గ్రూపు-2 కింద గుర్తించిన ఉద్యోగ ఖాళీల వివరాలు ఎపీపీఎస్సీకి అందాయి. ఇవికాకుండా మరికొన్ని ఖాళీల వివరాలు అందనున్నాయి. ఎన్నికల దృష్ట్యా ప్రకటనల జారీ సమయానికి ఈ ఉద్యోగాల సంఖ్య బాగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ పోస్టుల భర్తీ తీరులో గత నెలలో విధానపరమైన మార్పులు జరిగాయి. ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల గతనెలలో జారీ అయిన ఉత్తర్వులపై పునస్సమీక్ష జరిపి అధికారిక నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఈలోగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత రానుంది. ఈ ఉద్యోగ ప్రకటనలు వెలువడేందుకుఏప్రిల్‌ వరకు సమయం తీసుకోనుంది.


క్షమించండి..

క్షమించండి..ఏపీపీఎస్సీలో చోటుచేసుకున్న సంఘటనలకు తాను బాధ్యుడినై ఉంటే క్షమించాలని సభ్యుడు జి.పద్దయ్య రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసే ఆదేశాలకు బద్ధుడినై ఉంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు లేఖ పంపారు. అందులో తాజా పరిణామాలపై కలత చెందానని పేర్కొన్నారు. తాను గ్రామీణ నేపథ్యంతో.. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని తెలిపారు. ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించే విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందన్న సమాచారం తనకు తొలుత అప్పటి ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు కె.సి.రెడ్డి నుంచి వచ్చిన ఫోన్‌ ద్వారా తెలిసిందని వెల్లడించారు. విద్యాపరమైన పరిశోధన రంగంలో ఉన్నందున తాను రాలేనని చెప్పినప్పటికీ, భవిష్యత్తులో మంచి అవకాశాలు రావోమోనన్న ఉద్దేశంతో చివరికి అంగీకరించానని పేర్కొన్నారు. తాను గుంటూరు జిల్లాలో గ్రూపు-2 పరీక్షకు తొమ్మిది మంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చినప్పటికీ పరీక్ష రాసేందుకు మానవీయ కోణంలో అంగీకరించానని వెల్లడించారు. తాజా పరిణామాల పట్ల మానసికంగా ఆందోళనకు గురయ్యానన్నారు. ఒకవేళ తాను ఏ రకంగానైనా బాధ్యుడిని అయి ఉంటే బేషరతుగా క్షమాపణ వ్యక్తం చేస్తున్నట్లు గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తానని హామీ ఇచ్చారు. మన్నించి ఈ సంకట పరిస్థితి నుంచి బయట పడేయాలని కోరారు. ఈ లేఖను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌లకు కూడా పద్దయ్య పంపారు.