Wednesday, July 3, 2013

PANCHAYAT SECRETARY (GRADE - IV) IN A.P. PANCHAYAT RAJ AND RURAL EMPLOYMENT SUBORDINATE SERVICE (GENERAL RECRUITMENT)

Recruitment Applications online are invited between 09.07.2013 to 31.07.2013 and the 
last date for payment of fee is 29.07.2013. 
The Written Examination is likely to be held on 15.09.2013. 

http://website.apspsc.gov.in/Documents/PRESSNOTE/464.pdf

కొలువుల జాతర

కొలువుల జాతరప్రభుత్వ ఉద్యోగ జాతరలో భాగంగా 24078 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. ఇందులో ఏపీపీయస్సీ- 1127, శాఖాపరమైన ఎంపిక కమిటీ- 702, ప్రాంతీయ ఎంపిక కమిటీ- 1741, డీయస్సీ- 20508 పోస్టులను భర్తీకి ఆర్థికశాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు అనుగుణంగా వెంటనే పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.


పాస్‌ చేస్తే రూ.10 లక్షలు

'పకడ్బందీ ప్రణాళికతోనే ఉద్యోగార్థులకు వల వేశాం. సంధ్యారాణి, ఇద్దరు మధ్యవర్తులు, మరో ఇద్దరు కలిసి ఇదంతా చేశాం. వీరంతా సంధ్యారాణి ద్వారానే నాకు పరిచయం అయ్యారు. మౌఖిక పరీక్షలో మార్కులు ఎక్కువ వేస్తే రూ.పదిలక్షల చొప్పున ఇస్తారంటూ సంధ్యారాణి చెప్పింది. దీంతో అందరం కలిసి పథకాన్ని అమలు చేశాం'' అని ఏపీపీఎస్సీ బోర్డు సభ్యుడు గూడూరి సూర్యవంశం సీతారామరాజు పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. ఏపీపీఎస్సీ ఉద్యోగ కుంభకోణం కేసులో అరెస్త్టెన సీతారామరాజు పోలీసుల విచారణలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. సంధ్యారాణి పరిచయం నుంచి ఉద్యోగార్థుల నుంచి డబ్బు తీసుకోవడం వరకూ జరిగిన పరిణామాలన్నింటినీ పోలీసులకు చెప్పారు. తనకు ఎలాంటి హాని ఉండదన్న భావనతోనే ఈ పనికి అంగీకరించానన్నారు. సీతారామరాజు చెప్పిన అంశాల ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగించనున్నామని హైదరాబాద్‌ సిటీ డీసీపీ(నేరాలు) ఎల్‌కేవీ రంగారావు మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈ కేసులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అర్హులైన వారి వద్ద రూ.పదిలక్షల చొప్పున డిమాండ్‌ చేసిన ఈ కుంభకోణంలో... ఢిల్లీలోని అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఎం.అరుణ్‌కుమార్‌, హైదరాబాద్‌లోని కె.ఎస్‌.రావు ఐ.ఎ.ఎస్‌. స్టడీ సర్కిల్‌ సంచాలకులు డాక్టర్‌ కొలకపూడి శ్రీనివాసరావులు పాత్రధారులుగా ఉన్నారు. వీరిద్దరూ సంధ్యారాణి ద్వారా సీతారామరాజుకు పరిచయం అయ్యారు. వృత్తిరీత్యా న్యాయవాదైన సీతారామరాజుకు సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే పరంధాములు కుమారుడు ఎ.రవిబాబు ఏడాదిన్నర క్రితం సంధ్యారాణిని పరిచయం చేశారు. అప్పటి నుంచి సంధ్యారాణి, సీతారామరాజులు అప్పుడప్పుడూ కలుసుకునేవారు. ఫోన్‌లోనూ మాట్లాడుకునేవారు. గత ఏడాది సెప్టెంబరులో సీతారామరాజు ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమితులయ్యారు. అప్పటి నుంచి తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలో సీతారామరాజు రెండు నెలల క్రితం సంధ్య ఇంటికి వెళ్లారు. మే 20 నుంచి పాలిటెక్నిక్‌ కళాశాలల్లో జూనియర్‌ లెక్చరర్ల ముఖాముఖి ఉందని ఆమెకు చెప్పారు. కొద్దిరోజులయ్యాక సంధ్య తన బాల్యమిత్రుడు ఢిల్లీలోని అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ అరుణ్‌కుమార్‌తో ఏపీపీఎస్సీ కార్యాలయానికి వచ్చారు. వారి పథకాన్ని వివరించారు.

సంధ్యారాణి, అరుణ్‌కుమార్‌లు తమకు తెలిసిన అభ్యర్థులున్నారని, మన చేతికి మట్టి అంటకుండా మధ్యవర్తులే చూసుకుంటారని సీతారామరాజుకు వివరించారు. అశోక్‌నగర్‌లోని కె.ఎస్‌.రావు ఐ.ఎ.ఎస్‌.అకాడమీ సంచాలకులు డాక్టర్‌ కె.ఎస్‌.రావు కూడా కొందరు అభ్యర్థుల నుంచి డబ్బు ఇప్పిస్తానని చెప్పారు. 2013 మే 12న మియాపూర్‌లోని సంధ్య ఇంట్లో కె.ఎస్‌.రావును సీతారామరాజు కలుసుకున్నారు. అభ్యర్థుల నుంచి వసూలు చేసిన డబ్బులను కె.ఎస్‌.రావు ఇస్తారని సంధ్య వివరించింది. హిమాయత్‌నగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగులు షేక్‌ అంజావలి, కళ్యాణ్‌నగర్‌లోని పి.సతీష్‌కుమార్‌లు డబ్బు వ్యవహారంలో మధ్యవర్తులని సీతారామరాజుకు చెప్పారు. జూన్‌ 3, 2013న మాదాపూర్‌లోని ఫార్చ్యూన్‌ టవర్స్‌లో ఉంటున్న ఫణికిరణ్‌ ఇంటికి రావాలంటూ సంధ్య సీతారామరాజుకు చెప్పింది. దీంతో ఆయన అక్కడికి వెళ్లారు. అక్కడ విశాఖపట్నంలోని మహారాజ సహకార పట్టణ బ్యాంక్‌ అధ్యక్షుడు ఎం.ఆర్‌.కె.రాజు ఉన్నారు. ఆయనను సీతారామరాజుకు సంధ్య పరిచయం చేశారు. కొద్దిసేపయ్యాక సంధ్య బయటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చింది. వీరిద్దరూ చెరో పదిలక్షల రూపాయలిస్తారంటూ వివరించింది. వీరిని మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ)లో పాస్‌చేయాలంటూ కోరింది. ఒప్పందం కుదిరాక వారు వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై ఆరోపణలు రావటంతో ఏపీపీఎస్సీ కార్యదర్శి చారుసిన్హా సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత నెల సంధ్యను అరెస్ట్‌చేయగా సోమవారం రాత్రి సీతారామరాజును అరెస్ట్‌ చేశారు.అరెస్టయిన ఏపీపీఎస్‌సీ సభ్యుడు సీతారామరాజును మంగళవారం ఉదయం చంచల్‌గూడ జైలుకు తరలించారు. సీసీఎస్‌ పోలీసులు ఆయన్ను సోమవారం అర్ధరాత్రే న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.

Monday, July 1, 2013

ప్రభుత్వ పరిశీలనలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు

- తరువాత ఖాళీలకు ఇంకా ఆమోద ముద్ర రాలేదు
- వాటిని కూడా భర్తీ చేయాలని నిరుద్యోగుల అభ్యర్థన
- ఇతర పోస్టులతో నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సన్నాహాలు!

సర్కారీ కొలువులపై కోటి ఆశలతో 15 లక్షల మందికిపైగా నిరుద్యోగులు గ్రూప్-1, గ్రూప్-2 లాంటి ప్రధాన పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారిలో ప్రధానంగా సగం మంది నిరీక్షణ వీటి కోసమే! ఎక్కువ పోస్టులతో కొత్త నోటిఫికేషన్లు వస్తాయని భావిస్తున్న వీరంతా ప్రభుత్వం ఇంతవరకు ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు ఇంతవరకూ అనుమతి ఇవ్వడంతో ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి వరకూ ఏర్పడిన అన్ని ఖాళీలను గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లలో చేర్చాలని కోరుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 2010 తరువాత ఖాళీలు ఏర్పడిన 600కిపైగా పోస్టుల భర్తీ ఆర్థికశాఖ, ప్రభుత్వం పరిశీలనలో ఉంది. మరోవైపు ఏపీపీఎస్సీ తనకు అందిన వివరాలతో ఈ నెలలోనే ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసి అనంతరం నోటిఫికేషన్లను కూడా జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని ఖాళీలకూ నోటిఫికేషన్లు రావేమోననే ఆందోళన అభ్యర్థులను పీడిస్తోంది. ఆలస్యమైనా.. అన్నీ ఇవ్వండి కాస్త ఆలస్యమైనా సరే, 2010 తరువాత ఏర్పడిన ఖాళీలను కూడా కలిపి అన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నికల నేపథ్యంలో హడావుడి గా నోటిఫికేషన్లు ఇవ్వడం కాకుండా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వేల రూపాయలు ఫీజులు చెల్లించి కోచింగ్ తీసుకుంటున్నామని, అప్పులు చేసి నాలుగైదేళ్లుగా హాస్టళ్లలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నామని పేర్కొంటున్నారు. వయోపరిమితి పెంపుతో ఊరట కొంతే.. ఆర్థికశాఖ 33 వేల పోస్టుల భర్తీకి ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2 లాంటి పోస్టులు తక్కువగానే ఉన్నాయి. గ్రూప్-2 కేటగిరీలో ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 314 వరకు ఉన్నాయి. వీటికి గరిష్ట వయోపరిమితి జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లే. దీంతో మెజారిటీ అభ్యర్థులకు ఈ పోస్టులకు అర్హత ఉండదు. గరిష్ట వయోపరిమితి 5 ఏళ్లకు పెంచాలని ఐదు లక్షల మంది నిరుద్యోగులు వేడుకుంటే ప్రభుత్వం రెండేళ్లు మాత్రమే పెంచింది. అదికూడా 2011 తరువాత నోటిఫికేషన్లు ఇవ్వలేదు కాబట్టి గరిష్ట వయోపరిమితి రెండేళ్లు పెంచి ఆ లోటును మాత్రమే పూడ్చింది. వయోపరిమితిపరంగా నిరుద్యోగులకు అదనంగా ఒనగూరిన ప్రయోజనం పెద్దగా లేదని అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-1, గ్రూప్-2లో అనుమతి లభించాల్సిన పోస్టులు.. గ్రూప్-1, గ్రూప్-2 కేటగిరీల్లోనే 600లకు పైగా పోస్టులకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి లభించలేదని, ఇతర కేటగిరీల్లోనూ చాలా పోస్టులకు అనుమతి రాలేదని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. గ్రూప్-2 కేటగిరీలోని ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో 24 సబ్ రిజిస్ట్రార్, 183 డిప్యూటీ తహసీల్దార్, 99 అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, 10 మున్సిపల్ గ్రేడ్-3 కమిషనర్, 184 కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ పోస్టులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. గ్రూప్-1 కేటగిరీలో 33 కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, 8 గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులతో మరికొన్ని కేటగిరీలకు చెందిన పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఖాళీ పోస్టులు అన్నిటికీ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.