![]() |
| భువనేశ్వర్ వద్ద ఉదయగిరి కొండల్లో ఉన్న హాతిగుంఫా గుహ |
అశోకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత క్రీ.శ. 183లో ఖారవేలుడు కళింగ రాజయ్యాడు. మౌర్య సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన మొదటి స్వతంత్ర కళింగ రాజు ఇతడే. పాటలీపుత్రాన్ని పాలిస్తున్న పుష్యమిత్రుని ఓడించి మౌర్య రాజులు అంతకుముందు తీసుకువెళ్ళిన జైన విగ్రహాలను తిరిగి కళింగ రాజ్యానికి తీసుకొచ్చాడు. ఖారవేలుడు జైన మతస్థుడు, వృషభ లాంఛనుడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం.
![]() |
| ఖారవేలుని హాతిగుంఫా శాసనము |
జైనమత వ్యాప్తికి కృషి
క్రీ.పూ. 4వ శతాబ్దంలో జైనం మన రాష్ట్రంలోకి ప్రవేశించింది. కళింగరాజు ఖారవేలుడు ఆదరించడంతో ఈ మతం మొదటగా కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో స్థిరపడింది. అశోకుడి కుమారుడు సంప్రతి ఆంధ్ర, ద్రవిడ, దేశాలలో జైనమత వ్యాప్తికి కృషి చేశాడు. అమరావతికి సమీపంలో వడ్డమాను కొండపై సంప్రతి విహా రం ఏర్పాటు చేశాడు. అక్కడ ఖారవేలుడు మహామేఘ వాహన విహారం నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. క్రీస్తు శకారంభంలో కొండకుందా చార్యుడు అనంతపురంజిల్లా కొనకుండ్లలో జైన ఆశ్రమం నిర్మించుకుని మత ప్రచారం చేశాడు. పలు గ్రంథాలు రచించాడు. జైనంలో శ్వేతాం బరులు, దిగంబరులు అని రెండు వర్గాలున్నా ఆ ఇద్దరికీ అనుసరణయమైన సమయసార గ్రంథాన్ని రచించింది ఈ కొండకుందాచార్యుడే! అహింసా మార్గాన్ని జనం ఆదరించినా జైనం దీన్ని మరీ తీవ్రంగా ఆచరణలోకి తీసుకురావడంతో సామాన్యులకు దాన్ని అనుసరించడం కత్తిమీద సామైపోయేది. ఈ ఇబ్బందే జైనమతం ప్రాబల్యం తగ్గిపోడానికి ప్రధాన కారణమైంది. గాలిపీలిస్తే సూక్ఝక్రిములు చనిపోతాయని ముక్కు కు గుడ్డకట్టుకోవడం, మంచినీళ్ళను వడగట్టుకుని తాగడం, కాలికింద పడి క్రిములు చనిపోకుండా ఉండేందుకు నడిచే మార్గాన్నంతా చీపురుతో ఊడ్చుకుంటూ వెళ్ళాలనడం, నేలను దున్ని సేద్యం చేయడం హింసా మార్గమని వ్యవసాయం మానేసి పండి పడిన పళ్ళనే తిని జీవించడం వంటి విధానాలు చూసి సామాన్యులు భయపడి దూరమైపోయారు. ఉల్లి, వెల్లుల్లి తినరు. వడ్డీవ్యాపారం చేస్తారు.


No comments:
Post a Comment