Thursday, November 29, 2012

ASO SCHEDULE FOR CERTIFICATES’ VERIFICATION

ASO 2012 EXAM CERTIFICATE VERIFICATION CANDIDATES MARKS LIST




CLICK HERE TO SEE THE TOTAL ENTRIES

ASO FINAL KEY

Industrial Promotion Officer (29/2011) Final Key

Hostel Welfare Officers(Group-IV) :: 55/2011 Primary Key

ASO SELECTION LIST

http://website.apspsc.gov.in/Documents/CERTIFICATE%20VERIFICATION%20LIST/13.pdf



CERTIFICATE VERIFICATION DATES : 06/12/2012 TO 12/12/2012

Wednesday, November 28, 2012

POST YOUR GROUP 2 KEY OBJECTIONS HERE

Paper code D:

Paper 1 Objections:

QNO 14: Which of the following structures is mentioned as an example of Indo-Sarcenic art by Longhurst.

KEY ANS: Elephants Stables

Correct ANS: Padma Mahal

Reference: A Comprehensive History of Medieval India - Salma Ahmed Farooqui  page no 140

Read the book:
QNO 37: In which part of India, Has the Indo-Tibetan Border Police Headquarters been opened in April 2012?

KEY ANS : Bengal

Correct ANS : Bihar

Reference:  http://articles.timesofindia.indiatimes.com/2012-04-01/patna/31270140_1_itbp-personnel-indo-tibetan-border-police-sector-headquarters

QNO 39 : The number of members sworn in as Rajya Sabha Members in 2012 was

KEY ANS: Non of the above

Correct Answer: 50 Persons

Reference:
 http://www.jagranjosh.com/current-affairs/fifty-leaders-from-different-political-parties-sworn-in-as-the-member-of-rajya-sabha-1335358545-1

QNO 72: The kakatiya king who shifted the capital from Anumakonda to Warangal was

KEY ANS: Ganapatideva

Correct ANS: Rudradeva

Reference:   ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర - పి. రఘునాథ రావు పేజ్ నెంబర్ 12  &
                    ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేజ్ నెంబర్ - 235


QNO 75: The Sufi order which adopted regular yogic practices was

KEY ANS: Suhrawardi

Correct ANS: chishti

Reference: మధ్యయుగాల భారతదేశం - సతీష్ చంద్ర పేజ్ నెంబర్ 164

QNO 113:  Answer was given to ascending order but question was asked for descending order

QNO 115:  The first Governor General of British India

KEY ANS: Warren Hastings

Correct ANS: Bentinck

Reference:  Indian Polity - K. Laxmikanth  Page Number 1.4

Read the book:

QNO 133: Asoka released some prisoners on humanitarian grounds on his

KEY ANS: Conversion to Buddhism

Correct ANS: Coronation day

Reference:  Ashoka – D.R. Bhandarkar Page Number 10

Read te book:
http://books.google.co.in/books?id=hhlfSZLDjRsC&lpg=PP1&pg=PP1&output=embed

Paper 2 Objections:

QNO 98: The Dhavaleswaram Anicut was built in the year.
KEY ANS : 1853
Correct ANS: 1852
Reference : ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర - పి. రఘునాథ రావు పేజ్ నెంబర్ 84 

Paper 3 Objections:

QNO 7: In developing economies, foreign direct investment is a leading source of external financing that brings in capital and technical know-how into an economy and also increases its

KEY ANS: Competitiveness

Correct ANS: Economic Growth

Reference: భారత ఆర్ధిక వ్యవస్థ - సమస్యలు  - తెలుగు అకాడమి పేజ్ నెంబర్ 359

QNO 17: As per the Socio Economic Survey of Andhra Pradesh 2011-12 the advanced estimates, the Gross State Domestic Product has shown a growth of

KEY ANS: (-)1.54 percent

Correct ANS: 6.2 percent

According to Survey it was 6.81 percent

Reference: AP ECONOMIC SURVEY 2011-12 page number 22 page number 12

QNO 40: It has been made mandatory on the part of the rice millers in Andhra Pradesh that they should purchase paddy of fair average quality at a price not less than the minimum support price of

KEY ANS: 1100

Correct ANS : 1080 

Reference: AP ECONOMIC SURVEY 2011-12 page number 22

QNO 75: The work force participation rate per 1000 population on current daily status in rural areas of Andhra Pradesh State in 2009-10 is

KEY ANS: 501

There is no correct answer in optionals. Actual answer is 441

Reference: AP ECONOMIC SURVEY 2011-12 page number 323 Annexure - 9.3

TOWN & COUNTRY PLANNING (35/2011) FINAL KEY

GROUP 2 SERVICES (39/2011) PRIMARY KEY

Sunday, November 25, 2012

ఆంధ్రదేశంలో కులాల పుట్టుక – పెరుగుదల

క్రీ.శ. ౩౦౦ వరకు, అనగా శాతవాహనరాజ్యం చివరిరోజుల వరకు, వృత్తుల ప్రస్తావనే తప్ప కులం ప్రస్తావన దాదాపు లేదు. ధాన్యకటక బౌద్దస్తూపానికి ‘విధిక’ పేరుగల చెప్పులు కుట్టే వ్యక్తి కానుకలు సమర్పించినట్లు శాసనాధారం ఉంది. ఇతని తండ్రి ఉపాధ్యాయ. (బౌద్ద భిక్షువుకు ఒక పేరు) వీరిద్దరూ బౌద్ధులు. వైదిక, బౌద్దమతాలు పక్కపక్కనే సాగిన కాలమది. వారు వైదిక మతానుయాయులు.

౩వ శతాబ్ది మధ్యనుంచి ఆంధ్రదేశంలో ఆర్ధిక విప్లవం ఒకటి మొదలైంది. విదేశీ వ్యాపారం దాదాపు అంతమైంది. (రోమన్ సామ్రాజ్యం పతనం ఇందుకు ముఖ్యకారణం) పరిశ్రమలు మూలపడ్డాయి. ఇక్ష్యాకుల రాజధాని విజయపురిలో సైతం ఆనాటి పారిశ్రామిక అవశేషాలు కనపడవు. వ్యవసాయం వైపు దృష్టి మళ్ళింది. వాశిష్ట్టిపుత్ర చాంతమూల అను ఇక్ష్వకురాజు వేలాది నాగళ్ళను, పశువులను రైతులకు దానంచేసినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఆ పిమ్మట కృష్ణానదికి దిగువన ఉన్న పల్నాడు, వెలనాడు ప్రాంతం అంత కంచి పల్లవరాజుల పాలనకు లోనైంది. వారి పేరుతోనే పలనాడు అనే పేరు వచ్చింది. (పల్లవనాడు అని మొదటిపేరు) ఆ రాజులలో ఒకరు ‘కడువెట్టి’ అనే బిరుడుకలవాడు. ‘కడువెట్టి’ అనగా అడవులను నరికివేసినవాడు అని అర్థం. వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు అని స్పష్టమవుతుంది.

చేతివృత్తులు, వ్యాపారం సన్నగిల్లటంతో మారకం అవసరం తగ్గిపాయింది. ఏ గ్రామానికి ఆ గ్రామం ఏకాంతవాసం చేసే తత్వం ఆరంభంమైంది. లోహ పరిశ్రమ మూతపడ్డది. ఇక్ష్వాకు రాజులు రాగి నాణేలు విడుదల చేశారు. ఆ తర్వాత రెండు శతాబ్దాలకు (5-6 శతాబ్దాలు) కోస్తా జిల్లాలను పరిపాలించిన విష్ణుకుండిన రాజులు, రాగి లభించక ఇనుప నాణేలు జారిచేశారు. బౌద్ధం వెనుకపడింది. భక్తి ప్రధానమైన భాగవత దొరనితో కూడిన వైదికమతం లేక బ్రాహ్మణ మతం పైచేయి సంపాదించింది (బ్రాహ్మణ మతం అంటే బ్రాహ్మణులకే పరిమితమైనదని కాదు. వారి ఆచార్యత్వంలోవిస్తరించిన వైదికమతం అని అర్థం. చాతుర్వర్ణ వ్యవస్థ ఇందులోని ముఖ్యంశము).

పల్లవరాజులు గాఢ బ్రాహ్మణ మతాభిమానులు. కృష్ణకు దిగువ జిల్లాల్లో ఈ రాజులు పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మించారు. ( వానిలో కొన్ని ఈనాటికి ఉన్నాయి. చేబ్రోలు అలంటి వాటిలో ఒకటి) బ్రహ్మదేయం, దేవభోగం పేర్లతో బ్రాహ్మణులకు అగ్రహారాలు, దేవాలయాలకు భూములు ఇవ్వటం కూడా అప్పుడే మొదలయింది. వెలనాడు అంతటా ఇలాంటి దానదర్మలతో నిండి ఉంది. ప్రస్తుతం తెనాలి, రేపల్లె, బాపట్ల తాలూకాలను వెలనాడు అనేవారు. అంతవరకు వేరు వేరు వృత్తులు చేసే వారందరూ ఈ బ్రాహ్మణాగ్రహారాలలో వ్యవసాయదారులుగా స్థిరపడసాగారు. వీరందరికీ ఆనాటినుంచీ శూద్రులు అనే పేరు వాడుకలోకి వచ్చింది. వీరే నాలుగో వర్ణం.
ఈ కాలంలో బ్రాహ్మణులూ పౌర, సైనిక వృత్తులు కూడా స్వికరించేవారు. ఇక్ష్వాకుల ఆస్థానంలో ‘భోదిసిరి’ ‘భద్రబోదిశర్మ’ అనే బ్రాహ్మణులు కోశాదికారులుగా ఉండేవారు (బౌద్దమత చిహ్నమైన బోధి బ్రాహ్మణమత చిహ్నమైన శర్మ కలిసి ఈ పేర్లు ఏర్పడిన విషయం గమనిచాలి).

అభీర రాజు ఆస్థానంలో (అభిరులు పశ్చిమ తెలంగాణా ప్రాంతంలోని స్థానిక పాలకులు) భరద్వాజ గోత్రానికి చెందిన శివశర్మ ‘మహాశ్రామిక’, ‘మహాతలవారి’, ‘మహాదండనాయక’ బిరుదు ధరించి విజయపురిపై దండెత్తిన సేనలకు నాయకత్వం వహించాడు. ఇదే గోత్రానికి చెందిన తిష్యశర్మ, మంత్రిగా ఉండేవాడు. ధర్మశర్మ, ఆర్యభూతి, అని మరికొందరి పేర్లుకూడా కనిపిస్తాయి. ధర్మశర్మ యుద్దంలో చనిపోగా అతని స్మృత్యర్థం ‘ఛాయస్తుపం’(సమాధిస్తుపం) నిర్మించబడ్డది. బ్రాహ్మణులు ౩ వృత్తులలోకి విభజితులైనారు. ఒకటి వైదిక పండితులు, రెండు దేవాలయ పూజారులు, మూడు ప్రభుత్వోద్యోగులు.

సామాజిక ఊర్ద్వ చలనం :

క్రీ.శ. 250, 500 మధ్య కృష్ణకు ఎగువ భాగాన విష్ణుకుండినులు పరిపాలించారు. వీరు దేవాలయ నిర్మాణం కంటే మౌలికమైన యజ్ఞయాగాదులు నిర్వహించాసాగారు (యజ్ఞాలు వైదికకర్మలకు, దేవాలయ నిర్మాణం భాగవత భక్తి ధోరణికి చిహ్నాలు). వీరి రాజధాని నగరాలు విజయవాడ, నల్గొండ జిల్లాలోని ఇంద్రపాలనగరం. వీరు తొలుత ఆటవిక తెగల వారై ఉండి, సంసృతీకరణ క్రమంలో వైదికులరాజులై క్షత్రియ చిహ్నమైన ‘వర్మ’ బిరుదు ధరించారు. సామాజిక ఆరోహనక్రమానికి బ్రాహ్మణత్వంచే ఆమోదం పొందేందుకుగాను, యజ్ఞయాగాలు విపరీతంగా చేశారు. ఈ రాజులలో మాధవవర్మ నరమేథం కూడా చేశాడని చెప్తారు. వీరింతిపేరు పూసపాటి. విజయనగరం పాలకులైన పుసపాటివారు మాధవవర్మను తమ వంశాకర్తగా చెప్పుకుంటారు. తెగలకు చెందినవారిని వర్ణవ్యవస్థలో భాగంగా చేసేందుకు ‘వ్రాత్యస్తోమం’, ‘హిరణ్యగోగర్భవ్రతం’ లాంటి కర్మకాండలు అప్పటికే రూపొందాయి. వైదిక బ్రాహ్మణులకు ఈ వ్రతాలద్వారా విస్తారంగా దానధర్మాలు చేసి అగ్రహారాలు ఇవ్వటం, వారు వీరికి క్షత్రియత్వం ఇచ్చి ద్విజులుగా గుర్తించటం అనాదిగా వస్తున్న ఆచారం. విష్ణుకుండినులేకాదు ఆ తర్వాత ఆంధ్రలో రాచరికం నిర్వహించిన వారందరూ ఇలాంటి క్షత్రియులే.

ఆటవిక తేగలవారందరూ మొదట బౌద్ధం స్వీకరించారు. ఒకటి రెండు తరలవరకు సాత్విక సంస్కారం పొందారు. పిమ్మట వర్ణవ్యవస్థలో పై స్థాయికి చేరుకున్నారు. ఆటవిక తెగల సంసృతీకరణకు మొదట్లో బౌద్ధం, తర్వాత జైనం నిచ్చేనమేట్ట్లుగా ఉపకరించాయి.

ఈ విదంగా సంసృతీకరణ పొందిన వారు కొందరు బ్రాహ్మణత్వం కూడా సాధించారు. కొండముది శాసనాలలో గోగిరాజు, మైదవోలు శాసనంలో గోనమద్విజ, పికిరో శాసనంలో విలశర్మ వీరంతా ఆటవిక తేగాలనుంది బ్రాహ్మణత్వం పొందిన వారని స్పష్టపడుతుంది. వీరందరికీ గోత్రం కశ్యప గోత్రం సంకీర్ణనతో ద్వారా బ్రాహ్మణత్వం పొందిన వారి కొరకు ప్రత్యేకంగా ఏర్పరిచిన గోత్రం ఇది. కొందరు బ్రాహ్మణులు తమ పేర్ల చివరలో ‘శర్మ’, ‘ఆర్య’ అను రెండుపదాలు చేర్చుకున్నారు. భావశర్మార్య, భట్టి శర్మార్య పేర్లు అందుకు నిదర్శనాలు. తమ బ్రాహ్మణత్వాన్ని ఎవరు ప్రశ్నిచకుండా దృడమైన సాక్షాధారాలు ఏర్పరుచుకున్నారు.

దక్షిణాది బ్రహ్మణులందరూ దాదాపు ఈవిధంగా ద్రావిడ ఆటవిక పునాదులనుంచి పైకి ఎగబ్రకినవారే. వీరంతా ఉత్తరాదినుంచి వచ్చిన బ్రాహ్మణులు అనుకోవటం పొరపాటు. తోలిరోజులలో కొందరు అలా వచ్చినమాట నిజమే. వారు సైతం ఉత్తరాదిన క్రింది శ్రేణి నుండి పైకి ఎగబ్రకినవారే. వేదకాలం నుండి నేటివరకు ఏ వర్ణమూ అవిచిన్నంగా లేదు. ప్రతీదీ సంకర వర్ణమే. ఈ వాస్తవాన్ని అంగీకరించటానికి, తెచ్చిపెట్టుకున్న ఆధిక్యతా భావం ప్రతి వర్ణానికి, కులానికి అడ్డువస్తున్నది. వర్ణ వ్యవస్థలోని మౌలికమైన విశాబీజం ఇదే.

వేంగీ చాళుక్యులు:

కోస్తా జిల్లాల్లో వేంగీ చాళుక్య రాజ్యం ఏర్పడటంతో నిజమైన మద్యయుగాలు ఆరంభమైనాయి. (క్రీ.శ. 600-1000) పశ్చిమ చాళుక్యుల సేనానులుగా వచ్చి కోస్తా జిల్లాలను ఆక్రమించుకొని తూర్పు చాళుక్యులు లేక వేంగీ చాళుక్యులు అని ప్రసిద్ది చెందారు. వీరు మొదట్లో జైనులు. పిమ్మట శైవులైనారు. మొదట వీరి భాష కన్నడం. పిమ్మట తెలుగే తమ మాతృభాషగా భావించారు. ఆవిధంగా వీరు తెలుగు భాషకు గొప్ప సేవచేశారు.

మొదటి తెలుగు శాసనం, తెలంగానలోనుకాక, కోస్తా జిల్లాలలో కాక రేనాటి సీమ అయిన కడప జిల్లాలో లభించింది. ఆర్ధిక విధానంలో వ్యవసాయం అతి ప్రధానస్థానం ఆక్రమించి స్వయం సంపూర్ణ గ్రామవ్యవస్థ రూపొందసాగింది. రాజులమద్య నిరంతర యుద్దాలు నిత్యకృత్యమైనాయి. పరిపాలన యంత్రాంగమంతా సైనికావసరాల దృష్ట్యా రూపాంతరం చెందింది. మతం కొన్ని మూడాచారాల పట్టింపుగా మారిపోయింది. భాష, విద్య, శిల్పం, అంతా మతంతో గాడంగా పెనవేసుకుపాయింది. ఈ కాలంలోనే దాదాపు కోస్తా జిల్లాలోని ఆటవిక తెగలందరూ వర్ణవ్యవస్థలో ఎదో ఒకచోట తలదూర్చారు. సంసృతీకరణ, సామాజిక ఆరోహణ నిరాఘాటంగా సాగిపాయింది. వృత్తి విభజన మతంతో శాఖభేదాలు విస్తరించాయి.

అగ్రహారాల సంఖ్యా విపరీతంగా పెరిగింది. కర్మ రాష్ట్రంలో ఆలుగురాజు, అటవీ దుర్జయ మొదలైనవరందరూ స్తానిక పాలకులు. కర్మ రాష్ట్రం అంటే కృష్ణకు దిగువన ఉన్న నరసరావుపేట, గుంటూరు, సత్తెనపల్లి, వినుకొండ, పల్నాడు ప్రాంతం. క్రమంగా ఈ మాట కమ్మనాడుగా మారిపాయింది. అలుగురాజు వంశస్తుడే పల్నాటి యుద్దంలో కీలకస్థానం వహించిన నలగామరాజు.

వేంగీ చాళుక్యులలో మొదటివాడు కుబ్జ విష్ణువర్ధనుడు. (ఇతనికి కొంచెం గూని ఉండేది. కనుక కుబ్జ అనే విశేషణం వచ్చింది) ఇతడు, ఇతని వంశస్థులు కంచి పల్లవులతో నిరంతరం యుద్దాలు చేయవలసి వచ్చింది. వేంగీ దేశానికి(ఏలూరు ప్రాంతం, గోదావరి, కృష్ణా, మద్యస్థ ప్రాంతం అంతా వేంగీ మండలం) కంచికి మద్య నెల్లూరు ప్రాంతంలో బోయలు రాజ్యం చేస్తుండేవారు. వీరు భయంకరమైన ఆటవిక పోరాట యోధులు. నాలుగు శతాబ్దాల క్రమంలో వీరు చాళుక్య రాజులచే ఓటమిచెంది వైదికమతం స్వీకరించి వర్ణవ్యవస్థలో భాగస్తులైనారు. బ్రాహ్మణ, వైశ్య, శూద్ర వర్ణాలు మూడింటిలోనూ వీరు చేరిపోయారు. ఈ కాలంలోనే బోయ బ్రాహ్మణులు అనే మాట ఏర్పడ్డది. క్రమంగా బోయ అనేమాట అంతరించి బ్రాహ్మణులు అనే మాటే మిగిలింది. ఇదేవిదంగా పశ్చిమ తెలంగాణ నుంచి రాష్ట్రకూటులు నిరతరం వేంగీ చాళుక్యులపై యుద్దాలు చేస్తుండేవారు. ఈ క్రమంలో వారు తెలంగాణలోని పులిందులు అను తెగవారిని వర్ణవ్యవస్థలో భాగస్వాములు చేశారు. సైనికదాడులు, సాంసృతిక సమన్వయం పక్క పక్క నే సాగిన కాలమిది. ఈవిధంగా ఆంధ్రదేశంలో పెక్కు తెగలు వైదికమతంలో భాగస్వాములైనారు. వీరిలో కొందరు (బోయలు, పులిందులు) సుటిగాను మరికొందరు జైనం అనే నిచ్చెన మేట్లద్వారాను వర్ణవ్యవస్థలో చేరిపోయారు. మొదట జైనులై తరువాత హిందువులైన వారిలో ముఖ్యులు కోమట్లు. కోమటి అనే పేరు గోమటేశ్వరుని ద్వార వచ్చింది. ఆనాడు మెదక్ జిల్లా బోధన్ లో బ్రహ్మాండమైన గోమటేశ్వర విగ్రహం ఉండేది. పిమ్మట అది ద్వంసం అయింది. దాని నమూనాలో నిర్మితమైన గోమటేశ్వర విగ్రహం ఇప్పటికి శ్రావణబెళగోలలో ఉంది. కోమట్లు మాత్రమేగాక చేతివృత్తులవారందరూ, కంసాలి, కమ్మరి, కంచరి, కాశే, వడ్రంగి వీరిని పంచాసనంవారు అంటారు. అంటే ఐదురకాల చేతివృత్తులు చేసేవారు. వీరంతా మొదట్లో జైనులు. పిమ్మట వర్ణవ్యవస్థలో భాగమై హెచ్చుమంది శైవులైనారు.

పెనుగొండులోని కన్యకగాథ, కన్యక అగ్నిగుండంలో దూకి ఆత్మార్పణ చేసుకోవడం అంత జైన సల్లెఖనాచారానికి దగ్గరగా ఉంది. రాజులే శైవులైతే ప్రజలు శైవులు కాక తప్పదు. ఈ క్రమంలో అనేక కులనామాలు ఏర్పడ్డాయి. సెట్టి, నాయుడు, నీడు, నాయక, రెడ్డి మొదలైనవి. ఈ మాటలన్నీ పల్నాటి చరిత్రలో ప్రస్తావించబడిన విషయం తెలిసిందే(బ్రహ్మనాయుడు, మల్నీడు).

మరొక పరిణామం జరిగింది. సేననాయకులకు, వీరులకు గ్రామాలు, గ్రామా సముదాయాలు దానం చేసే పద్ధతి మొదలైంది. ఆయుధోపజీవులకు సమాజంలో అగ్రస్థానం లభించింది. వీరు యుద్దసమయంలో సైనికులు, శాంతియుత పరిస్థితులలో రైతులు.

కమ్మ, వెలమ, రెడ్డి కులాలు:

ఈ చారిత్రక నేపథ్యంలోనే ఆంధ్రదేశంలో కమ్మ, వెలమ, రెడ్డి కులాలు రూపొంది ప్రముఖస్థానం వహించాసాగాయి.
వెలమలు అను పేరు వెలనాడు నుండి వచ్చింది(తెనాలి, రేపల్లె, బాపట్ల తాలూకాలు) ఆప్రాంతంలో వీరు రైతులుగా, భూస్వాములుగా, సాహసికులైన వీరులుగా రూపొందారు. దక్షిణాదిన అప్పటికే ప్రారంభమైన వైష్ణవ ఆళ్వారుల భక్తి ఉద్యమ ప్రభావం వీరిపై పడ్డది. వెలనాటి గొంకరాజు నాటి పాలకుడు. ఇలా ఉండగా కన్నడంలో మొదలైన వీరశైవ ఉద్యమం ప్రభావం కోస్తా జిల్లాలపై పడింది. గోదావరి జిల్లాలకు చెందిన మల్లికార్జున పండితారాధ్యుడు వెలనాడు వచ్చి బౌద్దులను ఓడించినట్లు చరిత్రలో ఋజువులున్నాయి. బౌద్ధులు పారిపోయారు. శైవం పైచేయి సాదించింది. శైవులు అవలంబించిన కుటిల పద్దతులతో వెలనాడు అంతా మతకలహాలు మొదలయినాయి. వ్యవసాయం మూలపడ్డది. అగ్రహారాలు పాడుపడ్డయి. ఈ కల్లోలాన్ని తట్టుకోలేక ఆయుధోపజీవులైన వెలమలంతా మూకుమ్మడిగా తెలంగాణకు తరలిపోయారు. దేవరకొండ, రాచకొండ లాంటి ప్రాంతాలకు పాలకులైనారు. బ్రాహ్మణులు కృష్ణను దాటి గోదావరిని దాటి తూర్పు ప్రాంతాలకు తరలి వెళ్లారు. వెలనాటి బ్రాహ్మణులు హెచ్చుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉండటానికి అదే కారణం. వేంగీ చాళుక్యులు ఈ పరిణామానికి దోహదంచేసి ఈ బ్రాహ్మణులకు విస్తారంగా అగ్రహారాలు ఇచ్చారు. తొమ్మిదవ శతాబ్ది నుండి కోస్తా జిల్లాలో దేవాలయ నిర్మాణం తిరిగి పుంజుకుంది. చాళుక్య విజయాదిత్యుడు (క్రీ.శ.850) ఉభయ గోదావరి జిల్లాలలో 108 శివాలయాలు నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ద్రాక్షారామం,క్షీరారామం, అమరారామం, ఇత్యాది శైవ క్షేత్రాలన్నీ అలా రూపొందినవే. వీటిలో హేచ్చుభాగం అంతకుముందున్న బౌద్ద స్తూప శిథిలాలపై నిర్మించబడ్డయి. మత విద్వేషం ఆ స్థాయిలో ఉండేది.

జైనం ప్రజా మతం. జైన సారసత్వం హెచ్చుగా ఉండేది. అక్షరాలు చేక్కేవారందరూ జైనులైన విశ్వబ్రాహ్మణులు. అక్షరాభ్యాస సమయంలో ‘ఓం నమః శివాయ సిద్దం నమః’ లో సిద్దుడు జైన గురువు. శివాయ అనుమాట తరువాత చేరింది.

జైనమత ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సంసృత పురాణాలను తెలుగులో అనువదించే కృషి మొదలైంది. రాజరాజనరేంద్రుని ప్రోత్సాహంతో నన్నయ ఆంధ్ర మహాభారతా అవతరణ అలా జరిగింది. అంతకు ముందు ప్రజలు “గాసట బీసటే చదివి గాథలు తవ్వేవారని” నన్నయగారే చెప్పారు. జైన గాథలు, గ్రంథాలు ప్రచారంలో ఉండేవన్నమాట అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి.

పల్నాటియుద్దం ‘కులంపోరు’ అంటారు. కేవలం కులం పోరు కాదు. మతం పోరుకూడ. ఈ రెండు పేర్లతో సాగిన అధికారం కొరకు పోరు. అలుగురాజు వద్ద పెద్దినాయుడు, అతని కుమారుడు బ్రహ్మనాయుడు మంత్రులు. బ్రహ్మనాయుడిని మంత్రి పదవి నుండి తొలగించి నాగమ్మ మంత్రి అయింది. నాగమ్మ రెడ్డి వంశస్తురాలు. రెడ్డ్లు అప్పటికే వీర శైవంను అభిమానించారు. బ్రహ్మనాయుడు ‘వీరవైష్ణవం’ అభిమానించాడు. కులాలన్నిటినీ చెరిపి చాపకూడు, వర్ణానంతర వివాహాలు, హరిజన పూజారిత్వం ఏర్పరిచాడు. (మాచర్ల చెన్నకేశవ దేవాలయంలో హరిజనులు పూజారులు) ఈ తీవ్ర సంస్కరణలు శైవులకు ఇష్టం లేదు. శైవులు కూడా మొదట్లో బ్రాహ్మణ మతంపై తిరుగుబాటు చేసినవారే. కానీ ఒక చోట ఆగిపోయారు. బ్రహ్మనాయుడు ఇంకా ముందుకు వెళ్ళాడు. ఇవన్ని పల్నాటి యుద్దానికి కారణాలు. యుద్దంలో బ్రహ్మనాయుడు ఓడిపోయాడు. అతని అనుచరులంత వెలమకులంలో చేరిపోయారు. హెచ్చుమంది తెలంగాణకు వెళ్లి కాకతీయుల ఆశ్రయం పొందారు.

రెడ్డి అనేమాట ఎలా పుట్టిందనేది చెప్పటం కష్టం. అదొక గౌరవపదంగా అదికార దర్పానికి సూచకంగా ఆనతి నుండి వస్తున్నది. రాష్ట్ర కూటులు తెలుగు దేశం వచ్చి స్థిరపడి క్రమంగా రెడ్లుగా మారారని ఒక వాదన ఉంది.

కాకతీయుల కాలంలో గజసేనాధ్యక్షుడైన జాయపసేనాని కమ్మ కులానికి మూలపురుషుడు. కమ్మ అంటే లేఖ. కాకతీయుల వద్ద వారు లేఖకులుగా ఉండి క్రమంగా పాలకులైనందున వీరికా పేరు వచ్చినట్లు కొందరంటారు. ఒక కమ్మ ద్వారా జాయపసేనానికి గజసైన్యాదిపత్యం రావడంతో ఆ పేరు స్థిరపడి ఉండవచ్చు. వీరి రాజ్యం కృష్ణానది దక్షిణ తీరాన రేపల్లె తాలుకా ప్రాంతం. జాయపసేనాని వంశస్థులు క్రమంగా విస్తరించిన మీదట ఇదంతా కమ్మనాడు అనే పేరు వచ్చింది. ఆ ప్రాంతంలో నివసించిన బ్రాహ్మణులకు కమ్మనాటి బ్రాహ్మణులు, కమ్మ బ్రాహ్మణులు అనే పేర్లు కూడా కొంతకాలం వ్యాప్తిలో ఉండేవి.

ముస్లిం నవాబుల కాలంలో ఉత్తరాదినుండి కాయస్థులు వచ్చి ఎక్కువగా హైదరాబాదు లో స్థిరపడ్డారు. డీల్లి నవాబుల పాలన మొదలైనప్పటి నుండి వారి వద్ద లేఖఖ ఉద్యోగాలలో ప్రావీణ్యం సంపాదించి ఉన్నత పదవులు పొందిన వారు కాయస్థులు. బీహార్, బెంగాల్ రాష్ట్రాలలో నేటికి వీరి సంఖ్య హెచ్చు.

ఈ నాటికి మన సాంసృతిక జీవితాన్ని విషపూరితం చేస్తున్న వేయిపడగల విషసర్పమైన కులతత్వం పుట్టిన తీరు ఇది.

Saturday, November 24, 2012

Notification No. 46/2011 Town Planning Assistants Key Released

NOTIFICATION NO 42/2011 CIVIL ASSISTANTS SURGEONS KEY RELEASED


• Key for Notification No. 42/2011 , Date:29/12/2011 , Civil Assistant Surgeons :: Paper-2 Series: A 554-MED.SCIENCE& GEN.MEDICINE


• Key for Notification No. 42/2011 , Date:29/12/2011 , Civil Assistant Surgeons :: Paper-I Series:A 500-GENERAL STUDIES



SUBMIT OBJECTIONS ON KEY
                                                    

Certificate Verification List for Notification No. 53/2011 Dt: 31/12/2011 , Junior Accountant, Junior Assistant,Junior Stenographers and Typists in A.P. Vaidya Vidhana Parishad

VERIFICATION DATE : 28/11/2012

http://website.apspsc.gov.in/Documents/CERTIFICATE%20VERIFICATION%20LIST/10.pdf

డిసెంబర్‌లో సర్కారీ కొలువుల జాతర

వి.ఆర్.ఓ., వి.ఆర్.ఎ పోస్టుల భర్తీకి సన్నాహాలు

కనివినీ ఎరుగని రీతిలో 12 లక్షల మంది అభ్యర్ధులు పోటీపడిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ 2011 భారీ రిక్రూట్‌మెంటు ప్రక్రియను ఇటీవలే ప్రధాన భూ పరిపాలన కార్యాలయం (సిసిఎల్‌ఎ) పూర్తి చేసింది. ఉభయ ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్ధులు వి.ఆర్.ఓ, వి.ఆర్.ఎ ఉద్యోగ బాధ్యతల్లో చేరి ఆరు నెలలు కావస్తోంది. తాజాగా 1300 కొత్త వి.ఆర్.ఓ పోస్టులు, 3600 వి.ఆర్.ఎ పోస్టులకు క్లియరెన్స్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ప్రకటించి రిక్రూట్ మెంటు చేపట్టేందుకు సంస్థాగతంగా మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా? తెలపాలంటూ సిసిఎల్‌ఎ అధికారులను రాష్ర్ట ఆర్థికశాఖ అధికారులు కోరినట్టు తెలిసింది. కేంద్రీకృత పద్ధతిలో సిసిఎల్‌ఎ యంత్రాంగం వి.ఆర్.ఓ, వి.ఆర్.ఎ పోస్టుల భర్తీని ప్రత్యేకంగా రిక్రూట్‌మెంటు విభాగం ఏమి లేకున్నప్పటికీ యుద్ధప్రాతిపదిక పూర్తి చేయకలిగింది.

నెలరోజుల్లో స్పష్టత : కొత్త వి.ఆర్.ఓ, వి.ఆర్.ఎ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు సిసిఎల్‌ఎ అధికారులు ఇచ్చే సమాచారంపై ఆధారపడి ఉంటాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనగానే ఆర్థిక అంశంతో ముడిపెట్టి చూస్తున్న పరిస్థితిని పక్కకు నెట్టిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి సర్కారీ కొలువుల జాతరకు తెరతీసి నట్లుగా అనుమతులు ఇస్తు న్నారు. ఈ నేపథ్యంలో బంగ్లావాచర్ వంటి అతి చిన్న పోస్టు నుంచి గ్రూప్-1 వంటి ఎగ్జిక్యూటివ్ పోస్టు ల వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుపడమే తరువాయి రాష్ర్ట ప్రభు త్వం అనుమతి ఇస్తూపో తోంది. ఇదే సమయంలో రాజీవ్ యువకిరణాలు పేరిట ప్రైవేటు రంగం లోనూ యువతకు ఉద్యోగాలు ఇప్పిం చేందుకు, పెద్ద ప్రయత్నం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, కొత్త వి.ఆర్.ఓ, వి.ఆర్.ఎ పోస్టుల భర్తీపై మరో నెలరోజుల్లో సిసిఎల్‌ఎ సిఫారసు మేరకు రాష్ర్ట ప్రభుత్వం అనుమతివ్వనుందని అధికారుల ద్వారా తెలిసింది.

డిసెంబర్‌లో మరో 6వేల కానిస్టేబుల్స్ తాజా నోటిఫికేషన్

రాష్ర్ట స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి మళ్ళీ కానిస్టేబుల్స్ కొత్త నోటిఫికేషన్ అభ్యర్ధుల ముందుకు రానుంది. రాబోయే కొత్త నోటిఫికేషన్‌లో 6 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి. హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన కానిస్టేబుల్ ఖాళీలు 2500, పలు జిల్లాలలో మహిళా అభ్యర్ధులకు సంబంధించిన ఖాళీలు 2,700, ఇతర జిల్లాలో అభ్యర్ధులు లేక మిగిలిపోయిన కానిస్టేబుల్ పోస్టులు 200 వరకు ఉన్నాయని పి.ఆర్.బి. అధికారుల ద్వారా తెలిసింది.ఇటీవల జరిగిన 17 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో స్థానిక అభ్యర్ధులు దొరకక మిగిలిన పోస్టులు, అటు మహిళా అభ్యర్ధులు లేక మిగిలిన పోస్టులు దాదాపు 6 వేల ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఇప్పటికే సంబంధిత పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఉన్నందున, అలాగే చేతిలోని కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినందున వెంటనే 6వేల కానిస్టేబుల్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ప్రకటించాలని పి.ఆర్.బి. అధికారులు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీపై కొంతమంది హోంగార్డ్ అభ్యర్ధులు ట్రిబ్యునల్‌లో కేసు వేసినందున అది తొలిగిన వెంటనే 6 వేల కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్ వెలువడనున్నది. రాబోయే 6 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తాన్ని 6 నెలల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు పిఆర్‌బి అధికారులు వివరించారు. గతంలో పలు రిక్రూట్‌మెంట్లు ఏక సమయంలో చేపట్టిన దృష్ట్యా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. తాజాగా చేతిలోని ఇతరేతర రిక్రూట్‌మెంట్ ప్రక్రియలు చాలా వరకు పూర్తి అయ్యాయి. ఇంకా ఎస్.ఐ వంటి పోస్టులకు రాత పరీక్ష నిర్వహణ, ఫలితాలు ప్రకటించటం వంటి కీలక బాధ్యతలు పి.ఆర్.బి. పరంగా ఉన్నాయి. ఇక వార్డర్స్ ఇంటర్వ్యూలు పూర్తి అయిన తర్వాత సదరు జాబితా అందుకున్న వారం రోజుల్లో వార్డర్స్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్ధుల జాబితా ప్రకటించనున్నట్లు పి.ఆర్.బి. అధికారులు వివరించారు. అలాగే డిప్యూటీ జైలర్స్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్ధులకు జైళ్ళశాఖ ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంటుంది.

డిసెంబర్‌లో డిప్యూటీ జైలర్స్ రాతపరీక్ష ఫలితాలు ప్రకటిస్తే ఆపై నెలలో సదరు అభ్యర్ధులకు జైళ్ళ శాఖ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మొత్తంమీద డిసెంబర్, జనవరి కల్లా జైళ్ళ శాఖ ఉద్యోగాల భర్తీ పూర్తి కానుందని చెప్పవచ్చు. ఏ ఉద్యోగాల భర్తీలో నయినా తుది ఫలితాలు ప్రకటించిన తర్వాత భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులు ఎన్ని ఉన్నా అవి క్యారీ ఫార్వార్డ్‌గా కొత్త నోటిఫికేషన్‌లో ప్రకటించాలని రాష్ర్ట సబార్డినేట్ సర్వీసు రూల్సు స్పష్టం చేస్తున్నాయి. ఎంపికయిన అభ్యర్ధులు పోస్టులలో చేరకుంటే, లేదా ఉద్యోగాలు వద్దనుకుంటే సదరు ఖాళీలలో దిగువ స్థానంలోనున్న అభ్యర్ధులను ఎంపిక చేసేలా వెయిటింగ్ ఆపరేట్ చేయకూడదనే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకా కానిస్టేబుల్ పోస్టులు జిల్లా స్థాయి క్యాడర్‌కు సంబంధించినవి. అంటే జిల్లా ప్రాంతాన్ని యూనిట్‌గా చేసుకుని కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు. జిల్లాలో ప్రకటించే మొత్తం ఖాళీలలో 80 శాతం పోస్టులు స్థానిక అభ్యర్ధులకు రిజర్వ్ చేస్తారు. మిగతా 20 శాతం కానిస్టేబుల్ పోస్టులలో స్థానికులు లేదా ఇతర జిల్లాల అభ్యర్ధులు ఎవరైనా రాత పరీక్ష మెరిట్‌తో ఎంపిక కావచ్చు. హైదరాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ పోస్టులకు స్థానిక అభ్యర్ధులు దొరకక 2,500 పోస్టులు మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన రాజీవ్ యువకిరణాలు పథకం సమీక్ష సమావేశంలో హైదరాబాద్ కానిస్టేబుల్ పోస్టులు, మహిళా కానిస్టేబుల్ పోస్టులు భర్తీకాని విషయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఈ పోస్టులపై స్థానికంగా పోటీపడే అభ్యర్ధులు లేదా మహిళా అభ్యర్ధినిలకు ప్రత్యేక శిక్షణ అవకాశాలు రాజీవ్ యువకిరణాలు ద్వారా అందించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ దిశగా రాబోయే కానిస్టేబుల్ పోస్టులు మొత్తం భర్తీ కావడానికి రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందనే చెప్పాలి.

పరుగు పందాలకు రెడీ అవుతున్న ఎక్సయిజ్ కానిస్టేబుల్స్

ఎక్సయిజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా ఎక్కడికక్కడ ఆయాజిల్లా ప్రాంతాలలో డిసెంబర్ 1 నుంచి ఎక్సయిజ్ కానిస్టేబుల్స్ పరుగుపందెం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎక్సయిజ్ కమిషనరేట్ అధికారులు తెలిపారు. ముందుగా మహిళా అభ్యర్ధులకు పరుగుపందెం పోటీలు నిర్వహించాలని ప్రతిపాదనలు ఉండగా, తక్కువ సంఖ్యలో మహిళా అభ్యర్ధినిలు పోటీపడినందున ముందుగా పురుష అభ్యర్ధులకు పరుగు పందెం పోటీలు నిర్వహించాలని ఎక్సయిజ్ కమిషనరేట్ అధికారులు నిర్ణయించారు. రోజుకు 1000 మంది అభ్యర్ధులకు పరుగు పందెం పోటీలు పూర్తి చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. నెలన్నర రోజులపాటు కొనసాగనున్న పరుగుపందెం పోటీలు జనవరి 15 వరకు జరిగేలా షెడ్యూల్స్ రూపొందించారు.

2606 పోస్టులు 4.6 లక్షల అభ్యర్ధులు ః శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్ధులే యూనిఫాం ఉద్యోగాలకు పోటీపడే అవకాశాలుంటాయి. ఈ శారీరక ప్రమాణాలు అనగానే చాలామంది అభ్యర్ధులు వెనుతిరుగుతారు. ఇటువంటి పరిస్థితి ఎక్సయిజ్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడుతున్న అభ్యర్ధుల సంఖ్యను బట్టి చూస్తే లేదనే చెప్పాల్సి వస్తోంది. కేవలం 2606 ఎక్సయిజ్ కానిస్టేబుల్ పోస్టులకు భారీ సంఖ్యలో 4.6 లక్షల మంది అభ్యర్ధులు పోటీపడటం రికార్డ్‌గా చెప్పవచ్చు. అంటే ఒక పోస్టుకు దాదాపు 180 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నట్టే. ఇటీవల పి.ఆర్.బి. నిర్వహించిన 17 వేల ఖాళీలు గల కానిస్టేబుల్ పోస్టులకు 4 క్షల మంది అభ్యర్ధులే పోటీపడగా, ఈ సంఖ్యకు మించి అభ్యర్ధులు 2606 ఎక్సయిజ్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడడం గమనార్హం.

రంగారెడ్డి టాప్ : 192 ఖాళీలు గల రంగారెడ్డి జిల్లాలోని ఎక్సయిజ్ కానిస్టేబుల్ పోస్టులకు రాష్ర్టంలోనే అత్యధిక సంఖ్యలో 32,470 మంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు. విశేషం ఏమంటే అత్యధికంగా 240 ఎక్సయిజ్ కానిస్టేబుల్ ఖాళీలు గల కృష్ణా జిల్లా 30,841 అభ్యర్ధులతో రెండవ స్థానంలో ఉంది. ఇక మూడవ స్థానంలో ఉన్న మహబూబ్‌నగర్‌లోని 141 ఎక్సయిజ్ కానిస్టేబుల్ ఖాళీలకు 29,331 మంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు. అత్యంత తక్కువగా 27 ఎక్సయిజ్ కానిస్టేబుల్స్ గల ప్రకాశం జిల్లాలో 5,075 మంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో 1 పోస్టుగల ఎస్.టి.మహిళా కేటగిరిలో 29 మంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు.

Friday, November 23, 2012

త్వరలో జూనియర్ లెక్చరర్స్ బంపర్ నోటిఫికేషన్

సమాజంలోని అత్యంత బాధ్యతాయుత వృత్తుల్లో అధ్యాపక వృత్తి ఒకటి. పదో తరగతి పూర్తి చేసి కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులకు కెరీర్ పరంగానే కాకుండా సమాజానికి అవసరమైన విధంగా సరైన దిశలో నడిచేందుకు మార్గ నిర్దేశం చేసే జూనియర్ లెక్చరర్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో వాటి వివరాలు...

- సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ : సాంకేతిక నైపుణ్యంతో ఒక చోట ఉండి ఖండాంతరాల పనిని చక్కబెట్టే ఆధునిక ఉద్యోగం

- చార్టెడ్ అకౌంటెంట్ : కంపెనీల వ్యాపార లావాదేవీలకు గణాంకాలు రూపొందించి చట్టబద్ధత అందించే అరుదైన పోస్టు.

- న్యాయవాది : పేదవాడి నుంచి కుబేరుడి వరకు కేసులు వాదించి గెలుపే లక్ష్యంగా న్యాయ పోరాటం చేసే ప్రత్యేక ఉద్యోగం.

- పోలీసు ఆఫీసర్ : ప్రజలకు అవసరమైన భద్రతకు తొలి వారధిగా తన రక్షణను సైతం మరచి ఎదురొడ్డి నిలిచే ఉద్యోగి.

ఇలాంటి ప్రత్యేక ఉద్యోగాలు అయినా లేదా ఇతర వృత్తులు అయినా వాటికి ఇంటర్మీడియటే పునాది. ఇంటర్మీడియట్‌లో చేరి తమ లక్ష్యం కోసం కృషి చేసే వేలాది మంది యువత చేయి పట్టి నడిపించి పాఠాలు బోధించే కీలక వ్యక్తి జూనియర్ లెక్చరర్. పట్టణ ప్రాంతాలకు చెందిన చదువుకున్న తల్లిదండ్రుల పిల్లలకు ఇంటర్ ఎందుకు చదువుతు న్నామో తెలుసు. కానీ పల్లెటూరు నిరక్షరాస్యుల కుటుంబం నుండి వచ్చి ఇంటర్‌లో చేరిన విద్యార్థులకు ఆ చదువులు ఎలా పనికి వస్తాయో తెలియని పరిస్థితి. ఇటువంటి ఎంతోమందికి ‘‘బతుకు బాట’’ వేసి వారిని ఉత్తేజపరిచి ఉత్తమ కెరీర్‌లో స్థిరపడేలా అవకాశం కల్పించే అరుదైన ఉద్యోగం జూనియర్ లెక్చరర్. కనీవినీ ఎరుగని రీతిలో భారీ సంఖ్యలో జూనియర్ లెక్చరర్ ఖాళీలకు ప్రభుత్వం త్వరలో కొత్త నోటిఫికేషన్ ప్రకటించనున్నది.

వృత్తి స్వభావం

జూనియర్ లెక్చరర్‌గా ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్దేశిత సబ్జెక్టు పాఠాలు బోధించాలి. ఏడాదిలో 365 రోజులలో 224 రోజులు కాలేజీలో పాఠాలు బోధించి సిలబస్ పూర్తి చేయాలి. సాధారణంగా జూన్ 1న పునః ప్రారంభమయ్యే జూనియర్ కాలేజీ తదుపరి ఏడాది ఏప్రిల్ 28 కల్లా పూర్తయ్యేలా అకడమిక్ ఇయర్ వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆర్ట్స్ లేదా కామర్స్ లేదా సైన్స్ సబ్జెక్టుల జూనియర్ లెక్చరర్ ఎవరైనా రోజుకు రెండు పీరియడ్లు బోధించాలి. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం పాఠం ఒకటి ఉండగా, మరోటి రెండో ఏడాది విద్యార్థులకు బోధించాలి. తరగతి గదిలో 40 మంది విద్యార్థులు ఉన్నా లేక 160 మంది విద్యార్థులు ఉన్నా అందుకు తగ్గట్టు ప్రణాళిక రూపొందించుకుని పాఠం చెప్పాల్సి ఉంటుంది.సైన్స్ గ్రూప్‌కానీ, ఇతర గ్రూపులు కానీ ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు రెండు సెక్షన్లుగా విభజించి నాలుగు తరగతులు బోధించాల్సి ఉంటుంది. సైన్స్ విద్యార్థులకు ల్యాబోరేటరీలో ప్రాక్టికల్స్ శిక్షణకు సంబంధిత జూనియర్ లెక్చరర్లు అదనపు బోధన చేపట్టాల్సి ఉంటుంది. అవసరమైన చోట తెలుగుమీడియంతో పాటు ఇంగ్లిష్ మీడియంలోనూ ఇంటర్ పాఠాలు బోధించడానికి జూనియర్ లెక్చరర్లు సిద్ధంగా ఉండాలి.

రూ.30 వేల వేతనం

జూనియర్ లెక్చరర్‌గా ఎంపికైన అభ్యర్థులు ప్రారంభ వేతనం రూ.30 వేలు అందుకుంటారు. ఎపిపిఎస్‌సి నుంచి ఎంపికయ్యే గ్రూప్-I కేటగిరీలలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఎం.పి.డి.ఓ, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వంటి ఉద్యోగుల ప్రారంభ వేతనం కంటే (వేతన స్కేలు రూ.16150-42590) అదనంగా మరో రూ.4 వేలు అధికంగా జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు పొందుతారు. ప్రశాంతమైన విద్యావాతావరణంలో చక్కగా పాఠాలు బోధిస్తూ ఎటువంటి ఉరుకులు పరుగులు లేకుండా భారీ వేతనాలు పొందే అవకాశం జె.ఎల్. అభ్యర్థులకు ఉంటుంది.ఏడాదికి రెండుసార్లు డి.ఎ. పెరుగుదల, ఒక ఇంక్రిమెంటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జూనియర్ లెక్చరర్లు పొందుతారు. బేసిక్ వేతనం ఎక్కువగా ఉన్న జె.ఎల్ ఉద్యోగులకు అత్యధికంగా వేతనాలు పెరుగుతూ ఏటారూ.2 వేల వరకు అదనంగా బేసిక్‌లో కలిసే అవకాశం ఉంటుంది. జూనియర్ లెక్చరర్‌గా ప్రారంభ వేతనం రూ.30 వేలు పొందుతున్న ఏ అభ్యర్థి అయినా మరో ఐదు ఏళ్లకు రూ.50 నుండి 60 వేల వేతన స్థాయికి చేరుకునేలా కెరీర్ గ్రాఫ్ ఉంటుందని చెప్పవచ్చు.

పదోన్నతులు ఎలా ఉంటాయి?

జూనియర్ లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించిన అభ్యర్థులు రెండు రకాలుగా పదోన్నతులు పొందవచ్చు. ఒకటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అసోసియేట్ లెక్చరర్. రెండవది, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టులోకి పదోన్నతి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ఏర్పడుతున్న అసోసియేట్ లెక్చరర్ ఖాళీలలో 100 పోస్టులుంటే, అందులో 75 పోస్టులకు జూనియర్ కాలేజీ లెక్చరర్లను పదోన్నతులతో ఎంపిక చేస్తారు. అయితే సదరు జె.ఎల్. అభ్యర్థులు స్లెట్ లేదా నెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా 8 ఏళ్లలో తొలి పదోన్నతి జెఎల్ అభ్యర్థులు పొందవచ్చు.మిగతా 25 శాతం డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. ఇక రెండవది అయిన జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా తొలి పదోన్నతి పొందాలంటే జూనియర్ లెక్చరర్లు 14 ఏళ్ల వరకు వేచి ఉండాల్సిందే. గతంలో 1998లో జూనియర్ లెక్చరర్ల భర్తీ చేపట్టిన కాలేజీ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసిన వారందరూ ప్రిన్సిపాల్స్ అయ్యారు. ఎపిపిఎస్‌సి 2001 జూనియర్ లెక్చరర్స్ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికయిన బ్యాచ్ అభ్యర్థులలో కొంతమందికీ ప్రిన్సిపాల్‌గా పదోన్నతులు లభిస్తున్నాయి. ప్రిన్సిపాల్‌గా పదోన్నతులు పొందిన 15 ఏళ్ల తర్వాత ఖాళీలను బట్టి రీజనల్ ఇన్‌స్పెక్టర్ ఆఫీసర్ (ఆర్.ఐ.డీ) పదోన్నతి పొందవచ్చు. లేదంటే ప్రిన్సిపాల్‌గా రిటైర్ కావచ్చు. ఇదిలా ఉండగా, డిగ్రీ కాలేజీలో అసోసియేట్ లెక్చరర్‌గా పదోన్నతి పొందిన వారు 15 నుంచి 20 ఏళ్లలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా మరో పదోన్నతి పొందవచ్చు. లేదంటే డిగ్రీ కాలేజీ సీనియర్ లెక్చరర్‌గా రిటైర్ కావచ్చు.

బదిలీలు ఎలా ఉంటాయి?

జూనియర్ లెక్చరర్ ఉద్యోగం జోనల్ స్థాయి పోస్టు. రిక్రూట్‌మెంట్ నుండి పోస్టింగ్ వరకు జోనల్ ప్రాంతాలలో గల ఆయా జిల్లాలను కేంద్రాలుగా చేసుకుని, జె.ఎల్. ఉద్యోగాల భర్తీ కొనసాగుతుంది. రాష్ట్రంలో 23 జిల్లాలను కలుపుతూ ఆరు జోన్లు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఉదా॥ ఆరవ జోన్ తీసుకుంటే, అందులో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్ ఉంటాయి. అభ్యర్థులకు సొంత జిల్లాల నుంచి మొదలుకుంటే ఏ ఇతర జిల్లాలోనైనా జె.ఎల్. పోస్టింగ్ ఇవ్వవచ్చు. నిర్ధేశిత జూనియర్ కాలేజీలో జె.ఎల్‌గా చేరిన అభ్యర్థులు గరిష్టంగా 5 ఏళ్లు అక్కడే ఉద్యోగ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ధేశిత జోన్ పరిధిలో ఏదేనీ ప్రభుత్వ జూనియర్ కాలేజీకి బదిలీ చేయవచ్చు. అలాగే, ప్రిన్సిపాల్‌గా పదోన్నతి లభించిన తర్వాత సైతం పోస్టింగులు జోనల్ స్థాయిలోనే అభ్యర్థులకు అందిస్తుంటారు.

ఇంటర్మీడియట్ విద్య స్వరూపం

రాష్ట్ర స్థాయిలో 824 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కొసాగుతున్నాయి. ఇందులో మొదటి ఏడాదిలో 2 లక్షలు, రెండో ఏడాదిలో 2 లక్షల మంది అభ్యర్థులు ఇంటర్ కోర్సులు చదువు తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇంటర్‌లో పలు రకాల వృత్తి విద్యాకోర్సులను 12 ప్రభ్వుత్వ కాలేజీలు అందిస్తున్నాయి. ఇంటర్‌లో ప్రధానంగా ఆఫర్ చేస్తున్న సాంప్రదాయక కోర్సులు ఎంపిసి, బైపిసి, సిఇసి, హెచ్‌ఇసి, ఎం.ఇ.సి. ఇంటర్ ప్రభుత్వ కాలేజీలలో 12 వేల జూనియర్ లెక్చరర్ సాంక్షన్డ్ పోస్టులున్నాయి. ఇందులో 4500 మంది లెక్చరర్లు మ్రాతమే పర్మినెంట్‌గా పాఠాలు చెబుతుండగా, మిగతా అందరూ కాంట్రాక్టు పద్ధతిలో పాఠాలు బోధిస్తున్నారు. ఇంటర్ విద్యాశాఖ ప్రధాన కార్యాలయం హైదరాబాద్, నాంపల్లి స్థానికంగా నెలకొంది.

అరుదైన నోటిఫికేషన్

రాబోయే జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ కనీవినీ ఎరుగని స్థాయిలో 5 వేల పైచిలుకు పోస్టులతో అభ్యర్థుల ముందుకు రానుంది. ఇందులో సంప్రదాయ జె.ఎల్ పోస్టులు 4200 వరకు ఉండగా, మిగతా పోస్టులు వృత్తివిద్యా జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు. ఇటీవల 15 ఏళ్ల కాలంలో నాలుగు సార్లు జె.ఎల్ రిక్రూట్‌మెంట్ జరిగింది. ఇందులో 1998లో 200 పైచిలుకు జె.ఎల్ పోస్టులు కాలేజీ సర్వీసు కమిషన్ భర్తీ చేసింది. ఆ తర్వాత ఎపిపిఎస్‌సి నుండి 2001లో 660 జూనియర్ లెక్చరర్లు పోస్టులు, 2004లో 330 జె.ఎల్ పోస్టులు పోస్టులు, 2008లో 1100 జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీకి వచ్చాయి. ఉదా॥ గత నోటిఫికేషన్‌లో 100 పోస్టులు కామర్స్‌లో భర్తీకి రాగా, రాబోయే కొత్త జె.ఎల్ రిక్రూట్‌మెంట్‌లో 400 వరకు కామర్స్ జె.ఎల్ ఖాళీలు ఉండనున్నాయి. ఇదే తరహాలో ఇతరేతర జె.ఎల్ సబ్జెక్టులలోనూ భారీ పోస్టులు రానున్నాయి.

నోటిఫికేషన్ దిశగా పరిణామాలు

I. ముఖ్యమంత్రి కార్యాలయం : కాంట్రాక్టు లెక్చరర్లకు వెయిటేజీ కల్పించాలనే అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని కొత్త జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి నేడో రేపో క్లియరెన్స్ ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి తుది ఆదేశాలను బట్టి మాద్యమిక శాఖ, ఆర్థిక శాఖ నుండి ఎపిపిఎస్‌సికి కొత్త జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఖాళీల సంఖ్య (ఇండెంట్లు) పంపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు పంపించనుంది. మొత్తంమీద ఈ నెలాఖరులోగా జె.ఎల్. పోస్టుల భర్తీపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

II. ఇంటర్ విద్యాశాఖ : రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ క్షణం ఆదేశాలు వచ్చినా వెంటనే జె.ఎల్ సబ్జెక్టు వారీ ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, ఇతరేతర వివరాలన్నింటినీ ఎపిపిఎస్‌సికి పంపించేలా ముమ్మర ఏర్పాట్ల పనిలో ఇంటర్ విద్యాశాఖ యంత్రాంగం నిమగ్నమై ఉంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జూనియర్ లెక్చరర్ల ఖాళీల జాబితా తెప్పించుకున్న ఇంటర్ విద్యాశాఖ, వాటిపై మరింత స్పష్టమైన సమాచారం కోసం సంబంధిత రీజినల్ స్థాయి అధికారులను కోరుతూ ఫాలోఅప్ చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఇంటర్ విద్యాశాఖ కసరత్తు పూర్తి కానుంది.

III. ఎపిపిఎస్‌సి : ఇండెంట్లు అందిన వారం రోజుల్లోగా జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ ప్రకటించే దిశగా ఎపిపిఎస్‌సి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక జె.ఎల్. పోస్టులకు అవసరమైన సిలబస్‌ను ఇప్పటికే సిద్ధం చేసిన ఎపిపిఎస్‌సి, ఇండెంట్లు వచ్చిన వెంటనే జెఎల్ నోటిఫికేషన్, రిక్రూట్‌మెంట్లు షెడ్యుల్ ఖరారు చేసి పత్రికా ప్రకటన ఇవ్వనుంది.

Monday, November 19, 2012

తెలుగు లెంక - తుమ్మల సీతారామమూర్తి

తెలుగు లెంక - తుమ్మల సీతారామమూర్తి
తెలుగులెంకగా సుప్రసిధ్ధుడైన తుమ్మల సీతారామమూర్తి 1901 డిసెంబరు 25న గుంటూరు జిల్లా కావూరులో రైతు కుటుంబంలో జన్మించాడు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వెంకటరమణశాస్త్రి వంటి ప్రముఖుల వద్ద విద్యనభ్యసించిన తుమ్మల, కవిగా, పండితుడిగా, తనకు తానే తీర్చిదిద్దుకొన్నాడు. తుమ్మల అచ్చమైన గాంధేయవాది. తెలుగుదనం మూర్తీభవించిన జాతీయోద్యమ కవి. "మహాత్ముని ఆస్థానకవి" అని కట్టమంచి రామలింగారెడ్డితో పలికించుకున్న తుమ్మల, ఆత్మకథ,మహాత్మకథ వంటి ఆదర్శ ప్రౌఢకావ్యాలు, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ఉదయగానము, పఱిగపంట, పైర పంట, శబల, సమదర్శి, నా కథలు వంటి సామాజిక కవిత్వాన్ని అందించారు. అచ్చ తెలుగు మాటలతో అందమైన పద్యాలు అల్లగలిగిన ఆధునిక కవుల్లో తుమ్మలను మించిన వారు లేరంటె అతిశయోక్తి కాదు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడైన తుమ్మల గాంధీ భక్తి, తెలుగు భాషానురక్తి కలిగిన జాతీయోద్యమ కవి.

స్వాభిమానం మెండు. రాష్ట్రగానం, ఉదయగానం ఆనాడు ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూపిన కావ్యాలు. రైతు కుటుంబంలో పుట్టి, ఒక పూట పొలానికి, ఒక పూట బడికి పోయిన తుమ్మల కవిత్వంలో 'రైతు' తొంగి చూస్తుంటాడు. పరిగపంట, పెద్దకాపు, శబల, పైరపంట, సమదర్శి, కదంబకైత, దివ్యజ్యోతి తుమ్మలవారి ఖండ కావ్యాలు. ఆత్మార్పణము, ధర్మజ్యోతి వీరి కథా కావ్యాలు. ఇంకా పెక్కు సామాజిక కావ్యాలు, శతకాలు, నాటకాలు, హరికథలు, చరిత్రములను తుమ్మల రచించారు.


విశ్వనాథ సత్యనారాయణ ఇలా అంటాడు-'ఓయి నాగరకులారా! కృషీవల జీవన విముఖులారా! ఈ మహాకవిని వినుడు! నాగరికతా భ్రాంతిని వదిలించుకొనుడు!' ఇదే తుమ్మలవారి సందేశం అని కూడా మనం భావించవచ్చు. ఆయన్ని చూస్తే అచ్చం తెలుగు రైతులాగా వుండేవాడు కాని 'కవి వేషం' కనబడేది కాదు. ఆరడుగుల నల్లని విగ్రహం. పల్లెటూరి పెద్దరికం తొణికసలాడే నుదురు.

పొడుగైన ముక్కు. గుబురైన మీసాలు. ఖద్దరు దుస్తులు. ఆచితూచి మాటలు. సద్గుణాల ప్రోగు. ఆయన ఒక విషయంలో మాత్రం గర్విష్ఠి! తాను తెలుగు వాడైనందుకు ఆయన గర్విస్తాడు. తెలుగుజోదుల తుటారి కటారి చెలరేగి పగర చీల్చిన దినాన్ని జ్ఞప్తి చేసుకొని, పారతంత్య్రానికి, కులతత్వాలకు, ఈర్ష్యకులోనై, కుక్కలు చింపిన విస్తరిగా దేశాన్ని చేసిన ఆంధ్రజాతిని ఈసడించుకున్నాడు. రాష్ట్ర సిద్ధి కోసం 'రాష్ట్ర గానం' రచించి, రాష్ట్ర వృద్ధికోసం 'ఉదయగానం' ఆవిష్కరించాడు తుమ్మల.

పదవుల కోసం కుమ్ములాటను గాంచి కవి మనసు కలత చెందింది. ఇలా అంటాడు.'దొడ్డ తలపులున్న రెడ్డికైనను మాల/బిడ్డకైన నిమ్ము పెత్తనమ్ము కులము లింక నిల్వగలవటోయీ! వేరు/ పరువు పడియె, వాని పరువు సెడియె' 'బిచ్చగాడు లేని, మ్రుచ్చులేని, కటారిలేని, దొర తనమ్ములేని కుట్రలేని' దేశపరిస్థితుల కోసం కవి ఎదురుచూశాడు. నిజంగా అటువంటి రోజువస్తే అదే 'క్రొత్త సంక్రాంతి' కవికి. నేటి రచయితలకు 'పునాది తక్కువ' అని వారి నిశ్చితాభిప్రాయం.

ఒక ఇంటర్వ్యూలో తుమ్మల ఇలా అన్నారు.'నా రచన పద్యము. దీనికి వ్యవహారిక భాష సాయపడదు. గణము కోసమో యతి ప్రాసల కోసమో సలక్షణ భాషనాశ్రయింపక తప్పదు. వచనము గేయము ఆధారముగా చేసుకొని యువ కవులు వ్యవహారిక భాషలో కవిత్వము వ్రాయుచున్నారు. వీరిలో శ్రీశ్రీ వంటి సిద్ధహస్తులు కొందరున్నారు. భాషా మార్గము ఏదైనను రచయిత లోతుగా సాహిత్య కృషి చేసినపుడే పది కాలాల పాటు అది చరిత్రలో నిలుచును. మా తరం వారు చదివినంత గట్టిగా నేటి యువతరం కావ్య పఠనం చేయడం లేదు. పత్రికల నిండా ఏదో రాస్తున్నారు.

చాలా మంది పలుకులలో ప్రాణం లేదు. పునాది తక్కువ. తనదంతా విప్లవ కవిత్వం అని ఆయన భావన. తమతరం కవుల్లో శృంగారం జోలికి వెళ్లని వారిలో తుమ్మల మొదట నిలుస్తాడు. ఆయన రచన చేయడం ప్రారంభించాక భావ కవిత్వం వచ్చింది. తుమ్మల మనసు దాని మీదకు పోలేదు. తరువాత అభ్యుదయ, విప్లవ కవిత్వాలు వచ్చాయి. వాటి పద్ధతి తుమ్మల చూశాడు. అప్పటికి తుమ్మల రాసిందంతా విప్లవ కవిత్వమే! కాకపోతే ఒక తేడా ఉంది. తుమ్మల విప్లవం అంతా అహింసాయుతం. తుమ్మల సీతారామమూర్తి స్వగృహంలోనే 1990 మార్చి 21న పరమపదించారు.

సిఆర్‌ రెడ్డి ఆయనకు ‘అభినవ తిక్కన’ అనే బిరుదాన్ని ఇచ్చారు. కాని తుమ్మల తెలుగు భాషకు సేవ చేసేవాడిననే అర్ధంలో తనను తాను ‘తెనుగు లెంక’గా పిలుచుకున్నారు. తుమ్మల ‘మహాత్మ కథ’ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ నగదు బహుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్యఅకాడమీ శాశ్వత సభ్యుడుగా నియమితులయ్యారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్‌ డిగ్రీని తుమ్మలకు అందజేసింది.

Saturday, November 17, 2012

డిసెంబర్ తొలి వారంలో గ్రూప్-1 ఫలితాలు

డబుల్ వేల్యూయేషన్ పంథాలో కొనసాగుతున్న గ్రూప్-1 మెయిన్స్ పేపర్ల వేల్యూయేషన్ ప్రక్రియ శరవేగంగా పూర్తి కావస్తోంది. ఇప్పటికే మొదటి దఫా జరిగే సింగిల్ వేల్యూయేషన్ ప్రక్రియలో అన్ని పేపర్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మెయిన్స్ పేపర్ల డబుల్ వేల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. డబుల్ వేల్యూయేషన్ అనంతరం ఏ అభ్యర్ధి పేపర్‌లో అయినా కనీసం 15 శాతం మార్కుల వ్యత్యాసం కనిపిస్తే సదరు పేపరును త్రిబుల్ వేల్యూయేషన్‌కు పంపించి నిర్ధిష్ట మార్కులు ఖరారు చేయనున్నారు. మొత్తం మీద నవంబర్ నెలఖారులోగా గ్రూప్-1 మెయిన్స్ వేల్యూయేషన్ ప్రక్రియ పూర్తి కానుందని కమిషన్ అధికారుల ద్వారా తెలిసింది. ముందుగా 45 రోజుల వ్యవధిలో గ్రూప్-1 మెయిన్స్ పేపర్లు వేల్యూయేషన్ పూర్తి చేయాలని కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసుకుంది. దానికంటే మరో 20 రోజుల ఆలస్యంగా వేల్యూయేషన్ ప్రక్రియ ముగుస్తున్న క్రమంలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు డిసెంబర్ తొలి వారంలో అభ్యర్ధులు ఆశించవచ్చు.


మెయిన్స్ ఫలితాలు వెలువడిన వారం పదిరోజుల్లో గ్రూప్-1 ఇంటర్వ్యూలు ప్రారంభించటం కమిషన్ అనవాయితీ. అయితే ప్రస్తుత ఛైర్మన్ శ్రీమతి రేచల్ ఛటర్జీ వచ్చేనెల డిసెంబర్ ఆఖరుకల్లా కమిషన్ ఛైర్మన్ పదవి నుంచి పదవి విరమణ చేయనున్నారు. దీనితో కమిషన్‌కు నూతన ఛైర్మన్‌ను రాష్ర్ట ప్రభుత్వం నియమించాల్సి ఉంది. ఛైర్మన్ మారే క్రమంలో గ్రూప్-1 ఇంటర్వ్యూల నిర్వహణ షెడ్యూల్ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. అయితే అంచనాల కంటే ముందుగానే వేల్యూయేషన్ పూర్తయి, ఫలితాలు వెలువడితే ప్రస్తుత ఛైర్మన్ నేతృత్వంలోనే గ్రూప్-1 ఇంటర్వ్యూలు పూర్తికావచ్చు. ఇంటర్వ్యూల నిర్వహణపై నిర్ధిష్ట షెడ్యూల్స్ మెయిన్స్ ఫలితాలు వెంబడే అభ్యర్ధులు తెలుసుకునే వీలవుతోంది. అలాగే గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వెల్లడి కోర్టు కేసులతో ముడిపడి ఉందని కూడా చెప్పాల్సిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ‘కీ’లో తప్పు జవాబులకు సంబంధించిన ట్రిబ్యునల్ కేసు పురోగతిపై మెయిన్స్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

కొత్త గ్రూప్-2 ఫలితాలు డిసెంబర్‌లో

2008 గ్రూప్-2 పోస్టుల ఫలితాలకు వైట్నర్ కేసు అడ్డంకి తొలగిపోవటంతో చకాకా సదరు ఉద్యోగాలకు అభ్యర్ధుల ఎంపిక కమిషన్ పూర్తి చేస్తోంది. నాటి గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల జాబితా వెల్లడించి, అర్హత గల జాబితాలను సదరు డిపార్ట్‌మెంట్లకు పంపిస్తోంది. ఇక ఇదే రిక్రూట్‌మెంటులో భర్తీ చేయనున్న నాన్ ఎగ్జిక్యూటివ్ ఫలితాలు నేడో రేపో ప్రకటించేలా కమిషన్ అధికారులు చర్యలు చేపట్టారు. సంబంధిత నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధుల జాబితా ఆయా డిపార్ట్‌మెంట్లకు ఈ నెలాఖరులోగా కమిషన్ పంపించనుందని సమాచారం. మొత్తం మీద కొత్త తాజా గ్రూప్-2 ఫలితాలకు అడ్డంకిగా ఉన్న 2008 గ్రూప్-2 రిక్రూట్‌మెంటు ప్రక్రియ మొత్తం ఈ నెలలో పూర్తయినట్టేనని పోటీపరీక్షార్థులు భావించవచ్చు.

ఇదిలా ఉండగా 2011 గ్రూప్-2 పోస్టుల రాతపరీక్షలు జులై 20, 21 వ తేదీలలో జరిగిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 ప్రశ్నాపత్రాల వేల్యూయేషన్ గత నెలలో కమిషన్ పూర్తి చేసింది.

అయితే త్వరలో సంబంధిత గ్రూప్-2 పరీక్ష ‘కీ’ ఎపిపిఎస్‌సి వెబ్‌సైటులో పెట్టి అభ్యర్ధుల నుంచి అబ్జెక్షన్స్ కోరనున్నారు. అపై ఫైనల్ ‘కీ’ ప్రకటిస్తూ గ్రూప్-2 పోస్టుల పరీక్ష ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2011 గ్రూప్-2 పోస్టుల ఫలితాలు డిసెంబర్‌లో అభ్యర్ధులు ఆశించవచ్చు. 873 ఖాళీలు గల ఈ గ్రూప్-2 రిక్రూట్‌మెంటులో ఇంటర్వ్యూలు లేనందున కేవలం రాతపరీక్ష అర్హతతోనే అభ్యర్ధులను ఎంపిక చేయనున్న సంగతి తెలిసిందే. దీనితో అటు ఎగ్జిక్యూటివ్ పోస్టులతోపాటు ఇటు నాన్ ఎగ్జిక్యూటివ్ ఫలితాలు డిసెంబర్ మాసంలోనే కమిషన్ ప్రకటించే అవకాశం ఉంది. పూర్వ గ్రూప్-2 పోస్టుల ఎంపిక పూర్తయిన మరుసటి నెలలోనే కొత్త గ్రూప్-2 ఫలితాలు రానుండటం అభ్యర్ధులకు సంతోషదాయకమే.

Friday, November 16, 2012

షోయబుల్లా ఖాన్.. ‘ఇమ్రోజ్’ నిప్పు కణిక

షోయబుల్లా ఖాన్
‘‘మరణం అనివార్యం. చావు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ మరణం ఒక లక్ష్యం కోసం సంభవిస్తే గర్వించాలి. నేను దేశం కోసం మరణిస్తున్నందుకు మీరు సంతోషించాలి’’  షోయబుల్లా ఖాన్ చివరి మాటలు.

షోయబుల్లా ఖాన్.. ధిక్కారస్వరం,‘ఇమ్రోజ్’ నిప్పు కణిక.

నిజామ్‌కు వ్యతిరేకంగా నిరసన, ప్రతిఘటన.. ఓ దీర్ఘకాలిక యుద్ధం.

1920, అక్టోబరు 17న ఖమ్మంజిల్లా బూర్గుంపాడు ప్రాంతంలో సబ్రవేడ్‌ గ్రామంలో ఆయన జన్మించారు. తండ్రి హబీబుల్లాఖాన్‌. నిజాం ప్రభుత్వంలో పోలీసు అధికారి. తల్లి లాయకున్నిసా బేగం. వారికి ఆయన ఏకైక సంతానం. షోయబ్‌ భార్య అజ్మలున్నిసాబేగం. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఫరీదాఖాన్‌. వీరి కుటుంబం ఉద్యోగార్ధం ఉత్తరప్రదేశ్‌ నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ కాలంలో గ్రాడ్యుయేషన్ చేస్తే పెద్ద పెద్ద ఉద్యోగాలు కాళ్ల దగ్గరికి వచ్చేవి. కానీ షోయబుల్లాఖాన్ ఆ ఉద్యోగాల జోలికి పోలేదు. అది తెలంగాణ అగ్నిగోళంగా ఉన్న సమయం. ఆ సమయంలో షోయబుల్లా ఖాన్ కి అక్షరమే ఆయుధంగా కనిపించింది. అక్షరాన్ని మించిన ఆయుధం మరొక్కటి కనిపించలేదు. ఇది అక్షరాలా నిజం!

అందుకే షోయబుల్లాఖాన్ జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. నిజాం ప్రభుత్వ అరాచకాలపై పెన్ను ఎక్కుపెట్టారు. తేజ్‌ ఉర్దూ వారపత్రికలో ఉద్యోగం. నిత్యం రాజాకార్లూ, భూస్వాముల ఆగడాలపై వ్యాసాలు రాశారు. దీంతో తేజ్‌ను నిషేధించింది నిజాం ప్రభుత్వం. తరువాత రాష్ట్ర మాజీ మంత్రి మందముల నరసింగరావు నడుపుతున్న 'రయ్యత్‌' ఉర్దూ పత్రికలో ఉప సంపాదకునిగా బాధ్యతలు నిర్వహించారు. రయ్యత్ పత్రికలో పనిచేస్తానని వచ్చిన రోజే ఆ పత్రికా సంపాదకుడు ముందుముల సర్సింగరావు షోయబ్‌ను నిరుత్సాహపరిచారు. ‘ఇక్కడ మా పత్రికలో ఇచ్చే వేతనం చాలా తక్కువ. పైగా మీకు పెళ్లి అయిందని, ఒక కూతురు కూడా ఉంద ని చెబుతున్నారు. నెలకు మేమిచ్చే 50 రూపాయల వేతనంలో మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కనుక మిగతా అర్హతలతో పాటు ముస్లిం అయిన మీకు ప్రభుత్వంలో మంచి జీతంతో హోదాగల నౌకరీ దొరుకుతుంది ప్రయత్నించండి’ అన్నారు. అన్నీ విని కూడా పత్రికలో పనిచేస్తానని షోయబ్ స్థిరంగా చెప్పడంతో నర్సింగరావు మరో ఇబ్బందిని ఎత్తిచూపారు. ‘మీరు లోగడ తేజ్ వార పత్రికలో రాసిన వ్యాసాలు చూశాను. మీరు రాయిస్టు (ఎం ఎన్ రాయ్ భావాలు కలవాడు) అని నాకు అనిపిస్తున్నది. ‘రయ్యత్’ భిన్న భావాలు గల పత్రిక. ఈ పాలసీతో ఏకీభవించి మీరు పనిచేయలేరేమో!’అన్నాడు. ‘రయ్యత్’లో పనిచేసినంత కాలం పత్రిక భావాలకు భిన్నంగా నా సొంత భావాలు ప్రకటించనని షోయబ్ అన్నాడు. తన భావాలను కప్పిపుచ్చుకోవానికో, బొంకడానికో ప్రయత్నించకపోవడం వల్ల అతని నిజాయితీ నిరూపితమైంది. ‘రయ్యత్’లో చేరిపోయాడు.అందులో చేరిన అనతి కాలంలోనే అతని ప్రతిభావిశేషాలు వెల్లడయ్యాయి. అతని పని పెరిగింది. వేతనమూ పెరిగింది. ఉద్యోగిగా కాకుండా ‘రయ్యత్’లో కుటుం బ సభ్యుడిలా ఆత్మీయతను వృద్ధి చేసుకున్నాడు.

నిజాం పాలకుల రాక్షస పాలనను, రజాకార్ల దురాగతాలను ఎండగట్టే పలు రచనలు చేశారు. రయ్యత్‌ పత్రిక కూడా నిజాం ఆగ్రహానికి గురై మూతబడింది. అయినా షోయబ్‌ అధైర్యపడలేదు, పెన్నులపై మన్నుగప్పితే గన్నులై మొలకెత్తుతై. ఆ గన్నే ఇమ్రోజ్. భార్యను, తల్లిని ఒప్పించి వారి ఆభరణాలు అమ్మేశారు. ఆ వచ్చిన డబ్బుతో జాతీయ భావాలు ప్రేరేపించగల 'ఇమ్రోజ్‌' ఉర్దూ దినపత్రికను 1947, నవంబరు 1న ప్రారంభించారు. ఎంతో శ్రమించి, ఆర్థిక ఆటంకాలు అధిగమించి ఈ పత్రికను ప్రజల పత్రికగా తీర్చిదిద్దారు. నిజాం ప్రభువుల నిరంకుశత్వం, మతాన్మోదుల దురహంకారం మీద అక్షరాయుధంతో తిరుగులేని సమరం సాగించారు.

1948, జనవరి 29 ఇమ్రోజ్‌ సంచికలో 'పగటి ప్రభుత్వం-రాత్రి ప్రభుత్వం' అనే వ్యాసం రాశారు. 'ఈనాడు తెలంగాణా గ్రామాలలో ప్రజలు నిజాం ప్రభుత్వ తిరగలిలో పిండి చేయబడుతున్నారు. ఇత్తెహుదల్‌ సభ్యులు గాంధీ టోపీలు ధరించి 'గాంధీకీ జై' అంటూ గ్రామాలలో దోచుకుంటున్నారు. పాలకులు వీరికి అండనిస్తున్నారు. ఈ అరాచక వ్యవస్థ ఓ విషవలయంగా మారింది. 'ఇత్తెహుదల్‌ ముస్లిమాన్‌ సంస్థ'ఫై ప్రభుత్వం నిషేధం ఎందుకు విధించదు? ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే మంత్రివర్గాన్ని ఎందుకు ఏర్పాటుచేయదు?' అని షోయాబ్‌ సంధించిన ప్రశ్నలు పాలకవర్గాన్ని బోనులో నిలబెట్టాయి. ఈ వ్యాసం గ్రామీణ ప్రజల దుర్భర పరిస్థితులకు అద్దం పట్టింది. నిజాం పాలకుల బండారం పొట్టవిప్పి చూపింది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌, యూత్‌ లీగ్‌, విద్యార్థి యూనియన్‌, ఆర్యసమాజ్‌, ఎవరు పోరాటం చేసినా ఆ వార్తలను షోయబ్‌ తన పత్రికలో ప్రచురించేవారని ఆయన సహచరుడు బాబూరావు వర్మ గుర్తుకు తెచ్చారు. కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు నుంచి కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ నాయకుడు ప్రొఫెసర్‌ ఖుంద్‌మేరి ఆలం వరకూ ఆయనకు పలువురితో సంబంధాలుండేవని వర్మ చెప్పారు.

1947, ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించింది. దేశంలోని సంస్థానాలన్నీ భారత్‌లో విలీనమవుతున్నాయి. తన సంస్థానాన్ని భారత్‌లో కలపరాదని, స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని 1947, జూన్‌లోనే ఐక్యరాజ్యసమితిలో నిజాం పిటిషన్‌ వేశాడు. 'అనల్‌మాలిక్‌' అంధ విశ్వాసాన్ని రంగంలోకి తెచ్చారు. 'నేను ముస్లిం రాజును. నాది ముస్లిం రాజ్యం. ముస్లిం రాజు స్వతంత్రుడు' అంటూ ఆజాద్‌ హైదరాబాద్‌ నినాదాన్నిచ్చాడు. ఆ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలన్న ప్రజల కోర్కెను 'భారత సామ్రాజ్యవాదుల కుట్రగా' ప్రచారం చేశాడు. పైగా రజాకార్ల నాయకుడు ఖాశిం రజ్వీ 'ఎర్రకోటపై అసఫ్‌ జాహీ పతాకం ఎగరేస్తాం' అంటూ ఉన్మాదపూరిత ప్రసంగాలు చేశాడు.

ఒకవైపున కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 1946 నుంచి చారిత్రక తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతున్నది. ఈ పోరు నిజాం భూస్వామ్య వ్యవస్థ పునాదులను కుదిపి వేస్తున్న కాలమది. వేరొక వైపున కాంగ్రెస్‌ సోషలిస్టులు, ఆర్యసమాజ్‌వారు పలు రకాల సత్యాగ్రహాలకు పూనుకున్నారు. నిజాం ప్రభుత్వంలో పనిచేసి పదవీ విరమణ చేసిన సివిల్‌ ఉద్యోగులు, ముస్లిం మేధావులు, నిజాం సంస్థానాన్ని భారత్‌లో విలీనం చెయ్యాలని, రజాకార్‌ మూకలను కట్టడిచేయాలని బహిరంగ ప్రకటన చేశారు. కేవలం 12 శాతం ముస్లిం ప్రజానీకం ఉన్న ఆ ప్రాంతం ముస్లిం రాజ్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ ప్రకటనను సంపూర్ణంగా ఇమ్రోజ్‌ పత్రికలో షాయబ్‌ ప్రచురించారు. ఒక ముస్లింగా పుట్టి, ముస్లిం అధినేత పాలననే ఎదిరించడం నాటి ముస్లిం విద్యావంతులు, మేధావులను ఎంతో ఉత్తేజపరిచింది.

ఒక చిన్న ఉర్దూ పత్రిక సంపాదకుడు, శక్తిమంతమైన నిజాం ప్రభుత్వాన్ని ఎండగట్టడాన్ని పాలకులు అవమానంగా భావించారు. 1948, ఆగస్టు 19న హైదరాబాదు 'జమురుద్‌ హాలు'లో రజాకార్ల నాయకుడు ఖాశిం రజ్వీ ప్రసంగిస్తూ 'ముస్లింల ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తులు సజీవంగా ఉండటానికి వీలులేదు. అలాంటివారి చేతులు క్రిందికి దిగాలి లేదా నరికేయాలి' అని ప్రకటించాడు. ఈ ప్రకటనకు అనుగుణంగా పథకం రూపొందించారు.

అది 1948, ఆగస్టు 21 అర్ధరాత్రి. షోయబ్‌ పట్ల కాళరాత్రిగా మారింది. కాచిగూడా రైల్వేస్టేషన్‌ రోడ్‌లోని తన ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనులు పూర్తిచేసుకుని షోయబుల్లా లింగంపల్లిలో సమీపాన ఉన్న తన ఇంటికి కాలినడకన వస్తుండగా రజాకార్ల గుంపు ఆయనపై ఆకస్మికంగా దాడి చేసింది. ఆయనపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించింది. హంతక ముఠా ఆయనను వెంటాడి తల్వార్లతో రెండు చేతులూ నరికేసింది. రక్తం మడుగులో పడికొట్టుకుంటున్న షోయబ్‌ను ఆ ప్రాంత ప్రజలు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో 1948, ఆగస్టు 22 తెల్లవారు జామున ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారు. అనంతరం వారి కుటుంబం ఇక్కడ రక్షణలేక ఉత్తరప్రదేశ్‌కు తరలివెళ్ళింది.

కలం యోధుని దర్శించి నివాళులర్పించేందుకు ప్రజలను నిజాం పాలకులు అనుమతించలేదు. అంతిమయాత్రలో పాల్గొనటంపై నిషేధం విధించారు. కొద్దిమంది స్నేహితులు, బంధువులనే అనుమతించారు. గట్టి పోలీసు పహారా మధ్య గోషామహల్‌ మాలకుంట వద్ద గల శ్మశానవాటికలో షోయబ్‌ మృతదేహాన్ని ఖననం చేశారు. 'షోయబుల్లా హత్య రాజకీయమైనది కాదని, వ్యక్తిగత స్పర్దల వల్లే జరిగిందని' నైజాం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి చేతులు దులుపుకుంది. ఈ హత్య అనంతరం 1948, అక్టోబర్‌ 17న సైనిక చర్య జరిగింది. నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైంది. కానీ షోయబ్‌ కోరినట్లు తెలంగాణా ప్రజల ఇక్కట్లు తీరలేదు. సైనిక పాలనలో మరొక రూపంలో సమస్యలు విజృంభించాయి.

మతోన్మాదుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా దేశ సమైక్యత, మతసామరస్యం కోసం రచనా రణరంగంలో రాజీలేని పోరాటం చేసి అమరుడైన షోయబ్‌ ధన్యజీవి. షోయబ్‌ స్ఫూర్తితో మరెందరో షోయబుల్లాలు తయారుకావాలని కాంక్షిద్దాం.

Tuesday, November 13, 2012

జలియన్ వాలాబాగ్ దురంతం

జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారత దేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట.ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశం

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులు భారతీయులను సహాయం కోసం అడిగితే తిరుగుబాటు చేస్తారనుకున్నారు. కానీ వారి భయానికి విరుద్ధంగా ప్రధాన రాజకీయ నాయకత్వాల నుంచి విశేషంగా స్పందన లభించింది. వారికి ఆ యుద్ధంలో సహాయపడటం ద్వారా వారి నుంచి స్వాతంత్ర్యం పొందాలని వారి ఆలోచన. యుద్ధానికి భారతీయ సైన్యాలను పంపించి వారికి సాయం చేశారు. దాదాపు 13 లక్షల మంది భారతీయ సైనికులు యూరోపు, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో తమ సేవలందించారు. భారతీయ రాజులు తమ శక్తి మేరకు ధనాన్ని, ఆహారాన్ని, ఆయుధాలను పంపించారు. కానీ బెంగాల్, మరియు పంజాబ్ లలో మాత్రం వలసవాదులకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. బెంగాల్‌లో ఉగ్రవాద తరహా దాడులు, పంజాబ్ లో నానాటికీ పెరుగుతున్న అశాంతీ ఆయా ప్రాంతీయ పరిపాలనా విభాగాలను ఇరుకున పెట్టాయి. ఈ యుద్ధం ప్రారంభం నుంచే అమెరికాలోనూ, కెనడా, జర్మనీలలో ఉంటున్న కొద్దిమంది భారతీయులు బెర్లిన్ కమిటీ, మరియు గదర్ పార్టీ నేతృత్వంలో, ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ మరియు, జర్మన్, టర్కీల సహకారంతో 1857 సిపాయిల తిరుగుబాటు తరహాలోనే ఉద్యమం లేవదీయాలని చూశారు. దీన్నే హిందూ జర్మన్ కుట్ర అని కూడా అంటారు. దీనిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ ను కూడా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు విఫల యత్నాలు చేశారు వీటిలో గద్దర్ కుట్ర, మరియు సింగపూర్ కుట్ర ప్రధానమైనవి. కానీ ఈ ఉద్యమాలు విస్తృతమైన గూఢచార సమాచారంతో, కఠినమైన రాజకీయ శాసనాలతో అణచివేయడం జరిగింది. ఈ చట్టాలు దాదాపు పదేళ్ళపాటు అమలులో ఉన్నాయి.

యుద్ధం తరువాత

దుర్ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత దృశ్యం
యుద్ధం తరువాత చాలామంది క్షతగాత్రులయ్యారు. ద్రవ్యోల్బణం అధికమైంది. దానితోపాటు అధిక పన్నులు ప్రజల జీవితాలను దుర్భరం చేశాయి. అంటువ్యాధులు ప్రభలాయి. వాణిజ్య వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజలు అనేక భాధలకు లోనయ్యారు. భారతీయ సైనికులు ఆంగ్లేయుల పాలనను అంతమొందించడానికి చాటుమాటుగా ఆయుధాలు తరలించడం మొదలుపెట్టారు. భారత జాతీయ కాంగ్రెస్ లోని మితవాదులు మరియు అతివాదులు తమలో తామే బేధాలను పరిష్కరించుకోవడంతో యుద్ధానికి పూర్వం ప్రారంభమైన జాతీయవాద ఉద్యమం మళ్ళీ తిరిగి పుంజుకుని ఒక ఐక్యకూటమిగా ఏర్పడింది. 1916 లో ముస్లిం లీగ్ తో రాజకీయ అధికారం పైన ప్రాంతంలోని ముస్లింల భవిష్యత్తు గురించి తాత్కాలికంగా లక్నో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆశ్చర్యకరమైన రీతిలో సుధీర్ఘంగా కొనసాగుతున్న పోరాటానికి నిధులు, మానవ వనరులూ సమకూరుతూనే ఉన్నాయి. ఆంగ్లేయులు భారతదేశంలో ఉన్నకొద్దీ భారతీయుల అసహనం ఎక్కువకాసాగింది. భారతదేశం ఆంగ్లేయులకు భారీగా సైనికులను, ధనాన్ని సరఫరా చేయడమే కాకుండా దాదాపు 43,000 మంది సైనికుల్ని కోల్పోయింది.

యుద్ధానంతర మార్పులు

భారతీయులు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా భారతీయులు తమకు పూర్తి స్వాతంత్ర్యం కాకపోయినా కనీసం పరిపాలనలో తమ మాట చెల్లుబాటు కావాలని భావించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బ్రిటీష్ ప్రభుత్వం పరిపాలనలో మాంటేగ్-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలను ప్రవేశపెట్టింది. కానీ భారతీయ స్వాంతంత్ర్యోద్యమ నాయకురాలు మేడమ్ భికాజీ కామా భారతీయులకు ఆ సంస్కరణలు ఏమాత్రం సరిపోవని వ్యాఖ్యానించింది. దీంతో అప్పటిదాకా రగులుతున్న పోరాటానికి ఆజ్యం పోసినట్లయింది.

రౌలట్ కమిటీ

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రూపొందించబడిన గదర్ కుట్ర (Ghadar conspiracy), మహేంద్ర ప్రతాప్ ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్థాన్ లో నెలకొన్న ఆపద్ధర్మ ప్రభుత్వం, మరియు రష్యా తో దానికిగల సంబంధాలు, పంజాబ్ మరియు బెంగాల్ లో నానాటికీ పెచ్చరిల్లుతున్న విప్లవోద్యమం, భారత ప్రజల్లో నానాటికీ రగులుతున్న అసంతృప్తి(ముఖ్యంగా బాంబే మిల్ వర్కర్స్ లో) , మొదలైన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బ్రిటిష్ ప్రభుత్వం 1918లో ఆంగ్లేయ న్యాయమూర్తియైన సిడ్నీ రౌలట్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనినే రౌలట్ కమిటీ అంటారు. ఈ కమిటీ భారతదేశంలో (ముఖ్యంగా పంజాబ్ మరియు బెంగాల్ ప్రాంతాలలో) మిలిటెంట్ ఉద్యమానికీ, రష్యా, జర్మనీ కి ఏదైనా సంబంధం ఉందేమే బ్రిటీష్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి.

రౌలట్ చట్టం

రౌలట్ కమిటీ ప్రతిపాదనను అనుసరించి బ్రిటీష్ ప్రభుత్వం 1915లో ఏర్పాటు చేయబడ్డ భారతీయ రక్షణ చట్టానికి అదనంగా రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టం ద్వారా తిరుగుబాట్లను అణిచివేయడానికి వైస్రాయ్ లకు విశేష అధికారాలని కట్టబెట్టారు. ప్రెస్ నోళ్ళను కట్టేయడానికీ, విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించడం, తిరుగుబాటు దారునిగా అనుమానితులైన వ్యక్తులను వారంటు లేకుండా అరెస్టు చేయడం మొదలైన నిరంకుశమైన అధికారాలు ఇందులో ఉన్నాయి. ఈ చట్టం పై దేశంలో సర్వత్రా ఆగ్రవేశాలు వ్యక్తమయ్యాయి.

దుర్ఘటన


తోటలో గల అమరవీరుల స్మారక బావి
 తోటలో గల అమరవీరుల స్మారక బావి1919, ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ లోగల స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ లో దాదాపు 20 వేలమంది ప్రజలు సమావేశమయ్యారు. అది వైశాఖ మాసం, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం. వారు అక్కడ సమావేశమవడానికి ముఖ్య కారణం, ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడం మరియు అనేక విమర్శలకు గురైన రౌలట్ చట్టం క్రింద సత్యపాల్, మరియు సైఫుద్ధీన్ కిచ్లూ లను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకించడం. వివిధ విభాగాలకు చెందిన 90 మంది సైనికులు (ఇండియన్ ఆర్మీ), వారితో బాటు రెండు సురక్షిత వాహనాలు (armoured cars అక్కడికి వచ్చాయి. ఇరుకైన సందుల కారణంగా వాహనాలు బాగ్ లోపలికి రాలేకపోయాయి. జలియన్ వాలా బాగ్ (పార్కు) అన్ని ప్రక్కలా ఇండ్లతోను, పెద్ద భవనాలతోను చుట్టబడి ఉంది. ఉన్న కొద్దిపాటి ఇరుకైన సందుల దారుల్లో చాలావాటికి తాళాలు వేసిఉన్నాయి. కాల్పుల కారణంగా వందలమంది మరణించారు. గాయపడినవారి సంఖ్య వేలల్లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 379 మంది (337 పురుషులు, 41 మంది బాలురు, 6 వారాల పసికందు) మరణించారు మరియు 200 మంది గాయపడ్డారు. అక్కడ స్మారక చిహ్నంపైన వ్రాసిన సమాచారం ప్రకారం అక్కడి బావిలోంచి 120 శవాలను బయటకు తీశారు. అయితే అధికారిక గణాంకాలు సరికాదని వాదనలున్నాయి. నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడినవారని ఆసుపత్రులకు తీసికొని వెళ్ళడం సాధ్యం కాలేదు.

తన ఆఫీసులో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అతనికి తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందున కాల్పులు జరుపవలసి వచ్చింది. డయ్యర్‌కు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డ్వయర్ ఇచ్చిన టెలిగ్రాములో "నీ చర్య సరైనదే. దానిని లెఫ్టినెంట్ గవర్నర్ సమర్ధిస్తున్నాడు" అని వ్రాసి ఉంది.

ఈ ఉదంతంపై విచారణ జరపడానికి 1919లో "హంటర్ కమిషన్" ఏర్పరచారు. ఆ కమిషన్ సమక్షంలో డయ్యర్ - తనకు ఆ మీటింగ్ గురించి 12:40కి తెలిసిందనీ, దానిని నిలపడానికి తానేవిధమైన ప్రయత్నమూ చేయలేదనీ, అక్కడ సమావేశమైన గుంపు గనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళాననీ - చెప్పాడు.

"బహుశా కాల్పులు జరుపకుండా గుంపును చెదరగొట్టడం సాధ్యం అయ్యుండవచ్చునని నేను భావిస్తున్నాను. కాని వాళ్ళంతా మళ్ళీ తిరిగివచ్చి నన్ను అవహేళన చేసేవారు. నేను చేతగానివాడినయ్యుండేవాడిని." — (హంటర్ కమిషన్ సమక్షంలో డయ్యర్ స్పందన)
అంతే గాకుండా ఆ స్థలంలోనికి వాహనాలు వెళ్ళగలిగితే తాను మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని, కాని ఇరుకైన సందులలోకి సాయుధ వాహనాలు వెళ్ళడం కుదరలేదని చెప్పాడు. జనం చెల్లా చెదురైనా గాని కాల్పులు ఆపలేదని, కొద్దిపాటి కాల్పులవల్ల ప్రయోజనం లేదని, జనం అంతా వెళ్ళిపోయేదాకా కాల్పులు జరపడం తన బాధ్యత అని చెప్పాడు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించడం తన బాధ్యత కాదు గనుక అలాంటి ప్రయత్నమేమీ చేయలేదని, ఆసుపత్రులు తెరచి ఉన్నందున వారే వెళ్ళవచ్చునని కూడా అన్నాడు.

ప్రతి చర్య

భారతదేశంలో దీనికి ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్ లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920 లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్, బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చివేశాడు. మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చెప్పవచ్చు.

1920లో హంటర్ కమిషన్ రిపోర్టు వెలువడింది. డయ్యర్‌ను క్రింది పదవికి మార్చారు. అతని ఆరోగ్యం కూడా క్షీణించి ఉండడం వలన తరువాత అతనిని వైద్య సదుపాయాలున్న ఓడలో ఇంగ్లాండుకు పంపేశారు. కొద్దిమంది బ్రిటిష్ అధికారులు మరొక భారత సైనిక తిరుగుబాటును అణచివేసినందుకు అతనిని ప్రశంసించారు. బ్రిటిష్ పార్లమెంటులో అతని చర్యను నిరశిస్తూ తీర్మానాలు చేశారు. ఇది చాలా దారుణమైన, అసాధారణమైన చర్య అని చర్చిల్ అభివర్ణించాడు. 1920లో డయ్యర్ పదవికి రాజీనామా చేశాడు.

కొందరు బ్రిటిష్‌వారు మరియు కొంత బ్రిటిష్ పత్రికారంగం డయ్యర్ కర్తవ్య నిరతిని మెచ్చుకొన్నారు కూడాను. అతని సంక్షేమం కోసం విరాళాలు కూడా సేకరించారు. అమృత్‌సర్ నుండి ఢిల్లీకి రైలులో ప్రయాణిస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ పరదాల అవతల నుండి ఒక మిలిటరీ ఆఫీసర్ గట్టిగా ఇలా మాట్లాడడం విన్నానని తన ఆత్మకథలో వ్రాశాడు - "పట్టణం అంతా నా దయమీద ఆధారపడి ఉంది. దానిని బూడిద చేసేద్దామనుకొన్నాను గాని దయతలచి వదిలేశాను" - ఈ మాటలు అన్న వ్యక్తి స్వయంగఅ డయ్యరే. అదే రైలులో ప్రయాణం చేస్తున్నాడు.

స్మారక చిహ్నాలు

జలియన్ వాలా బాగ్ స్మారక స్తూపం
జలియన్ వాలా బాగ్ స్మారక స్తూపం1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది. 1923లో ఇందుకు కావలసిన స్థలం కొనుగోలు చేశారు. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపం ఆవిష్కరింపబడింది. నిరంతరాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలను తరువాత జోడించారు. ప్రక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఇప్పటికీ చూడవచ్చును. బులెట్‌ల నుండి తప్పించుకోవడానికి తొక్కిడిలో అనేకులు దూకి మరణించిన భావి కూడా ఇప్పుడు ఒక సంరక్షిత స్మారక చిహ్నం.

Sunday, November 11, 2012

ఉద్ధంసింగ్‌

ఉద్ధంసింగ్‌
బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు నడిపిన గడ్డ-పంజాబుగడ్డ- ఆ గడ్డ కన్నబిడ్డ ఉద్ధంసింగ్‌. మాతృదేశానికి జరిగిన అకృత్యాలకు, అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవాలని, ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రతిజ్ఞను నెరవేర్చి, తన ప్రాణాన్ని తృణంగా అర్పించిన అమరుడు ఉద్ధంసింగ్‌. 1899 డిసెంబరు 26న పంజాబులోని సునామ్‌ గ్రామంలో జన్మించాడు. తండ్రి సర్ధార్‌ తేహార్‌సింగ్‌- రైల్వే వాచ్‌మన్‌గా పనిచేశాడు. ఉద్ధంసింగ్‌కు తల్లిదండ్రులు పెట్టినపేరు శేర్‌సింగ్‌. అతను రెండు సంవత్సరాల వయసులో వున్నప్పుడు తల్లి మరణించింది. 8 సంవత్సరాల వయసులో వున్నప్పుడు తండ్రి మరణించాడు. శేర్‌సింగ్‌, అతని తమ్ముడు ముఖాసింగ్‌ అనాధలయ్యారు. వారిద్దరినీ భాయి కిషాన్‌సింగ్‌ ఆదుకున్నాడు. అనాధాశ్రమంలో చేర్పించాడు. అమృతసర్‌లో సిక్కుమతం స్వీకరింపచేసి ఉద్ధం సింగ్‌గా పేరుమార్చాడు. ఉద్ధంసింగ్‌ అమృతసర్‌ లోని అనాధాశ్రమంలో వుంటూ విద్యాభ్యాసం చేశాడు.

1919లో ఏప్రిల్‌ 13-భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో రక్తసిక్తమైన రోజు. అమృత్‌సర్‌ లోని జలియన్‌వాలాబాగ్‌ మారణ హోమం జరిగిన రోజు.  క్రూరుడు డయ్యర్‌ కిరాతకానికి వందలాదిమంది స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు ప్రాణాలు విడిచిన రోజు. బ్రిటీష్‌ పాలకు లు ప్రవేశపెట్టిన రౌలట్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాఉద్యమ నాయకులు డా సైపుద్దీన్‌ కిచ్లూ, డా సత్యపాల్‌ అక్రమ అరెస్టులను నిరసిస్తూ, జలియన్‌ వాలాబాగ్‌ సభ జరిగింది. సభకు వేలాదిగా తరలి వచ్చారు. ప్రశాంతంగా సభ జరుగుతున్నది. అది వేసవి కాలం. సభకు వచ్చిన వారికి మంచినీళ్ళు అందజేయాలని అనాధాశ్రమం విద్యార్థులు అక్కడికి చేరారు. దానికి ఉద్ధంసింగ్‌ నాయకుడు. అకస్మాత్తుగా జనరల్‌ డయ్యర్‌ నాయకత్వంలో మిలటరీ జలియన్‌వాలాబాగ్‌ను చుట్టుముట్టింది. తూటాల వర్షం కురిసింది. వందలాదిమంది నేలకు వొరిగారు. వందలాదిమంది క్షతగాత్రులయ్యారు. జలియన్‌వాలాబాగ్‌ రక్తసిక్తమయింది. ఉద్ధం సింగ్‌ గాయాలతో, ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, ఆ భయంకర దృశ్యం అతని కళ్ళముందు కదులుతూనే వుంది. ప్రజల హహకారాలు అతని చెవుల్లో గింగురుమంటున్నాయి. పక్కనే వున్న సిక్కుల దేవాలయం గురుద్వారా గోల్డెన్‌ టెంపుల్‌కు చేరాడు. పవిత్ర సరోవర్‌ పక్కన రక్తపు మరకలు కడిగేసి, స్నానం చేశాడు. మారణహోమానికి కారకులైన జనరల్‌ డయ్యర్‌, పంజాబు గవర్నర్‌ మిఖైల్‌ ఓ డయ్యర్‌ ప్రాణం తీసి, ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు..

జనరల్‌ డయ్యర్‌
విద్యకు స్వస్తి చెప్పి, అనాధాశ్రమం వీడి, మిత్రుల సహాయంతో అమెరికా చేరాడు. అక్కడ గదర్‌పార్టీతో సంబంధాలు నెలకొల్పుకున్నాడు. విప్లవాల గురించి తెలుసుకున్నాడు. 1927లో భగత్‌సింగ్‌ కోరిక మేరకు రహస్యంగా భారతదేశం తిరిగొచ్చాడు. అతనితోపాటు 25 మంది విప్లవకారులొచ్చారు. పంజాబులో విప్లవ కార్యక్రమాలు ప్రారంభించాడు. కొద్ది రోజులకే మారణాయుధాలు, మందుగుండు, ''గదర్‌'' ''బోల్షివిక్‌'' విప్లవసాహిత్యంతో పాటు పట్టుబడ్డాడు. 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది.
ఉద్ధంసింగ్‌ జైల్లో వున్నప్పుడే భగత్‌సింగ్‌ ఉరి కంబమెక్కాడు. అది ఉద్ధంసింగ్‌కు మరింత ఆవేదన, ఆవేశానికి గురిచేసింది. 1931 అక్టోబరు 23న జైలునుండి విడుదలయ్యాడు. కొంతకాలం స్వగ్రామం సుమాన్‌లో ప్రశాంతంగా వుండాలను కున్నాడు. కానీ పోలీసుల వేధింపులు అధిక మయ్యాయి. 1933లో రహస్యంగా దేశం నుండి బయటపడ్డాడు. శేర్‌సింగ్‌, ఉద్ధంసింగ్‌, ఉధాంసింగ్‌, ఉడేసింగ్‌, ఉదరుసింగ్‌, వేరువేరు పేర్లతో జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, స్విటర్లాండ్‌ మొదలైన దేశాలు తిరిగాడు.1934 నాటికి లండన్‌ చేరాడు. లండన్‌లోని ఇండియా హౌస్‌రూల్‌ సొసైటీతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. జలియన్‌వాలాబాగ్‌ మారణహోమం, జనరల్‌ డయ్యర్‌-మిఖైల్‌ ఓ డయ్యర్‌, అతని మనసులో మెదలుతూనే వున్నారు. చేసిన ప్రతిజ్ఞ, ఆ దుర్మార్గులను వేటాడే పనిచేస్తూనే, ఇంజనీరింగ్‌ విద్య పూర్తిచేశాడు.


జనరల్‌ డయ్యర్‌ అనారోగ్యంతో 1927లో లండన్‌లో మరణించాడు. ఇక మిగిలింది మైఖైల్‌ ఓ డయ్యర్‌ మాత్రమే. 1940 మార్చి 13వ తేదీ లండన్‌లోని కాష్కలన్‌ హాలులో రాయల్‌ సెంట్రల్‌ ఏషియన్‌ సొసైటీ, ఈస్టిండియా అసోసియేషన్‌ సభ జరుగుతుందని- ఆ సభలో మిఖైల్‌ ఓ డయ్యర్‌ ప్రసంగించబోతున్నాడని తెలిసింది. ఇన్ని సంవత్సరా లుగా వీక్షిస్తున్న సమయం వచ్చినందుకు సంతో షించాడు ఉద్ధంసింగ్‌. యాధృచ్చికంగా-జలియన్‌వాలాబాగ్‌ మారణ హోమం జరిగిన 13వతేదీ-ఉద్ధంసింగ్‌- సభలో జనం మధ్య కూర్చున్నాడు. సాయంత్రం 4.30 గంటల సమయం. సభ ముగిసింది. సభాధ్యక్షులు లార్డ్‌ జెట్‌లాంగ్‌, మిఖైల్‌ ఓ డయ్యర్‌ వేదికపై నుండి లేచారు. ఉద్ధంసింగ్‌ జేబులో నుండి పిస్తోలు తీశాడు. లేచి డయ్యర్‌కు గురిపెట్టాడు. అతను నేలకూలాడు. మరోదెబ్బకు జెట్‌లాంగ్‌ పడిపోయాడు. ''భారత మాతకీ జై'' అంటూ నినదిస్తూ ఉద్ధంసింగ్‌ నిలిచాడు.

పోలీసులు బంధించి-లాకప్‌లో చిత్ర హింసలు పెట్టారు. బాధను భరిస్తూ-ప్రతిజ్ఞ నెరవేర్చినందుకు గర్వపడుతూ పోలీసులను అడిగాడు. ఇంతకు లార్డ్‌ జెట్‌లాంగ్‌ కూడా చచ్చాడా? లేదా? అతను చచ్చేఉంటాడు. ఎందుకంటే అతని పొట్టలో తూటాలు దూర్చాను '' అన్నాడు. ఏప్రిల్‌1, 1940న-ఉద్దంసింగ్‌ను లండన్‌లోని సెంట్రల్‌ క్రిమినల్‌ కోర్టుముందు నిలిపారు.

జడ్జి అట్కిన్‌సన్‌

''నీ పేరేమిటి? ''ఉద్దంసింగేనా?'' అడిగాడు

కాదు... నాపేరు రాం-, మహమ్మద్‌-సింగ్‌- ఆజాద్‌'' అన్నాడు. తాను చేసింది న్యాయసమ్మత మైనది. ఉద్దేశపూర్వకంగానే చేశానన్నాడు.

మైఖైల్‌ ఓ డయ్యర్‌
''అతనంటే నాకు ద్వేషం, అందుకే కాల్చి చంపాను. దీనికి అతను అర్హుడు. అతను ద్రోహి, నేరస్తుడు. అతను మా భావాలను అణచాలని చూశాడు. మా ప్రాణాలు తీశాడు. అందుకే అతన్ని హతమార్చాను. 21 సంవత్సరాలుగా ఈ ప్రతీకారం తీర్చుకోవడానికే ప్రయత్నించాను. నాకు సంతోషంగా వుంది. ఈనాటికి అది నెరవేరింది. నేను చావడానికి భయపడను. నా మాతృదేశం కోసం మరణిస్తాను. నా దేశ ప్రజలు, బ్రిటీష్‌ పాలనలో ఆకలితో అలమటించడం చూశాను. దానికి నిరసనే నా చర్య. ఇది నా బాధ్యత- కర్తవ్యంగా భావిస్తున్నాను. ఎంత శిక్ష విధించినా 10-20 లేదా 50 సంవత్సరాలు- లేక ఉరిశిక్ష విధించినా నా దేశం కోసం ప్రాణం యివ్వడానికి సిద్ధంగావున్నాను. నా మాతృదేశం కోసం ప్రాణమర్పించే గౌరవం దక్కితే- గర్వపడతాను? అన్నాడు.

జూన్‌ 4, 1940 నాడు జడ్జి అట్కిన్‌సన్‌ ఉరిశిక్ష విధించాడు. జూలై 31, 1940 నాడు లండన్‌లోని పెంటాన్‌విల్లే జైల్లో ఉరికంభంపై ఉద్దంసింగ్‌ వొరిగిపోయాడు.

అతని శవాన్ని జైలు ఆవరణలోనే పూడ్చి పెట్టారు. ఉద్దంసింగ్‌ మరణవార్త-అతని దేశభక్తి, ధైర్యసాహసాలు కొనియాడుతూ ''లండన్‌ టైమ్స్‌'' రోమ్‌లోని''బెర్గెరెట్‌'' జర్మనీలోని ''బెర్లినర్‌ బోర్సెక్‌ సైటింగ్‌'' పత్రికలు ప్రశంసించాయి. కానీ, భారత జాతీయోద్యమ నేతలు మహాత్మాగాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ మొదలైనవారు ఉద్దంసింగ్‌ చర్యను ఖండించారు. మిఖైల్‌ డయ్యర్‌ హత్య సమర్ధనీయం కాదన్నారు. కానీ, భారత ప్రజలు ఉద్దంసింగ్‌ దేశభక్తిని, త్యాగనిరతిని కొనియాడారు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో భారత ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను సరిదిద్దుకుని-

''షహీద్‌-ఎ-ఆజం ఉద్దంసింగ్‌కు నా సాల్యూట్‌'' అన్నారు. 1974లో పంజాబు సుల్తాన్‌పూర్‌ శాసనసభ్యుడు సాధూసింగ్‌ తీర్దు ఉద్దంసింగ్‌ వీరగాథను ప్రభుత్వ దృష్టికి తెచ్చాడు. ఇందిరాగాంధీ దానికి స్పందించారు. ఇంగ్లండు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి-ఉద్దంసింగ్‌ అస్థికలను భారతదేశానికి తీసుకొచ్చారు. ఉద్దంసింగ్‌ మరణించిన 34 సంవత్సరాల తర్వాత అస్థికలను, అతను స్వగ్రామం సునామ్‌పూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. కొన్ని ఆస్థికలు గంగానదిలో కలిపారు. ఉద్దంసింగ్‌ వీరగాథ-అజరామరమైనది.

వీరుడు-అమరుడు-అజేయుడు-ఉద్దంసింగ్‌- వీరగాథలు నేటికీ పంజాబు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

ఖారవేలుడు - హాతిగుంఫా శాసనం


భువనేశ్వర్ వద్ద ఉదయగిరి కొండల్లో ఉన్న హాతిగుంఫా గుహ
 చేది వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు. హాతిగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందినాడు. 24 సం.ల వయస్సులోనే ఇతడు కళింగ రాజ్యాధినేత అయ్యాడు. కళింగులు నేటి ఉత్తరాంధ్ర, ఒరిస్సా ప్రాంతాలను పాలించిన రాజులు. కొన్ని చోట్ల ఆంధ్ర, కళింగ శబ్దాలు ఒకదానికొకటి కూడా వాడబడ్డాయి. మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం క్రీ.పూ.255లో జరిగింది. అది భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టము. తరువాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడచి ధర్మాన్ని, శాంతిని ప్రధాన పాలనా విధానాలుగా చేకొన్నాడు.

అశోకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత క్రీ.శ. 183లో ఖారవేలుడు కళింగ రాజయ్యాడు. మౌర్య సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన మొదటి స్వతంత్ర కళింగ రాజు ఇతడే. పాటలీపుత్రాన్ని పాలిస్తున్న పుష్యమిత్రుని ఓడించి మౌర్య రాజులు అంతకుముందు తీసుకువెళ్ళిన జైన విగ్రహాలను తిరిగి కళింగ రాజ్యానికి తీసుకొచ్చాడు. ఖారవేలుడు జైన మతస్థుడు, వృషభ లాంఛనుడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం.




ఖారవేలుని హాతిగుంఫా శాసనము
 ఖారవేలునికి సమకాలీనుడు ఆంధ్రదేశంలో శాతవాహన రాజు శాతకర్ణి. వారికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పిథుండ నగరాన్ని ఖారవేలుడు నాశనం చేశాడని హథీగుంఫ శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేము - "శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది) వరకు పురోగమించి ముషికనగరాన్ని హడలుకొట్టినాయట." ఏమయినా తరచూ కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుండ నగరం బహుశా "ప్రతిపాలపురం" లేదా భట్టిప్రోలు అయ్యి ఉండవచ్చును. ఖారవేలుడు సర్వ రాష్ట్రిక, భోజక ప్రభువులను ఓడించాడు. అంగ వంగ దేశాలనుండి రత్నాలు తెచ్చాడు. ఖారవేలుడు యుద్ధవీరుడే కాక ఎంతో సమర్ధత గల రాజు. పౌర జానపదులకు అనేక సౌకర్యాలు కలిగించాడు. అంతకు పూర్వం మగధ రాజులు వేయించిన కాలువలు పూడిపోగా ఖారవేలుడు వాటిని తిరిగి మరమ్మతు చేయించాడు. రాజధానికి నీటివసతి కల్పించాడు. జైనానికి ఇతోధికంగా ప్రోత్సాహం కలిగించాడు. 164 జైనమత గ్రంధాలను పునరుద్ధరించాడు. తుఫానులవలన పడిపోయిన గోపుర ప్రాకారాలను బాగుచేయించాడు. 35 లక్షల ప్రజలు అతని రాజ్యంలో ఉండేవారు.

జైనమత వ్యాప్తికి కృషి

క్రీ.పూ. 4వ శతాబ్దంలో జైనం మన రాష్ట్రంలోకి ప్రవేశించింది. కళింగరాజు ఖారవేలుడు ఆదరించడంతో ఈ మతం మొదటగా కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో స్థిరపడింది. అశోకుడి కుమారుడు సంప్రతి ఆంధ్ర, ద్రవిడ, దేశాలలో జైనమత వ్యాప్తికి కృషి చేశాడు. అమరావతికి సమీపంలో వడ్డమాను కొండపై సంప్రతి విహా రం ఏర్పాటు చేశాడు. అక్కడ ఖారవేలుడు మహామేఘ వాహన విహారం నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. క్రీస్తు శకారంభంలో కొండకుందా చార్యుడు అనంతపురంజిల్లా కొనకుండ్లలో జైన ఆశ్రమం నిర్మించుకుని మత ప్రచారం చేశాడు. పలు గ్రంథాలు రచించాడు. జైనంలో శ్వేతాం బరులు, దిగంబరులు అని రెండు వర్గాలున్నా ఆ ఇద్దరికీ అనుసరణయమైన సమయసార గ్రంథాన్ని రచించింది ఈ కొండకుందాచార్యుడే! అహింసా మార్గాన్ని జనం ఆదరించినా జైనం దీన్ని మరీ తీవ్రంగా ఆచరణలోకి తీసుకురావడంతో సామాన్యులకు దాన్ని అనుసరించడం కత్తిమీద సామైపోయేది. ఈ ఇబ్బందే జైనమతం ప్రాబల్యం తగ్గిపోడానికి ప్రధాన కారణమైంది. గాలిపీలిస్తే సూక్ఝక్రిములు చనిపోతాయని ముక్కు కు గుడ్డకట్టుకోవడం, మంచినీళ్ళను వడగట్టుకుని తాగడం, కాలికింద పడి క్రిములు చనిపోకుండా ఉండేందుకు నడిచే మార్గాన్నంతా చీపురుతో ఊడ్చుకుంటూ వెళ్ళాలనడం, నేలను దున్ని సేద్యం చేయడం హింసా మార్గమని వ్యవసాయం మానేసి పండి పడిన పళ్ళనే తిని జీవించడం వంటి విధానాలు చూసి సామాన్యులు భయపడి దూరమైపోయారు. ఉల్లి, వెల్లుల్లి తినరు. వడ్డీవ్యాపారం చేస్తారు.