![]() |
| ఎన్.జి.రంగా |
తొలి జీవితం
ఆయన నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకు 1900 నవంబర్ 7వ తేదీన గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించారు. ఆయన అసలు పేరు గోగినేని రంగనాయకులు. అనంతరం ఎన్.జి.రంగాగా సుప్రసిద్ధులయ్యారు.నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు. ఇరవై ఏళ్ళ వయస్సులో ఉన్నత చదువుల కోసం ఇంగ్లాడ్ వెళ్ళారు.1926లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన రంగా కాంగ్రెసు పార్టీవైపు ఆకర్షితులై ఆ పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. 1924లో భారతీదేవితో రంగా వివాహం జరిగింది. ఆనంతరం 1927లో మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఆర్ధిక శాస్త్ర అధ్యాపకునిగా, అనంతరం మద్రాసు ప్రభుత్వ ఆర్ధిక సలహాదారునిగా కొంత కాలం పనిచేశారు. 1930లో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్లతో సన్నిహితంగా మెలుగుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో విజృంభించారు. 1931లో భూమి శిస్తుకు వ్యతిరేకంగా ఉద్యమించిన రంగాను బ్రిటీషు ప్రభుత్వం అరెస్టు చేసింది. అరెస్టులకు బెదరని రంగా రైతుల దుర్భర పరిస్ధితులకు వ్యతిరేకంగా రైతు రుణ విముక్తి ఉద్యమాన్ని ప్రారంభించి, జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమ ఫలితంగానే బ్రిటీష్ ప్రభుత్వం ఆనాడు రైతుల రుణాలపై మారటోరియంను ప్రకటించింది. అప్పటి నుంచి రైతు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ రంగా ప్రత్యక్షమై ఉద్యమాలను నిర్వహించేవారు.
రాజకీయ పాఠశాల
యువతకు రాజకీయాలు నేర్పడానికి పాఠశాలను స్ధాపించిన ఘనత ఆచార్య ఎన్.జి.రంగాకే దక్కింది. దేశంలోనే తొలిసారిగా ఆయన నిడుబ్రోలులో రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడానికి సమర్ధులైన నాయకులను రాజకీయాల్లోకి తేవడమే లక్ష్యంగా 1933వ సం.లో రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధి ప్రారంభించడం విశేషం. తొలి రాజకీయ పాఠశాలలో పుచ్చలపల్లి సుందరయ్య తో సహా కొందరు కమ్యునిస్టులు పాల్గొన్నారు. రాష్ట్రం,దేశం నుంచి విద్యాలయానికి విచ్చేసి రాజకీయంగా ఓనమాలు నేర్చుకున్న నాయకులు ఎందరో సమర్ధులైన నాయకులుగా పేరు ప్రఖ్యాతులు గడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా, మంత్రులుగా, ఎమ్మెల్యే పదవులను చేపట్టి రాణించారు. ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కూడా రంగా శిష్యుడే. ఈ పాఠశాల స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది.
కృష్ణా జిల్లాలోని కంకిపాడులో 1939 న ఆచార్య రంగా అధ్వర్యంలో నడచిన రాజకీయ పాఠశాలలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, పి.హనుమయ్య వంటి కమ్యునిస్టులు చేరి అధ్యాయం చేసారు.
రైతు నాయకుడుగా రంగా
1930లో మహాత్మాగాంధీ పిలుపుకు స్పందించి రంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1933లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రేస్ పార్టీని స్థాపించాడు. రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై బాపు దీవెనలు అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు.
జమీందారీ రైతుల సమస్యల్ని గూర్చి ప్రత్యేక అధ్యయనం చేసిన రంగా జమీందార్ల అత్యాచారాల్ని అరికట్టాలంటే రైతుల్ని సంఘటిత శక్తిగా రూపొందించడం ఒక్కటే మార్గమని భావించాడు. 1933-36 మధ్య కాలంలో నెల్లూరు జిల్లాలో అతిపేడ్డ జమీందారి అయిన వెంకటగిరిలో రంగా రైతు ఉద్యమాన్ని నిర్వహించాడు. ఈ కాలంలో రంగా వామపక్షాలపై సానుభూతిని చూపేవాడు. అయితే ఆయన కాంగ్రెస్స్ పార్టీని వదలలేదు. 1934లో నిడుబ్రోలులో భారతీయ రైతు శిక్షణా కేంద్రాన్ని(Indian Peasants Institute) స్థాపించి రాజకీయ తరగతుల్ని నిర్వహించాడు. 1936 లో ఫయాజ్ పూర్ లో జరిగిన అఖిల భారత రైతు కాంగ్రెస్ కు అధ్యక్షుడుగా వ్యవహరించడమే గాక 1938 లనుండి ఈ సంస్థ ప్రధాన కార్యదర్శిగ కుడా పనిచేసేవాడు. 1938-40 మద్య కాలంలో శ్రీకాకుళం జిల్లాలో మందస జమీందారి రైతుల్ని సంఘటిత పరిచి జమీన్దరుకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని నిర్వహించాడు.
రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు. 1946లో కోపెన్హేగెన్లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952లో ఒట్టావాలో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954లో న్యూయార్కులో జరిగిన ఇంటర్నెషనల్ పెజెంట్ యూనియన్లోనూ మరియు 1955లో టోక్యోలో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను భారతదేశం తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు.
ఆంధ్ర రాజకీయాలలో
ఈయన కాంగ్రేసు పార్టీ నుండి నిష్క్రమించి భారత కృషీకార్ లోక్ పార్టీ, ఆ తరువాత సహకారరంగ వ్యవసాయానికి బద్ధవ్యతిరేకి అయిన రాజాజీతో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించాడు. రంగా స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించాడు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి బలమైన ప్రతిపక్షముగా రూపుదిద్దుకొన్నది. 1972లో రంగా తిరిగి కాంగ్రేసు (ఐ)లో చేరాడు.
95 సంవత్సరాల వయస్సులో ఆయన అనారోగ్యంతో 1995 జూన్ 8వతేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన గోభూమిలో తుదిశ్వాస విడిచారు. రంగా మరణంతో భారత రాజకీయ వినీలాకాశం నుంచి ఓ ధృవతార రాలిపోయిందని జాతీయ, అంతర్జాతీయ స్ధాయి నాయకులు తమ సందేశాల్లో కొనియాడటం విశేషం.
కంకిపాడు

No comments:
Post a Comment