Monday, March 18, 2013

AN APPEAL TO GROUP 2 2011 SELECTED CANDIDATES



విజ్ఞప్తి


గ్రూప్ – 2 2011 ఉద్యోగాల ఎంపిక కొరకై సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు అవుతున్న అభ్యర్థులందరికీ ఒక మనవి, ముఖ్యంగా ఇదివరకే ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ఉన్నత పదవులకై ఈ పరీక్షను వ్రాసిన అభ్యర్థులకు మనవి చేసేది ఏమనగా, మీరు చెక్ లిస్టు ఫారం నింపే ముందు మీ సోదర నిరుద్యోగ మిత్రుల గురించి ఒక్క క్షణం ఆలోచించండి. మీరు అంగీకరం(Preference) తెలిపిన పోస్టులలో కచ్చితంగా చేరుతాను అని అనుకొన్న పోస్టులకు మాత్రమే మీ అంగీకారాన్ని తెలపండి. మీకు ఇష్టం లేని పోస్టులకు ఒకవేళ మీరు ఆ పోస్టులకు ఎంపిక అయినప్పటికీ కూడా చేరను అనుకొన్న వాటికీ మీ అంగీకారం తేలపవద్దు వాటిని ఖాళీగా(Blank) వదిలివేసి  వాటిని “నాట్ విల్లింగ్” జాబితాలో మాత్రం స్పష్టంగా పేర్కొనండి. దీనివల్ల ఇదివరకు ఏ ఉద్యోగం లేని కొందరు అభ్యర్థులు ఆ ఉద్యోగాలను పొందుతారు.
  
ఉదాహరణకు గ్రూప్ – 2 2011 నోటిఫికేషన్ లో 7 ఎగ్జిక్యుటివ్ పోస్టులు ఉన్నపటికీ అందులో ఒకటి లేదా రెండు పోస్టులకు మాత్రమే ఇది వరకే ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఆసక్తి చూపిస్తారు కానీ, మిగిలిన పోస్టుల పై అంతగా ఆసక్తి చూపించరు.  ఒకవేళ మీరు చెక్ లిస్టు ఫారంలో ఈ 7 ఎగ్జిక్యుటివ్  పోస్టులన్నిటికీ  అంగీకారం తెలిపి ఫైనల్ సెలక్షన్ లిస్టులో మికు ఆసక్తి లేని పోస్టుకు మీరు ఎంపిక కాబడినట్లైతే మీకు ఆ పోస్టుపై ఆసక్తి లేదు కనుక మీరు ఆ పోస్టులో చేరకపోవటంతో ఆ పోస్టు నాన్ జాయినింగ్ పోస్టుగా మిగిలిపోయి తరువాత నోటిఫికేషన్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నది. దీనివల్ల మీ తరువాత ఉన్నటువంటి ఏ ఉద్యోగం లేని మన నిరుద్యోగ మిత్రులు నష్టపోతున్నారు. ఇలా ప్రతి గ్రూప్ – 2 నోటిఫికేషన్లో కనీసం నూటయబై ఉద్యోగాల వరకు వృదాగా మిగిలిపోతున్నాయి.

అందుకే ఇదివరకే ఉద్యోగాలు పొంది ఉన్న అభ్యర్థులకు మనవి చేసేది ఏమనగా  మీరు ఖచ్చితంగా చేరుతాను అని అనుకొన్న పోస్టులకు మాత్రమే మీ అంగీకారాన్ని తెలిపి మిగిలిన వాటిని దయచేసి ఖాళీగా వదిలివేసి ఒక నిరుద్యోగ మిత్రుడికి సహాయం చేయండి.  నిరుద్యోగ సమస్య తీవ్రత గుర్తించి, ఆసక్తి లేని పోస్టులను “నాట్ విల్లింగ్” జాబితాలో స్పష్టంగా పేర్కొనండి.


    ఇట్లు
దీటి శ్రీకాంత్ 



180 మంది ఎక్సైజ్‌ ఎస్సైలకు అస్వస్థత


శిక్షణ శిబిరంలో అసౌకర్యాల కారణంగా ఎక్సైజ్‌ శాఖ ప్రొబేషనరీ ఎస్సైలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శిక్షకులు, ఉన్నతాధికారులు తీవ్రతను గుర్తించకపోవడంతో ఒకేసారి 180 మంది అస్వస్థత బారినపడ్డారు. గొంతునొప్పి, జ్వరంతో ఉక్కిరిబిక్కిరవుతున్న వీరిని నల్లకుంట ఫీవరాసుపత్రిలో చేర్పించారు. రెండుమూడు రోజులుగా కొందరు జ్వరంతో బాధపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరిగిందని బాధితులు ఆరోపించారు. శిక్షణలో ఉన్నవారిలో దాదాపు అందరూ అనారోగ్యంతో ఉండడంతో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఎక్సైజ్‌ కమిషనర్‌ సమీర్‌శర్మ పరామర్శించారు. శిక్షణను రెండు వారాల పాటు వాయిదా వేశారు. వారిని మరోచోటికి మార్పించారు. మొదట్లో వీరికి కంఠసర్పి (డిఫ్తీరియా) అనుకున్నామని, ప్రాథమిక పరీక్షల అనంతరం కాదని తేలడంతో ఇతర పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు.

హైదరాబాద్‌ శివారు బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీలో 183 మంది ప్రొబేషనరీ ఎస్సైలు ఫౌండేషన్‌ కోర్సు శిక్షణ పొందుతున్నారు. వీరంతా 2008 గ్రూప్-2 నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన వీరికి కొద్దిరోజులుగా ఇక్కడ శిక్షణ ఇస్తున్నా.. శిబిరంలో సరైన వసతులు లేవు. తాగేందుకు నీళ్లు కూడా అభ్యర్థులే కొనుక్కొంటున్నారు. శిక్షణలో భాగంగా వ్యాయామాలు, ఎండలో పరిగెత్తడం వంటివి చేయిస్తుండగా.. నాలుగైదు రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో కొందరికి జ్వరం వచ్చింది. జ్వరం, ఒళ్లు నొప్పులకు గొంతు నొప్పి కూడా తోడైంది. పదిమంది దాకా అనారోగ్యంతో బాధపడుతున్నా వారిని అక్కడే ఉండాలంటూ అధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రానికి యాభైమందికిపైగా జ్వరం బారిన పడగా.. శనివారం మధ్యాహ్నం అధికారులు స్పందించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈలోపు మిగతా వారందరికీ వ్యాపించింది. గొంతునొప్పి ఉండడంతో కంఠసర్పిగా భావించి ఆదివారం ఉదయం సుమారు 50 మందిని నల్లకుంట ఫీవరాసుపత్రికి తీసుకువచ్చారు. వీరిలో పది మంది మహిళా ఎస్సైలున్నారు. ప్రాథమిక పరీక్షల అనంతరం ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వైద్యులు నిర్ధరించారు. ఆరోగ్యంపై ఆందోళనతో వందమందికిపైగా ఎక్సైజ్‌ ఎస్సైలు వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. మరికొంతమందిని కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్లారు. మూకుమ్మడిగా అనారోగ్యం ఎందుకు సోకిందన్న అంశంపై విచారణ జరిపిస్తున్నామని, శిక్షణలో లోపాలుంటే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ కమిషనర్‌ సమీర్‌ శర్మ తెలిపారు. ఆసుపత్రిలో చేరిన వారిలో ఎవరికి కంఠసర్పి లేదని ఫీవరాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని చెప్పారు. 20 మందికి నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని, వారికి డిఫ్తీరియా లేదని స్పష్టం చేశారు.ఎక్సైజ్‌ ఎస్సైలకు ప్రారంభ కోర్సు కింద రెండు బ్యాచుల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉండగా అందరికీ ఒకేసారి మొదలుపెట్టారు. అకాడమీలో సరైన వసతి లేకపోవడంతో అందరూ సమీప హాస్టళ్లు, బంధువుల ఇళ్ల నుంచి వస్తున్నారు. అకాడమీలో మెస్‌ పూర్తిగా మూతపడింది. తాగునీరు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం కోసం ఒక్కొక్కరి నుంచీ రూ.135 చొప్పున తీసుకుంటున్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నెలకొల్పిన ఎక్సైజ్‌ అకాడమీలో తాగునీరు, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌, సరైన డ్రైనేజి వ్యవస్థ, పెరుగుతున్న శిక్షణార్థులకు తగిన సంఖ్యలో గదులు, బాత్‌రూంలు, మరుగుదొడ్లు నిర్మాణం కాలేదు. సిబ్బందీ అరకొరగానే ఉన్నారు. మురుగు నీరు, దుమ్ము, ధూళిలోనే శిక్షణ ఎస్సైలతో పనులు చేయిస్తున్నారు. ఇన్నేసి అసౌకర్యాల మధ్య సహజీవనం చేయడంతో శిక్షణలోని ఎస్‌ఐ అభ్యర్థులు అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది.

Tuesday, March 12, 2013